
ఒక దశకు చేరుకున్న తర్వాత హీరోయిన్లు పిల్లలు, ఫ్యామిలీకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఆ విషయం మరోసారి నయనతార(Nayanthara)తో ప్రూవ్ అయింది. ఆమె చాలా లేట్ వయసులో పిల్లలు కలిగారు. అది కూడా సరోగసీ ద్వారా. 40 ప్లస్ ఏజ్ లో కూడా ఆమెకి ఇంకా హెరాయిన్ గా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఐతే, సినిమాలు ఒప్పుకునే విషయంలో మాత్రం ముందు తన పిల్లల గురించి ఆలోచిస్తాను అంటోంది. తన పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఎక్కువ కాలం చెన్నైకి దూరంగా ఉండకుండా, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద నగరాల్లో లేదా వాటికి దగ్గరగా షూటింగ్ ఉండేలా చూసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్లే సదుపాయం ఉంటుంది కదా. సినిమాలు ముఖ్యమే కానీ ప్రస్తుతం తనకు తన పిల్లలను పెంచడం, వారిని చూసుకోవడం మొదటి ప్రాధాన్యం అంటోంది. అందుకే, తాను సినిమాలు ఒప్పుకునే విషయంలో ఇవి చూసుకుంటోంది. ఆమె భర్త విగ్నేష్ శివన్ కూడా డైరెక్షన్ చెయ్యడం లేదు. ఆ మధ్య చేసిన ఒక మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడికి వెళ్తున్నాడు. వీరిద్దరికీ ట్విన్స్ పుట్టారు…సరోగసి వల్ల. నయనతార ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా వంశీ పైడిపల్లి తీస్తున్న హిందీ చిత్రంలో నటిస్తోంది
.