
Principal Murder: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.రూపారెడ్డి దారుణ హత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థితో పాటు పూర్వ విద్యార్థులు ముగ్గురు కలిసి ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ నెల 11న కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో ఉన్న తన నివాసంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి తీవ్ర కత్తిపోట్లతో శవమై కనిపించారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమెను దారుణంగా పొడిచి చంపేశారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు పడకుండా నిందితులు ముందస్తు జాగ్రత్తగా గ్లౌజులు ధరించడంతో పోలీసులకు ఎలాంటి క్లూస్ దొరకలేదు. కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తొలుత 20 నుంచి 25 ఏళ్ల యువకులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావించారు. హత్య వెనుక ఉన్న అసలు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు కొండమల్లేపల్లి వ్యాప్తంగా జల్లెడ పట్టాయి. స్కూల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు సహా దాదాపు 80 మందిని సమగ్రంగా విచారించారు. నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేపట్టాయి. సీసీటీవీ దృశ్యాలను సెకన్ల వ్యవధిలో క్షుణ్ణంగా పరిశీలించగా కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన కొంతమంది కుర్రాళ్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. వారిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు నెమ్మదిగా ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. ఈ దారుణ హత్య వెనుక ప్రధానంగా నగదు దోపిడీ కోణమే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూపారెడ్డిని చంపేసిన అనంతరం ఇంటి నుంచి సుమారు రూ.4 లక్షల నగదును నిందితులు అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. కేవలం డబ్బు కోసమే గురువు స్థానంలో ఉన్న ప్రిన్సిపల్ను బలి తీసుకున్నారా లేక వారి మధ్య మరేదైనా పగ ఉందా అనే కోణంలో