
MAD
<figure><img src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/MLCs-Tata-Madhu-and-Naveen-Reddy-1024x576.jpg" class="attachment-large size-large wp-post-image" alt="MLCs Tata Madhu and Naveen Reddy" decoding="async" fetchpriority="high" /></figure><p><strong>Tata Madhu :</strong> బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. స్పీకర్ను దూషించారన్న కేసులో వీరిద్దరి రిమాండ్ను కోర్టు తిరస్కరించింది. రూ. 10వేల పూచీకత్తుతో రెండు షూరిటీలను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.</p> <p>షూరిటీలు సమర్పించిన తర్వాత ఎమ్మెల్సీలను విడుదల చేయాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తాతా మధు, నవీన్కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.</p> <p><strong>Read Also : <a href="https://10tv.in/telugu-news/telangana/tragedy-in-telangana-assembly-naveen-mittals-ps-raju-dies-suddenly-sh-1134325.html">Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం.. విధుల్లోనే నవీన్ మిట్టల్ పీఎస్ రాజు మృతి</a></strong></p> <p>ఈ ఇద్దరిని మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్ ఓఎస్డీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరిని నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే, ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి రిమాండ్ విధించేందుకు తిరస్కరించింది.</p> Tata Madhu : నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి ఊరట లభించింది. వారిద్దిర రిమాండ్ తిరస్కరిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.