
పరకాలలో వచ్చే ఎన్నికలలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని, మళ్లీ ఆయనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఇటీవల జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయన్న కొండా సుస్మితగత ఎన్నికలలో ఐదారు నియోజకవర్గాలలో విజయం సాధించడానికి తన తండ్రి కొండా మురళి ఎంతో కష్టపడ్డారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొండ మురళి రేవంత్ రెడ్డి కళ్ళకు కనిపించడం లేదని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని కొండా సుస్మిత అన్నారు. అంతేకాదు సీఎం రేవంత్రెడ్డిని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత హెచ్చరించారు.రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతా: కొండా సుస్మిత ఈరోజు కొండా సురేఖ జన్మదిన వేడుకలను పరకాలలో నిర్వహించగా ఆ కార్యక్రమంలో కొండ సుస్మిత పాల్గొన్నారు. భారీ కాన్వాయ్ తో బలప్రదర్శన చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. తను చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతానని అన్నారు. తమ్ముడి రూ.200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే ఇప్పటివరకు మాట్లాడానని, కౌంటర్ ఇస్తే అన్నీ బయటపెడతానని హెచ్చరించారు.పరకాల గడ్డ తమ అడ్డా అని పేర్కొన్న కొండా సుస్మితఅంతేకాదు పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదని, రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకు కూడా తెలియదని అన్నారు. గత ఎన్నికల సమయంలో కొండా మురళి రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచాడని వ్యాఖ్యలు చేశారు. పరకాల గడ్డ తమ అడ్డా అని పేర్కొన్న కొండా సుస్మిత, రేవూరి ప్రకాష్ రెడ్డిని రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు అభ్యర్థిగా ఇప్పుడే ప్రకటించడంపైన అసహనం వ్యక్తం చేశారు.రాజీనామా చేసి పోటీ