Chiranjeevi
253 Articles•14 Reviews•9 Box Office Reports
Box Office Summary
Full Collections Report →Box office details are not available yet for this movie.
Trailers & Media

మెగాస్టార్ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్ర నిజమేనా
SkyC Media • 6 Jun 2026

ఆయన గొప్ప నటుడు.. అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్
TV9 Telugu • 5 Jun 2026

పొల్లాచ్చిలో చిరంజీవి సందడి... శరవేగంగా 'మెగా158' షూటింగ్
AP7AM • 4 Jun 2026

చిరుబాబీ2 / చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం
Telugu Times • 4 Jun 2026

చరణ్ కష్టాన్ని దగ్గరుండి చూశాను.. ఫలితం దక్కింది
Chitrajyothy • 4 Jun 2026

రెండేళ్లుగా చరణ్ పడ్డ కష్టం చూశాను.. నా మనసంతా పెద్ది దగ్గరే ఉంది.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
TV9 Telugu • 4 Jun 2026

నా మనసంతా 'పెద్ది' దగ్గరే.. తండ్రిగా మాత్రమే కాదు.. మెగాస్టార్ ట్వీట్ వైరల్
10TV Telugu • 4 Jun 2026

ఆ కష్టానికి ప్రతిఫలమే పెద్ది’ విజయం.. చిరంజీవి పోస్ట్
Eenadu • 4 Jun 2026

శరవేగంగా.. మెగా 158! కెరీర్ లోనే.. అత్యంత శక్తిమంతమైన పాత్రలో చిరంజీవి
Chitrajyothy • 4 Jun 2026

త్రిషకు మెగా కోడలు సర్ ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్
NTV Telugu • 3 Jun 2026

పెద్ది'లో అబ్బనీ తీయని దెబ్బ రీమిక్స్.. బుచ్చిబాబు ఏమన్నాడంటే
Chitrajyothy • 3 Jun 2026

రెండో సినిమాకు ఏ దర్శకుడికి ఇలా జరగదు
Chitrajyothy • 2 Jun 2026

చరణ్ కంటి నుండి రక్తం.. పెద్దాయన ఫోన్ చేస్తే గుండె ఆగినంత పనైంది.. బుచ్చిబాబు ఎమోషనల్
10TV Telugu • 2 Jun 2026

చిరు అన్న అంటే అందుకే నాకు ఇష్టం, ఇద్దరినీ కూర్చోబెట్టి రిక్వస్ట్ చేశారు..దెబ్బకి మైండ్ పోయింది
Asianet News Telugu • 2 Jun 2026

పెద్ది' వేదికపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన
AP7AM • 2 Jun 2026

చిరంజీవికి అదిరిపోయే కథ చెప్పా.. విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే
TV9 Telugu • 1 Jun 2026

నా కొడుకు కూడా చరణ్ లా మారాలి
SkyC Media • 1 Jun 2026

నేటి నుంచే పొల్లాచిలో తొలి షెడ్యూల్
SkyC Media • 1 Jun 2026

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంత సీక్రెట్ గా దాచేస్తున్నారు
Asianet News Telugu • 1 Jun 2026

నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే
NTV Telugu • 1 Jun 2026

మెగా158 లేటెస్ట్ అప్డేట్
Telugu Times • 1 Jun 2026
పొల్లాచ్చి షెడ్యూల్ కు సిద్ధమైన మెగా 158’.. చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్
Samayam Telugu • 1 Jun 2026

రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా
Chitrajyothy • 31 May 2026
మరో బంపరాఫర్ కొట్టిన నారా రోహిత్ .. మెగా 158’ మూవీలో కీలక పాత్ర
Samayam Telugu • 31 May 2026

మెగా సినిమాలో నారా వారి హీరో
NTV Telugu • 31 May 2026

నేనెవరు' చిత్రానికి ఆదరణ పెరుగుతోంది
Chitrajyothy • 30 May 2026

నేనెవరు? చిత్రానికి అద్భుత స్పందన.. పెరుగుతున్న థియేటర్స్.. చిత్ర యూనిట్ కు ప్రత్యేక అభినందనలు
10TV Telugu • 30 May 2026

ఛాట్ బస్టర్స్ గా 'చెన్నై లవ్ స్టోరీ' సాంగ్స్
Chitrajyothy • 30 May 2026

సినిమా విశేషాల సంక్షిప్త సమాచారం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy • 30 May 2026

చిరంజీవి రాజ్ కుమార్ ఫోటో రీక్రియేట్ చేసిన చరణ్ శివన్న
SkyC Media • 30 May 2026

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా
Chitrajyothy • 29 May 2026

అప్పుడు చిరు రాజ్ కుమార్.. ఇప్పుడు చరణ్ శివన్న.. ఆ సీన్ రీక్రియేట్ చేసిన పెద్ది టీమ్
TV9 Telugu • 29 May 2026

ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ
TV9 Telugu • 29 May 2026

విశ్వంభ ర మూవీపై లేటెస్ట్ అప్డేట్
Telugu Times • 29 May 2026

సీఎం విజయ్ కుమారుడి మొదటి సినిమా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
TV9 Telugu • 29 May 2026

ఆయనంటే నాకు పిచ్చి.. ఆ హీరోకు ఐలవ్ యూ చెప్పాలనుకున్నా
TV9 Telugu • 29 May 2026

పసివాడి ప్రాణం విలన్ గుర్తున్నాడా.? సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు స్కూల్ లో ఇలా
TV9 Telugu • 29 May 2026

చిరు, చెర్రీ హనుమాన్ సెంటిమెంట్
Chitrajyothy • 28 May 2026

మెగాస్టార్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు
10TV Telugu • 28 May 2026

ముగిసిన థియేటర్ల వివాదం.. 'పెద్ది'కి లైన్ క్లియర్
Chitrajyothy • 27 May 2026

రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! పెద్ది’ విషయంలో కీలక నిర్ణయం
NTV Telugu • 27 May 2026

అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
NTV Telugu • 27 May 2026

Kamal Haasan : ఇండియాలో ఆ హీరో పాన్ ఇండియా శక్తి.. నా ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నా.. కమల్ హాసన్..
TV9 Telugu • 26 May 2026

మొన్న వెంకీ.. నేడు చిరు.. ఈ హీరోయిన్ లక్కే లక్కు | Nivetha Pethuraj Reportedly Roped In For Chiranjeevi-Bobby's Mega Project rp
Chitrajyothy • 26 May 2026

తిరుగులేని హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఇలా
TV9 Telugu • 26 May 2026

Meenakshi Seshadri: ‘ఏ పాత్రైనా ఓకే.. ఒక్క ఛన్స్ ఇవ్వండి..‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్ ఎమోషనల్ వీడియో!
NTV Telugu • 26 May 2026
All Movie Updates & News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి నియామకం కానున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ప్రతినిధుల బృందం తీవ్రంగా ఖండించింది. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఈ
సూపర్స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు సూపర్స్టార్ మహేశ్బాబు. బాక్సాఫీస్కా బాప్ అంటూ ఫ్యాన్స్తో ముద్దుగా పిలిపించుకునే మహేశ్నేడు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో అత్యంత అరుదైన మరియు భారీ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించి వేడి వేడి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర(vishwambhara) రిలీజ్పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. చాలా కాలంగా వాయిదాలు ఎదుర్కొన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్

Choreographers Jani Master and Sekhar Master have denied viral rift rumors. Jani called the reports false and said they share a family bond

కొన్ని దశాబ్దాలుగా సినిమా- పాలిటిక్స్ చెట్టాపట్టాలేసుకొని సాగుతున్నాయి. దాంతో స్టార్స్ ఏ పొలిటీషియన్ ను కలసినా, రాజకీయ చిత్రంలో నటించినా వెంటనే వారికి రంగు పులుముతోంది సోషల్ మీడియా. ఈ చేష్టలపై సినీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. 3 రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెంట్ మార్క్ టచ్ చేసింది. ఇది బాక్సాఫీస్ దగ్గర ఎక్కడిదాకా వెళ్లి

అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటించిన తాజా సినిమా లెనిన్(Lenin) సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతూ మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు

Is there a rivalry between two of the biggest choreographers in Tollywood? Several reports indicated that the two choreographers Jani Master and Sekhar Master had a heated verbal altercation during

Akhil is a relieved man after all the trolls he has heen receiving ever since his debut on screen. Though Akkineni fans supported him vehemently, the lack of even a single hit at the box office all

ఆదివారం డాన్సర్స్ అసోసియేషన్లో జరిగిన గొడవపై జానీ మాస్టర్, ఆయన భార్య, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. తనకు, శేఖర్ మాస్టర్ కు మధ్య గొడవ జరిగిందన్నది నిజం కాదని జానీ

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ అన్నదమ్ముల్లా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందిస్తూ, అఖిల్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు

After a string of flops, actor Akhil Akkineni, son of superstar Nagarjuna, has finally tasted success with his latest release Lenin. The actor returned from a three-year hiatus and tasted success

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అఖిల్ నటనకు వస్తున్న ప్రశంసలు సినీ ప్రముఖుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. అక్కినేని

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నెల 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ వచ్చింది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Ntr) ఈ నెల 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ వస్తోన్న

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించారు. మాస్ సినిమాలతో అభిమానులని ఉర్రుతలూగించారు. అదే విధంగా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేశారు. చిరంజీవి కెరీర్ లో అత్యంత

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ నటనకు సర్వత్రా

టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న సరికొత్త చిత్రం లెనిన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందంటూ ఆయన బహిరంగంగా అభినందించడం ఇప్పుడు పరిశ్రమలో

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుంచి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది

King Nagarjuna's son Akhil finally came up with a decent hit with his recent film Lenin. The film directed by Murali Kishor Abburu starred Bhagyashri Borse as the female lead and Shivaji, Easwari

Lenin Collections : అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం లెనిన్. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ జూలై 10న ప్రేక్షకుల

Chiranjeevi : అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రంలో అఖిల్ నటనపై
ప్రముఖ నటుడు, సినీ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి చాలా గ్యాప్ తర్వాత తన స్వీయ దర్శక నిర్మాణంలో 'ఆపరేషన్ అరుణా రెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజుకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్

తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR). ఆయన 90 ఏళ్ల వయసులో 2014, జనవరి 22న ఈ లోకాన్ని వీడారు. చివరి రోజుల్లో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలో తన

ఇంటర్నెట్ డెస్క్: చిరంజీవి (Chiranjeevi)తో కలిసి నటించడం ఎప్పుడూ మంచి అనుభవమే అని నటుడు మురళీ శర్మ ( Murali Sharma) అన్నారు. వీరిద్దరూ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘Mega158’లో కలిసి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో పలు సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. వాటిలో ఒకటి కాదు, ఐదు చిత్రాలున్నాయి. అయితే, అన్నింటిలోకి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఆయన హాలీవుడ్ చిత్రం ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్

నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న

1995లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన పోటీ చోటు చేసుకుంది. రిక్షా కార్మికుల సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని రెండు చిత్రాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ చిత్రాలు మెగాస్టార్

ఆరు దశాబ్దాలపాటు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన గాన కోకిల, ప్రముఖ గాయని ఎస్.జాసకి(88) కన్నుమూశారు. చిరంజీవి నివాళులు అర్పిస్తూ పోస్ట్ పెట్టారు ఆరు దశాబ్దాలపాటు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు

ఎస్. జానకి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తపరిచారు. మధురమైన అమృత గాత్రంతో తరతరాలుగా శ్రోతలను అలరించారు జానకమ్మగారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
Singer Janaki Is No More LIVE : ..| Last Rites | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News Network is

వెండితెర ధృవతార, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో

ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగానీ.. ఇలాంటి స్టేజ్ మీద నిలబడే అదృష్టం దక్కదు. అమ్మ సావిత్రి పేరు మీద ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు

వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, అంకితభావానికి అది అడ్డుకాదని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. దాదాపు 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు దీటుగా వరుస సినిమాలు చేస్తూ, తనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 / #చిరు158 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది

చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా స్టంట్ మాస్టర్స్
Madhavi Latha Exclusive | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News Network is your top source for

Chiranjeevi shoots non stop for Mega 158. Mega Star Chiranjeevi is known for his passion and intensity on the sets of his films

ఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులను అలరించడం కోసం నటీనటులు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ప్రస్తుతం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో చిరంజీవి హీరోగా

Megastar Chiranjeevi continues to prove why he remains one of Indian cinema s most dedicated stars. His latest feat deserves nothing but a salute

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర ఈ ఏడాదే వస్తుందని మేకర్స్ దృఢంగా ఉన్నారు. దసరా బరిలో ఉండొచ్చని టాక్ ఉన్నా, అధికారిక ధృవీకరణ లేదు. ప్రభాస్ ఫౌజీ కూడా మొదట దసరా అనుకున్నా, షూటింగ్ పూర్తి

‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం #ChiruBobby2 / #Chiru158. KVN ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ

‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం ఈ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్గా మెగా 158
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో

Chiranjeevi's intense action for Mega 158. Mega Star Chiranjeevi is known for his intense passion for films

The much-awaited collaboration between Megastar Chiranjeevi and Bobby Kolli, #ChiruBobby2 / #Chiru158, is progressing at a brisk pace with its shoot. Produced on a lavish scale by Venkat K Narayana

దసరా సినిమాతో టాలీవుడ్లో గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నాని హీరోగా పారడైజ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి...

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక...

టాలీవుడ్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త బలంగా ప్రచారం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నారా రోహిత్ ఒక...

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - బాబీ కొల్లి (Bobby Kolli) కాంబోలో వస్తోన్న చిత్రం మెగా 158. ఇప్పటికే ఈ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి...

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ 4న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాంచరణ్ తన కెరీర్ లో తొలిసారి స్పోర్ట్స్ యాక్షన్ సినిమా చేశారు. రాంచరణ్ నటనకు ఆడియన్స్ నీరాజనాలు...
💰 135 కోట్లు
టాలీవుడ్లో దశాబ్దాలుగా విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న నటుడు బ్రహ్మాజీ. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ Mega158 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ తమిళనాడులోని పొల్లాచ్చిలో కొత్త షెడ్యూల్ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.ఇటీవలే ఈ చిత్రంలో యువ నటి అనస్వర రాజన్ను తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో Mega158పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం చిరంజీవి జిమ్లో తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్గా, ఆంటోనీ రూబెన్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా పోస్టర్, "The blade that set the bloody benchmark" అనే ట్యాగ్లైన్తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది

