తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత , తమిళనాడు సీఎం జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్ భేటీ ఆసక్తికరంగా మారింది. రాధన్ హైదరాబాద్లో కవిత ఇంటికి వెళ్లి కలిశారు.. ఆయన్ను కవిత, తన కుమారుడితో కలిసి సత్కరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రాధన్ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మరీ కవితను కలవడంపై చర్చనీయాంశమైంది. కవిత ఆయన్ను పిలపించారా.. ఆయనే ఇక్కడికి వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. కవిత తన రాజకీయ భవిష్యత్ గురించి ఏదైనా ఆరా తీశారా అనే చర్చ మొదలైంది.చాలామంది రాజకీయ నేతలు పండితులు, జ్యోతిష్యుల్ని నమ్ముతుంటారు.. వారు నిర్ణయించిన ముహూర్తాల్లోనే పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం, రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడం, ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయడం, ప్రత్యేక పూజలు చేయించడం వంటి వాటి కోసం జ్యోతిష్యుల్ని సంప్రదిస్తుంటారు. కవిత కూడా తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడ్ని సలహాల కోసం సంప్రదించారా అనే చర్చ జరుగుతోంది. రాధన్ తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అవుతారని ముందు నుంచి చెబుతున్నారు.. ఆయన చెప్పినట్లుగానే జరిగింది. తమిళనాడు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సమయంలో దాదాపు అన్ని సర్వే సంస్థలు టీవీకే అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పగా.. తాము ఎగ్జిట్ పోల్స్ పట్టించుకోమని.. టీవీకే పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.అంతేకాదు గతంలో తమిళనాడుకు చెందిన నేతల జాతకాల గురించి రాధన్ చెప్పారు.. ఆయన చెప్పినట్లే జరిగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం గురించి రాధాన్ ముందే చెప్పారు. 2021 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే గెలిచి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.. ఆ అంచనాలు కూడా నిజమయ్యాయి. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, పళనిస్వామి జాతకాలు గురించి చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత్రి కవిత కూడా రాధన్ పండిట్ను హైదరాబాద్ పిలిపించినట్లు ప్రచారం జరుగుతోంది.కవిత తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ విజయాన్ని