
నిజాం వ్యతిరేక పోరాట సమయంలో ఉద్యమ రహస్యాలు చెప్పాలని రజాకార్లు ఆయనను చెట్టుకు కట్టేసి చావబాదినా, చివరికి గుండెకు తుపాకి గురిపెట్టినా ఆయన వెరవలేదు. సామ్యవాద సమాజ లక్ష్యంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ కమ్యూనిస్టు పార్టీ నేతగా ప్రముఖ పాత్ర పోషించారు. ఆ తర్వాత సూర్యాపేట నుంచి ఏకంగా నాలుగు సార్లు శాసనసభ సభ్యుడిగా సేవలందించారు.





