
ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీలు తమ వాహనాలను మరింత సామర్థ్యంతో మంచి మైలేజీ ఇచ్చేలా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఈ దిశగా జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన ప్రత్యేకమైన ఇ-పవర్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఓ కొత్త మైలురాయిని సాధించింది. నిస్సాన్ ఖష్కాయ్ హైబ్రిడ్ ఎస్యూవీ ఎలాంటి బాహ్య ఛార్జింగ్ లేకుండా, పెట్రోల్ రీఫిల్ చేయకుండా ఒకే ఫ్యూయల్ ట్యాంకుతో 1,980 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత సుదూర ప్రాంతాన్న అధిగమించిన నాన్-ప్లగ్-ఇన్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీగా ఇది రికార్డు సాధించింది.e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!గొప్ప మైలేజ్విశేషమేమిటంటే, ఈ కారు ఈ రికార్డును ఏదో మూసివున్న ప్రయోగశాలలో కాకుండా, నిజమైన రహదారి, ట్రాఫిక్ పరిస్థితులలో నెలకొల్పింది. ఖష్కాయ్ 55-లీటర్ల ఇంధన ట్యాంక్ ఆధారంగా ఈ కారు లీటరుకు సుమారు 36 కిలోమీటర్ల (36 కిమీ/లీ) ఆకట్టుకునే మైలేజీని సాధించింది. ఈ ప్రయాణం 2026 జూలై 14 నుంచి 17 మధ్య కొలంబియాలో జరిగింది. ఈ వాహనం సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న బొగోటా నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి కరేబియన్ తీరానికి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మార్గమధ్యలో హైవేలు, నగర ట్రాఫిక్, అనేక కష్టతరమైన మార్గాలు ఉన్నాయి. ఎత్తు నుంచి కిందికి దిగేటప్పుడు వాహనంలోని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, వాలుపై బ్రేక్ వేయడం వల్ల ఉత్పత్తి అయిన శక్తిని తిరిగి విద్యుత్తుగా మార్చి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.అనుభవజ్ఞులైన డ్రైవర్ల కచ్చితమైన వేగ నియంత్రణ, నిస్సాన్ ఇ-పవర్ సిస్టమ్ కారణంగా వాహనం అంత సుదీర్ఘ దూరాలను ప్రయాణించగలిగింది.ఈ కారు ఎలాంటి బాహ్య ఛార్జింగ్ లేదా ఇంధనం నింపకుండా అత్యంత సుదూర ప్రయాణం చేసే నాన్-ప్లగ్-ఇన్ ఎక్స్టెండెడ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో ప్రవేశించింది.నిస్సాన్ ఇ-పవర్ టెక్నాలజీ ఎలా భిన్నమైనది?సాధారణంగా హైబ్రిడ్ కార్లను తిప్పడానికి