
శ్రీలంకపై తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అదరగొట్టాడు. తన రెండో టెస్టులోనే ఏకంగా 10 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ అద్భుత ప్రదర్శన వెనుక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. శ్రీలంక పరిస్థితులకు త్వరగా అలవాటు పడేందుకు ఇంట్లోనే కూకాబుర్రా బంతితో సాధన చేసినట్లు సుతార్ వెల్లడించాడు.గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయానికి సుతార్ బౌలింగ్ ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో సుతార్ 55 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్లో మొత్తంగా 101 పరుగులకు 10 వికెట్లు సాధించాడు. రెండో టెస్టు ఆడుతున్న 22 ఏళ్ల సుతార్కు ఇది అద్భుతమైన ప్రదర్శన.ఆఫ్ఘనిస్థాన్తో మ్యాచ్ తర్వాత తన దృష్టంతా కూకాబుర్రా బంతికి అలవాటు పడటంపైనే పెట్టినట్లు సుతార్ తెలిపాడు. నెట్స్లోనే కాకుండా ఇంట్లో కూడా ఆ బంతితో సాధన చేశానని చెప్పాడు.‘‘క్రికెట్ను నేను చాలా సీరియస్గా తీసుకుంటా. రోజురోజుకూ మెరుగుపడటమే నా లక్ష్యం. శ్రీలంక సిరీస్కు ముందు వీలైనంత ఎక్కువగా కూకాబుర్రా బంతితో ప్రాక్టీస్ చేశా. ఇంట్లో, నెట్స్లో సాధన చేశా. ఇన్హౌస్ గేమ్స్పైనా దృష్టి పెట్టా’’ అని సుతార్ చెప్పాడు.టెస్టుకు 10 రోజుల ముందే భారత జట్టు శ్రీలంకకు చేరుకోవడం తనకు బాగా ఉపయోగపడిందని సుతార్ తెలిపాడు. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఆ సమయం ఎంతో