
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యిపోయాయి. ఎప్పటిలానే.. మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆగస్టు 20 రాత్రి మెగా మహోత్సవం ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 71వ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యిపోయాయి. ఎప్పటిలానే.. మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆగస్టు 20 రాత్రి మెగా మహోత్సవం ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. వేదికపై ఉన్న దర్శకుడు బాబీ, జానీ మాస్టర్, నాగేంద్ర, ఆటా సందీప్, రమేష్లకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆది, 90స్ జనరేషన్ ప్రేక్షకులందరినీ ఉద్దేశించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడాడు. తమ జనరేషన్ చందమామని చూస్తూ తిందని, చిరంజీవిని చూస్తూ పెరిగిందని, పవన్ కళ్యాణ్ ని చూస్తూ అరిచిందని, రామ్ చరణ్ ని చూస్తూ గర్వపడుతోందని తెలిపాడు. చిన్నతనంలో టీవీ లేక పక్కింటికి వెళ్లి వేరే సినిమాలైతే మధ్యలోనే వచ్చేసేవాళ్లమని, కానీ చిరంజీవి సినిమా అయితే చివరిదాకా చూసేవాళ్లమని గుర్తుచేశాడు. గ్రీటింగ్ కార్డ్స్ నుంచి హాస్టల్ రూముల్లో పోస్టర్ల వరకు మెగాస్టార్తో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, ఈ జనరేషన్కి చిరంజీవి ఒక హీరో కావచ్చు కానీ తమకు మాత్రం వన్ అండ్ ఓన్లీ హీరో అని స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా మెగా హీరోలందరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, వాళ్లందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదేనని గుర్తుచేశాడు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డులను వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనీలు దాటేసినట్లే, సినిమాల్లో కూడా రికార్డులు మారుతుంటాయి గానీ.. చిరంజీవి డాన్స్, నటన, ఫ్యాన్ బేస్, సహాయ గుణం లాంటి రికార్డులను మాత్రం ఇప్పటివరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారని, కేవలం అనుసరించారంతేనని అన్నాడు. 'స్వయంకృషి', 'విజేత', 'ఆపద్బాంధవుడు', 'మగమహారాజు' అనేవి కేవలం