
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాయనున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్నారు. హైదరాబాద్, ఆగస్టు 20: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాయనున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్నారు. నిన్న(బుధవారం) సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత.. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ.. కొండా సుస్మిత పటేల్కు కాంగ్రెస్ సభ్యత్వం లేకపోవడంతో సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గతంలోనూ సీఎంపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేయగా.. కూతురి తరఫున సీఎంకు కొండా సురేఖ క్షమాపణ చెప్పిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలపై.. క్రమశిక్షణ కమిటీకి ఇచ్చే వివరణలో మంత్రి ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్న దానిపై నెలకొన్న ఉత్కంఠ నెలకొంది. కూతురి వాఖ్యలను సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా అనేది తెలియాల్సి ఉంది. లేదంటే కూతురు చేసిన వాఖ్యలను ప్రస్తావించకుండా పరకాల అంశాన్ని లేవనెత్తుతారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. నగల బ్యాగ్ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత హైదరాబాద్లో షహజాద్ భట్టీ నెట్వర్క్ జాడలు
Read Latest Telangana News And Telugu News