
ఇంటర్నెట్ డెస్క్: నటి మమితా బైజు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో జరగనున్న ‘క్లైడ్ ఓనం 2026’ వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అనారోగ్యం కారణంగా ఈ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ వెల్లడించింది. ఓనం వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ ఓ వీడియో పంచుకుంది. అందులో మమిత మాట్లాడుతూ.. వైద్యుల సలహా మేరకు ప్రయాణం చేయలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పారు (Mamitha Health Update). త్వరలోనే అభిమానులను కలుసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మమిత వరుస విజయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె నటించిన మూడు చిత్రాలు నెల రోజుల వ్యవధిలోనే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన మలయాళ చిత్రం ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ తెలుగు విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 4న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు