
బంగారాన్నే ఇప్పుడు అత్యంత విలువైనదిగా చూస్తున్నాం. కానీ దీని కన్నా విలువైన మొక్క ఒకటుంది. ఆ మొక్క ఎక్కడో కాదు మనదేశంలోనే ఉంది. బంగారం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ విలువైన మొక్కగా దీన్ని పరిగణిస్తారు. ఈ మొక్క ఆకులనే వేల రూపాయలు పెట్టి కొంటారు. చైనా ఈ మొక్కల కోసం దొంగ దారులు వెతికి అక్రమంగా మొక్కలను దొంగిలించి అమ్ముకుంటోంది. ఇంత విలువైన ఆ మొక్క పేరు 'మిష్మి తీతా'. ఈ మొక్క కథేంటో పూర్తిగా తెలుసుకోండి. మిష్మి తీతా మొక్క అరుదైనది. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువ. దీని శాస్త్రీయ నామం 'కాప్టిస్ తీతా'. ఇది మనకు హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. దీని వేర్లు చాలా చేదుగా ఉంటాయి. ఈశాన్య భారత భాషల్లో 'తీతా' అంటే చేదు అని అర్థం. అందుకే దీన్ని మిష్మి తీతా అని పిలుచుకుంటారు. సాంప్రదాయ ఆయుర్వేదం, చైనీస్ వైద్య విధానం, ఈశాన్య భారత గిరిజన వైద్యంలో ఈ మొక్కలోని భాగాలను అనేక రకాలుగా వాడతారు. ఈ మొక్క ఆకుల్లో 'బెర్బెరిన్' అనే ముఖ్యమైన రసాయనం ఉంటుంది. దీనివల్ల మలేరియా, కంటి సమస్యలు, కడుపునొప్పి, జ్వరం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మిష్మి తీతా మొక్కలు ఎక్కడ పడితే అక్కడ బతకలేవు. కొన్ని వాతావరణాల్లోనే జీవించడగలవు. ఈ మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణ కలిగిన అరుణాచల్ ప్రదేశ్లోని 'మిష్మి కొండల్లో' (Mishmi Hills) ఇది ఎక్కువగా పెరుగుతుంది. చైనాలోని టిబెట్ సరిహద్దు, మిజోరాం, నాగాలాండ్, మయన్మార్ సరిహద్దు అడవుల్లో కూడా ఈ మొక్కలు అరుదుగా దొరుకుతూ ఉంటాయి. సముద్ర మట్టానికి 2,000 నుంచి 3,000 మీటర్ల ఎత్తులో, తేమ, చల్లగా ఉండే సతత హరిత అడవుల్లో మాత్రమే ఈ మొక్కలు పెరగగలవు. అయితే ఈ మొక్కలను విపరీతంగా వాడేయడం… ఇతర దేశాలకు అక్రమ రవాణా చేయడం వల్ల ఇప్పుడు ఈ మొక్కలు అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి