
ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆయన కార్యాలయం అధికారికంగా తాజా ప్రకటన విడుదల చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)ఇటీవల భుజం గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు బుధవారంఎన్టీఆర్ కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital) లో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే విధంగా వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన త్వరగా కోలుకుని తిరిగి డ్రాగన్ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు
.