
అవకాశం ఇస్తే చాలు.. ఉచితంగానే పనిచేస్తానన్న ఓ భారతీయ యువకుడికి ఇప్పుడు అదే అవకాశం భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, సీఈఓ మిక్కీ హార్డీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్కు చెందిన ఓ యువకుడు తొలుత ఎలాంటి జీతం వద్దని, తన సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు అవకాశం మాత్రమే కావాలని కోరాడని ఆయన తెలిపారు.హార్డీ ప్రకారం.. ఆ యువకుడికి ప్రస్తుతం కమిషన్ ఆధారంగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఔట్రీచ్, కంపెనీ మీడియా కార్యకలాపాల ద్వారా అతను తీసుకొచ్చే లాభంలో 20 శాతం అతనికి అందుతుంది. ఈ విధానంలో ప్రస్తుతం అతను నెలకు దాదాపు 5,000 డాలర్లు.. అంటే సుమారు రూ.4.7 లక్షలు సంపాదిస్తున్నట్లు హార్డీ వెల్లడించారు.యువకుడు తొలుత ఉచితంగా పనిచేయడానికి ముందుకు రావడాన్ని హార్డీ ప్రశంసించారు. తన సామర్థ్యంతో కంపెనీకి విలువను సృష్టిస్తానని నిరూపించుకోవాలన్నదే అతని ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం ఈ ఉద్యోగం తన జీవితాన్ని మార్చేసిందని, తన కుటుంబానికి కూడా ఎంతో సహాయపడుతోందని ఆ యువకుడు పలుసార్లు చెప్పినట్లు హార్డీ తెలిపారు.ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు కేవలం తాము కష్టపడి పనిచేస్తామని చెప్పడం కంటే.. ఏదైనా కంపెనీకి తమ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో నిరూపించాలని హార్డీ సూచించారు. తమకు మెసేజ్ చేసి ఉద్యోగం అడిగేవారు కూడా ‘నేను హార్డ్ వర్కర్ను.. నాకు అవకాశం ఇవ్వండి’ అని మాత్రమే చెప్పకుండా, తాము ఏం చేయగలరో, కంపెనీకి అది ఎందుకు అవసరమో, అందుకు తమ వ్యూహం ఏమిటో వివరించాలని సూచించారు.అయితే ఈ