స్టార్ హీరోయిన్స్ ఎవరూ మలయాళం వైపు మొగ్గు చూపరు. అదిరిపోయే కథ, నటిని బయటకు తీసుకొచ్చే పాత్రలు వచ్చినా సరే.. స్టార్స్ మలయాళం వైపు చూడాలి అనుకోరు. అనుష్క, సమంత, త్రిష వంటి స్టార్స్ ఇక్కడ బిజీగా ఉన్న సమయంలో మలయాళంలో నటించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలామంది కేరళ కుట్టీలు తెలుగు, తమిళంలో క్రేజ్ వచ్చేంతవరకే మలయాళాన్ని అంటిపెట్టుకొని ఉంటారు. ఒక్కసారి స్టార్ హోదా దక్కితే, మాతృభాషలో నటించడానికి వందసార్లు ఆలోచిస్తారు. సౌత్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార.. ఒక్కో సినిమాకు ఎనిమిది నుండి 10 కోట్లు డిమాండ్ చేస్తోంది. ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం మలయాళంలో లేదు. ఈ మలబారు బ్యూటీ 2003లో ‘మనసినక్కరె’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. తన 26 ఏళ్ల కెరీర్లో పట్టుమని 10 మలయాళ చిత్రాలు కూడా చేయలేదు. బాలీవుడ్ను మెయిన్ టార్గెట్ చేసుకొని.. ముందుగా తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంటారు. అలా హోదా రాగానే ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్ నాలుగు, ఐదు కోట్లకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లక్షలు తీసుకుని కన్నడలో, మలయాళంలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించరు. నయనతార, రష్మిక, కీర్తి సురేష్ నుంచి లేటెస్ట్ బ్యూటీ అనస్వర రాజన్ వరకు అందరి విషయంలోనూ ఇదే రెమ్యూనరేషన్ ఫార్ములా నడుస్తుంది. అనస్వర రాజన్ మలయాళంలో చాలా కాలంగా నటిస్తున్నా.. తెలుగులో క్రేజ్ రావడంతో ఇక్కడ మంచి రెమ్యూనరేషన్ దక్కుతోంది. ‘ఛాంపియన్’తో ఎంట్రీ ఇచ్చిన ఈమె, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూతురిగా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు ఛాన్సులను అస్సలు వదులుకోవడం లేదు. ఎందుకంటే, బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా మొదట తెలుగులో స్టార్ అనిపించుకోవాలి. అందుకే మలయాళ బ్యూటీస్ తెలుగులో ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోరు. క్రేజ్ కు క్రేజ్, రెమ్యూనరేషన్ కు రెమ్యూనరేషన్.. అంతా ఇక్కడే దొరుకుతుంది

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటూ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ #ChiruBobby2 యూనిట్ విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు బాబీ కొల్లి మరింత భారీ స్థాయిలో కథను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా తన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఈ చిత్రంలో తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన మరోసారి అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఈ భారీ ప్రాజెక్ట్కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించనున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అవినాశ్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ను ఆంటోని ఎల్. రూబెన్ చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషినల్ స్క్రీన్ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికతో పాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు

Growing up with highly accomplished or well-known parents can shape a child s sense of identity in complex ways. In a recent promotional interview for Peddi, Ram Charan and Janhvi Kapoor reflected on how their parents, Chiranjeevi and Sridevi, intentionally sh











ఇంటర్నెట్ డెస్క్: తాను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా తన మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) నేడు ప్రేక్షకుల ముందుకువచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒక తండ్రిగా, నటుడిగా తనకెంతో గర్వంగా ఉందంటూ చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఈసందర్భంగా చిత్రబృందాన్ని అభినందించారు. ‘‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, పెట్టిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయతీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం’’ అని రామ్ చరణ్ను (Ram Charan) చిరంజీవి ప్రశంసించారు. ‘‘ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకు ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత సతీశ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్కు, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతిబాబుకు అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించేలా నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్కు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా విజయంలో భాగమైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor), దివ్యేందుతో పాటు సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్..’’ అంటూ చిత్రబృందాన్ని అభినందించారు. ‘పెద్ది’ సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెగా 158’ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ కొల్లి (Bobby Kolli) తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్) ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా పొల్లాచ్చిలో జరుగుతున్న కీలక షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో తన కెరీర్లోనే అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి. శారీరకంగా ధృఢంగా కనిపించడానికి కఠోర సాధన చేశారు. పూర్తి స్థాయి మాస్ అంశాలతో సాగే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర రెండు కోణాల్లో సాగనున్నట్లు సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కే నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: ఆంటోని రూబెన్, డీఓపీ: విజయ్కార్తిక్ కన్నన్, సంగీతం: థమన్ ఎస్. చిరంజీవి, బాబీ కొల్లి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘనవిజయం సాధించడంతో ఈ కాంబోపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకోవడానికి మరింత పెద్ద కాన్వాస్ ఉన్న కథను సిద్ధం చేశారు బాబీ కొల్లి. Mega158 shooting update అభిమానులు ఇప్పటివరకూ చూడని సరికొత్త చిరంజీవిని ఈ మూవీలో చూస్తారని మేకర్స్ హామీ ఇచ్చారు. ప్రతీ సన్నివేశం గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పారు. త్వరలోనే హీరోయిన్తో పాటు ఇతర వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

