
నయనతార (Nayanthara) గుండుతో ఉన్నట్లుగా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఆ ఫోటోలు నిజమైనవి కావు. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించినవిగా గుర్తించారు. వైరల్ అవుతున్న చిత్రాల్లో నయనతార గుడి బయట గుండుతో కనిపించడంతో, ఆమె తన రాబోయే చిత్రం టాక్సిక్ (Toxic) కోసం పూర్తిగా కొత్త లుక్లోకి మారిందా అనే చర్చ మొదలైంది. అయితే, ఈ చిత్రాల్లో ఉన్న AI వాటర్మార్క్ తో అసలు విషయం బయటపడింది. వాస్తవానికి, ఈ ఫోటోలకు సంబంధించిన అసలు చిత్రాలు ఏప్రిల్ 2026లో నయనతార తిరుమలను సందర్శించినప్పటివి. ఆమె తన భర్త, చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్తో కలిసి తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో తీసిన అసలు ఫోటోలను డిజిటల్గా మార్చి, నయనతార గుండుతో ఉన్నట్లుగా ఈ వైరల్ చిత్రాలను రూపొందించారు. టాక్సిక్ (Toxic) కోసం నయనతార గుండు చేయించుకున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
.