
పర్లాఖెముండి: గజపతి జిల్లా రాయగడ సమితి చంపసాహి గ్రామానికి చెందిన కహ్ను బుయన్ రాష్ట్రస్థాయి నీట్ పరీక్షల్లో 21వ ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో పర్లాఖెముండి నియోజకవర్గ ఎమ్మెల్యే రూపేశ్ పాణిగ్రహి పట్టణంలోని రామనగర్లోని హైటెక్ ప్లాజా వద్ద కహ్నూ బుయన్ను అభినందించారు. ఈ సందర్భంగా రూ.40వేల ఆర్థిక సాయం అందించడంతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఉన్నత విద్యనభ్యసించడానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థికి సూచించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.