Trisha: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. తెలుగువారి ఇళ్లలో ఆవకాయ పచ్చళ్ల ఘుమఘుమలు మొదలైపోతాయి. ఇప్పుడు అదే ఘుమఘుమలు కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష ఇంటికి చేరాయి. మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి త్రిషకు ఒక అదిరిపోయే సమ్మర్ సర్ప్రైజ్ అందింది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంతో నటిస్తున్న త్రిష కృష్ణన్కు మెగా ఫ్యామిలీ నుంచి ఒక అదిరిపోయే సమ్మర్ సర్ప్రైజ్ అందింది. మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. త్రిషకు నోరూరించే ప్రత్యేకమైన గిఫ్ట్ పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉపాసన కొణిదెల నేతృత్వంలో నడుస్తున్న ప్రముఖ హోమ్ ఫుడ్ బ్రాండ్ ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి హీరోయిన్ త్రిషకు ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. సాంప్రదాయ తెలుగు వంటకాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఈ బ్రాండ్ నుంచి పంపిన గిఫ్ట్ బాక్స్లో.. వేసవి కాలం స్పెషల్ అయిన నోరూరించే ఘుమఘుమలాడే కొత్త ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పచ్చళ్లు, రుచికరమైన పొడులు ఉన్నాయి. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ టేస్టీ సర్ప్రైజ్ చూసి త్రిష ఫిదా అయిపోయింది. ఆ గిఫ్ట్ బాస్కెట్ను ఫోటో తీసి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఉపాసనకు ట్యాగ్ చేస్తూ.. “ఈ అద్భుతమైన గిఫ్ట్ చూస్తుంటే నాకు నిజంగానే వేసవి కాలం (సమ్మర్) వచ్చేసినట్లు అనిపిస్తోంది. థ్యాంక్యూ సో మచ్ ఉపాసన” అంటూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. త్రిష పెట్టిన ఈ పోస్ట్ను ఉపాసన కూడా తన సోషల్ మీడియా ఖాతాలో రీ-షేర్ చేయడంతో, మెగా ఫ్యాన్స్ ఈ పోస్ట్లను తెగ వైరల్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను మర్చిపోవడం ఏ తెలుగు ప్రేక్షకుడి వలన కాదు అంటే అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను మర్చిపోవడం ఏ తెలుగు ప్రేక్షకుడి వలన కాదు అంటే అతిశయోక్తి లేదు. అసలైన దేవకన్య అంటే ఇలాగే ఉంటుందేమో అనేంత అందంతో శ్రీదేవి కనిపించారు. ఈ చిత్రంలో వీరిద్దరి రొమాన్స్, కామెడీ వెరసి ఈ సినిమా ఒక ఐకానిక్ హిట్ గా నిలిచింది. ఇక ఈ స్టార్ ఇద్దరి వారసులు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్.. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కలిసి పెద్ది సినిమాలో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4 న రిలీజ్ కు సిద్దమయ్యింది. చరణ్, శ్రీదేవితో జగదేకవీరుడు అతిలోక సుందరి 2 తీస్తే ఎంత బావుంటుందో అని ప్రేక్షకులు కలలు కన్నారు. కానీ, అది కుదరకపోయినా కనీసం ఆ సినిమాలోని హిట్ సాంగ్ అబ్బనీ తీయని దెబ్బ సాంగ్ అయినా పెద్దిలో రీమిక్స్ చేస్తే బావుంటుందని కోరారు. ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ సినిమాలో ఆ సాంగ్ ఉందని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. తాజాగా ఆ ఆశలపై డైరెక్టర్ బుచ్చిబాబు నీళ్లు చల్లాడు. ఈ సాంగ్ పెద్దిలో లేదని తేల్చి చెప్పాడు. 'పెద్ది సినిమాలో ఈ పాటను రీక్రియేట్ లేదా రీమిక్స్ చేయలేదు. సినిమాలో వచ్చే ఒక పర్టిక్యులర్ సీన్లో బ్యాక్గ్రౌండ్లో ఒక రేడియోలో ఈ పాట ప్లే అవుతుంది. అయితే, ఆ సమయంలో సాంగ్ వస్తే ప్రేక్షకులు థియేటర్లలో డైవర్ట్ అయి, సినిమా కథలో నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉందని, ఆ సాంగ్ ని కూడా మ్యూట్ చేశామని' బుచ్చిబాబు వివరించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరి ఈ సినిమాతో చరణ్, జాన్వీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

An interesting development surrounding Megastar Chiranjeevi s 158th film has become a major talking point in industry circles. The big-budget project, being produced by KVN Productions An interesting development surrounding Megastar Chiranjeevi s 158th film ha...

