
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్లో తెలుగు అందం మెరిసింది. నమ్ముడి ఐర్లాండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన మిస్ ఇండియా యూనివర్స్ 2026 (Miss India universe Ireland 2026) అందాల పోటీల్లో తెలుగు యువతులు రాణించారు. ఈ నెల 8న డబ్లిన్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో అక్కడ నివసిస్తున్న భారతీయ యువతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో మొదటి రన్నరప్గా ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత ఎంపిక కాగా.. రెండో రన్నరప్గా వరంగల్కు చెందిన రాజరాజేశ్వరి నిలిచారు. ఎమ్మెస్ పూర్తి చేసిన నిఖిత అక్కడే ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె తల్లి సునీత వైరా పురపాలికలో కౌన్సిలర్గా ఉన్నారు. తమ కుమార్తె అందాల పోటీల్లో భారతదేశం గర్వించేలా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వైరాలో నిఖిత కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఈ పోటీలు మూడు రౌండ్లలో జరిగాయని, అందం, ధైర్యం, వైఫల్యాలను అధిగమించి విజయం సాధించడం వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారని నిఖిత తెలిపారు. తుది పోటీలకు 18మంది ఎంపిక కాగా.. కేరళకు చెందిన అనుమోల్ విజేతగా నిలవగా.. తెలుగు యువతులు నిఖిత తొలి రన్నరప్గా, రాజరాజేశ్వరి రెండో రన్నరప్గా నిలవడం విశేషం. విజేతకు 1500 యూరోల ప్రైజ్ మనీ ఇవ్వగా.. మొదటి రన్నరప్కు 1000 యూరోలు, రెండో రన్నరప్కు 750 యూరోలు చొప్పున అందజేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు