
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరఫున నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడ, ఆగస్టు 15: కులం, మతం లేని ఏకైక జాతీయ పండుగ జెండా పండుగ అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరఫున నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇక్కడ వాతావరణం చూశాక స్కూల్ రోజులు గుర్తుకు వచ్చాయని తెలిపారు. జెండాలు కట్టి, పోటీల్లో పాల్గొని జెండా పండుగ రోజు బహుమతులు అందుకునే వాళ్లమని చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. ప్రతి ఇంటి పైనా జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని మంత్రి కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. మువ్వన్నెల జెండా మన ఆత్మ విశ్వాసంగా పేర్కొన్నారు. పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు అందరికీ స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ నడయాడిన జిల్లాలో జాతీయ పతాకం ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. ‘మహిళలను గౌరవించండి.. భరోసా కలిగించండి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామని.. అనేక ఖాళీలను భర్తీ చేసేలా ముందుకు సాగుతున్నామని లోకేశ్ వెల్లడించారు. ప్రధాని మోదీ అండగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించారని తెలిపారు. పోలవరం పూర్తి చేస్తున్నామని.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడామని చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాములు త్యాగాల ఫలితంగా నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని.. హైదరాబాద్ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. 2014