సినిమా చూసి మంచి జడ్జిమెంట్ ఇస్తారని మెగాస్టార్ చిరంజీవికి పేరుంది. ముఖ్యంగా ఒక సినిమా మాస్ కి పట్టేస్తుందా లేదా అనేది బాగా చెప్తారు అని అంటారు. “రంగస్థలం” సినిమా రిలీజ్ కి ముందే చూసి అది చరణ్ కెరీర్ లోనే పెద్ద హిట్ అవుతుందని ముందే చెప్పేశారు. అలాగే జరిగింది. అందుకే మెగాస్టార్ తన సినిమా గురించి ఏమి టాక్ చెప్తారో అని దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) ఎదురుచూస్తున్నారు. “చిరంజీవి గారు ఇంకా సినిమా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ మేడమ్ ఒక సీక్వెన్స్ చూశారు. చాలా ఎమోషనల్ అయ్యారు,” అని అన్నారు బుచ్చిబాబు. మీకు ఫైనల్ కాపీ చూసుకున్నాక ఎలా అనిపించింది, మీ గురువు సుకుమార్ ఏమి అన్నారు అని అడిగితే, బుచ్చిబాబు చెప్పిన సమాధానం: “నేను చూసుకున్నాక మంచి సినిమా తీశాననే ఫీలింగ్ కలిగింది. ఇక సుకుమార్ గారు . పెద్ది చూసిన తర్వాత సెకండాఫ్ తన ఫేవరెట్ అని చెప్పారు.” పెద్ది సినిమా కథ 1985 నేపథ్యంగా విజయనగరంలో జరుగుతుందట. “పెద్ది గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాలా ఎమోషనల్గా ఉంటుంది. కమర్షియల్గా ఉంటుంది. ఇందులో చరణ్ గారు కనిపించరు… పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి,” అని చెప్పారు బుచ్చిబాబు.

<p></p><p><strong><em><span style="color: rgb(13, 32, 125)">‘ఓ సందర్భంలో పుష్ప ‘పది కేజీఎఫ్’లతో సమానం’ అన్నాను. అది నిజం. పుష్పరాజ్ మైండ్లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు’ అని బుచ్చి బాబు సాన అన్నారు. రామ్చరణ్ హీరోగా వెంకట సతీష్ కిలారు నిర్మించిన చిత్రం ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మంగళవారం విలేకర్లతో మాట్లాడారు.</span></em></strong></p><p></p><p>-నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు ‘పెద్ది’తో వస్తున్నా. మామూలుగా ఇండస్ట్లీర్లో పెద్ద హిట్ తర్వాత ఏ దర్శకుడు ఐదేళ్లు సమయం తీసుకోడు. కానీ నా విషయంలో అలా జరిగింది. మా గురువుసుకుమార్ గారు నన్ను చరణ్ దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. ఇది జరగడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.</p><p><strong><span style="color: rgb(212, 37, 37)">ఇది ఆ కథ కాదు..</span></strong></p><p>క్రికెట్ మన అందరికీ తెలిసిన ఆటే. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్థ తీసుకున్నాం. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్ను తీసుకొచ్చాం. తెలంగాణలోని పహిల్వాన్లను కూడా టీమ్లో భాగం చేశాం. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలలపాటు పహిల్వాన్ శిక్షణ తీసుకున్నారు. అయితే ఇది ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ కాదు. ఇది చరణ్ కోసం రాసిన కథ. రామ్చరణ్ని కన్విన్స్ చేయడం అంత ఈజీగా జరగలేదు. ఆయనకు కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారు. కథతోనే ఆయనను కన్విన్స్ చేశాను. చరణ్కు ఎప్పటినుంచో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలనే ఆసక్తి ఉంది. ఆయనకు నచ్చేలా పెద్ది కథను సిద్థం చేశాం.</p><p><strong><span style="color: rgb(236, 19, 19)">హిట్ అవసరమే..</span></strong></p><p>ఏ సినిమా సక్సెస్ అయినా ఇండస్ర్టీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉంది. నా కెరీర్ మొత్తం అలానే జరిగింది (నవ్వుతూ). ఉప్పెన సమయంలో కూడా పరిస్థితి అలానే ఉండేది. అప్పట్లో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహం ఉండేది. సినిమా రిలీజ్కు మూడు రోజుల ముందు మాత్రమే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్స్కి వచ్చి పెద్ద హిట్ ఇచ్చారు.</p><p></p><div id="articlebodyAdsDiv"></div><br/><p></p><p><span style="color: rgb(199, 5, 5)">పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు..</span></p><p>శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వీళ్లందరూ ఆయా పాత్రలకు పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారు. శివన్న ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బ్రతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు అప్పలసూరి పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్ఫుల్గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా క్రేజీగా ఉంటుంది. జాన్వీకపూర్ సినిమాకు స్పెషల్ కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్ చాలా బాగుంటారు. జాన్వీ చాలా తెలివైన అమ్మాయి. చాలా డెడికేటెడ్ పర్సన్. సినిమాపై చాలా పాషన్ ఎక్కువ. వినయంగా ఉంటుంది.</p><p><span style="color: rgb(225, 5, 5)">మరో ఆప్షన్ తీసుకోలేదు..</span></p><p>నాకు రోజా, బొంబాయి.. నుంచి రెహమాన్ గారి ఆల్బమ్స్ చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలనేది నా కోరిక. ఇలా కుదిరింది. ఆయన స్వయంగా పాడుతుంటే వింటూ చాలా ఎంజాయ్ చేశాను. లైఫ్ లాంగ్ ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇందులో అబ్బనీ తీయని దెబ్బ సాంగ్ ఉంది. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. అది వచ్చినప్పుడు ప్రేక్షకుల కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి మ్యూట్ చేేసశాం. ఈ సినిమాలో ఇంకా రెండు పాటలున్నాయి. అవి కూడా అదిరిపోతాయి. ‘మస్సా మస్సా’ పాట తయారయ్యాక ఎవరికీ వినిపించలేదు. మరో ఆప్షన్ కావాలని అడిగాను. ఒకరోజు చరణ్ గారు కారులో వెళ్తూ ఆ పాట విన్నారు. ఆయనకు చాలా నచ్చింది. అదిరిపోయింది అన్నారు. తర్వాత మరో ఆప్షన్ తీసుకోలేదు. అది చరణ్ గారి జడ్జ్మెంట్.</p><p><span style="color: rgb(244, 11, 11)">భయమేసింది..</span></p><p>షూటింగ్లో చరణ్ గారికి చాలా గాయాలయ్యాయి. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం చిరంజీవి గారు తిడతారేమో అని భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్ లో పొరపాటున తగిలింది. అయితే చిరంజీవి గారు ‘‘బుచ్చి వీడియో పంపించు’ అన్నారు.</p><br/><p><span style="color: rgb(212, 12, 12)">మైండ్బ్లోయింగ్..</span></p><p>పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్ఫార్మేషన్ మైండ్బ్లోయింగ్గా అనిపించింది. ఒక కమర్షియల్ హీరోను ఆర్గానిక్గా చూపించడం కత్తి మీద సాము లాంటిది. కే్ౖలమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ <span style="color: rgb(34, 34, 34)">స్క్రీన్ </span>పైౖ చూసి అనుభవించాలి. ఇప్పటివరకు చూసినవాళ్లంతా ఎక్స్ట్రార్డినరీగా ఉందని అన్నారు. ఈ

Buchibabu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా, షూటింగ్ లొకేషన్లో జరిగిన ఒక భయానక ప్రమాదం గురించి దర్శకుడు బుచ్చిబాబు షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయమై రక్తం వచ్చిందని, ఆ దృశ్యం కెమెరాలోనే రికార్డ్ అయిందని ఆయన తెలిపారు. Trisha Krishnan: కుక్క ఫోటోతో కౌంటర్.. ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చిన త్రిష కోట్లాది మంది అభిమానించే స్టార్ హీరోకు తన సెట్స్లో అలా గాయం కావడంతో తనకు చేతులు, కాళ్లు ఆడలేదని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ఆ వెంటనే ఇంటి నుండి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేయడంతో, తనపై గట్టిగా తిడతారేమోనని విపరీతమైన భయంతో గుండె ఆగినంత పనైందని పేర్కొన్నారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబు(Buchibabu)కు చిరంజీవి ఊహించని విధంగా ఎంతో కూల్గా మాట్లాడి పెద్ద షాక్ ఇచ్చారు. చిరంజీవి గారు దర్శకుడిని అస్సలు తిట్టకుండా, ఎంతో పరిణతితో అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారని బుచ్చిబాబు చెప్పారు. “కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం అయిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు” అని చిరంజీవి ధైర్యం చెప్పిన తీరు, ఆయన ఇచ్చిన సపోర్ట్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని బుచ్చిబాబు ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

సినిమా పట్ల చిరంజీవికి డెడికేషన్, క్రమశిక్షణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కోసం చిరంజీవి ఎంత కష్టానికైనా వెనుకాడరు. కెరీర్ బిగినింగ్ నుంచి తన ట్యాలెంట్ నిరూపించుకుంటూ కష్టపడ్డారు కాబట్టే చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ 1 గా దశాబ్దాల పాటు కొనసాగారు. చిరంజీవి గురించి ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ బాబు మోహన్ ఆసక్తికర సంఘటనని పంచుకున్నారు. చిరంజీవి గారికి అస్సలు కోపం అనేది రాదు. చిరంజీవి గారిని నేను ముద్దుగా చిరన్న పిలిస్తా. ముఠామేస్త్రి సినిమా సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. నేను, బ్రహ్మి, చిరన్న కాంబోలో సన్నివేశాలు ఉన్నాయి. కానీ మా ముగ్గురి డేట్లు ఒకేసారి కుదరడం లేదు. నేను రోజుకు ఆరు షిఫ్ట్స్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాను. బ్రహ్మానందం కూడా బిజీగా ఉన్నారు. దీనితో మా ఇద్దరి డేట్లు ఒకేసారి కుదిరితే షూటింగ్ పూర్తి చేయాలని చిరంజీవి గారు వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కానీ.. మా డేట్లు అడ్జెస్ట్ కావడం లేదు. దీనితో చిరంజీవి గారు మా ఇద్దరినీ ఒక రోజు పిలిచారు. ఇద్దరినీ కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేశారు. ఒక రెండు గంటలు మీరిద్దరూ టైం అడ్జెస్ట్ చేస్తే షూటింగ్ పూర్తి చేద్దాం అని అన్నారు. మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి అని అడిగారు. మేము బిజీగా ఉండడంతో ఎప్పుడు టైం ఇవ్వాలి అనేది అర్థం కాలేదు. దీనితో చిరన్నకి చిన్నపాటి అసహనం కలిగింది. సరే కనీసం ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో టైం ఇస్తారా అని అడిగారు నేను ఆశ్చర్యపోయా. ఏంటి చిరంజీవి గారు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు షూటింగ్ కి రాగలరా అనే డౌట్ వచ్చింది. లేదు చిరన్న ఎర్లీ మార్నింగ్ మీకు ఇబ్బంది అవుతుందేమో ఇంకో డేట్ చూసుకుందాం అని అడిగా. లేదు బాబు మోహన్ నేనేం ఫీల్ కావట్లేదు. ఆ టైం నాకు ఓకె ఎలాంటి ఇబ్బంది లేదు అని అన్నారు. నాకు ఆ రోజు కూడా వరుసగా షూటింగ్స్ ఉన్నాయి. ముఠామేస్త్రి షూటింగ్ కి కాస్త ముందుగా వెళ్లి అక్కడ చెట్టు పక్కన కాసేపు పడుకుందాం అని అనుకున్నా. చిరంజీవి గారు ఎలాగూ 4 గంటలకు రాలేరు. చిరన్న 4 గంటలకు ఎందుకు వస్తారు ఆలస్యం అవుతుందిలే. కాసేపు పడుకోవచ్చు అనుకున్నా. షూటింగ్ లొకేషన్ కి వెళ్లేసరికి మా అందరికంటే ముందే చిరన్న వచ్చి కాలుమీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నారు. నా మైండ్ పోయింది. మరోవైపు నుంచి బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వుతూ నేను ఆలస్యంగా వస్తానని అనుకున్నారా అని అన్నారు. అందుకే చిరన్న అంటే నాకు ఇష్టం. చిరంజీవి గారి క్రమశిక్షణ ఆ విధంగా ఉంటుంది అని బాబు మోహన్ ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ భరోసా ఇచ్చారు. విజయవాడలో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరపున చిత్ర పరిశ్రమకు ఈ హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. "ఏపీలో షూటింగ్లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల స్థానిక ప్రతిభకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా 'పెద్ది' సినిమాపై మంత్రి ప్రశంసలు కురిపించారు. గ్లింప్స్, ట్రైలర్ చూస్తుంటే ఇదొక అద్భుతమైన దృశ్యకావ్యంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. "చెన్నైలో పుట్టి, హైదరాబాద్లో పెరిగినా... రామ్ చరణ్ ఈ రస్టిక్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. నటన ఆయన నరనరాన ఉంది. రామ్ చరణ్, జాన్వి కపూర్ల జంట... అలనాటి చిరంజీవి, శ్రీదేవిల జంటను గుర్తు చేస్తోంది" అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తూర్పు గోదావరి జిల్లా వాసి కావడం గర్వంగా ఉందని, ఆయన ప్రతిభతో పాటు వినయం గొప్పదని అభినందించారు. ఈ సినిమా భారీ విజయం సాధించి, దీనిపై ఆధారపడిన వందలాది కుటుంబాలకు మేలు కలగాలని మంత్రి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సమర్పణలో రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా "పెద్ది". జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను విజయవాడలో కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడిన మాటలు, సినిమాపై ఆయన నమ్మకం మెగా ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించాయి. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ.. విజయవాడతో తనకున్న సెంటిమెంట్ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. "ఉప్పెన సినిమా టైంలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ తొక్కుకుంటూ ఈ ‘పెద్ది’ కథ రాసుకున్నాను. నేను తండ్రిని కాబోతున్నానని డాక్టర్ నాకు చెప్పింది కూడా ఈ విజయవాడలోనే! ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయి. ‘ఉప్పెన’కు నేషనల్ అవార్డు వచ్చింది, ప్రొడ్యూసర్లకు, నాకు చాలా డబ్బులు వచ్చాయి. ఐదేళ్లు ఎందుకు గ్యాప్ తీసుకున్నావంటే.. అది కేవలం ఈ ‘పెద్ది’ సినిమా కోసమే" అని స్పష్టం చేశారు. మెగాస్టార్ ఉప్పెన ఇస్తే.. చరణ్ సార్ ‘పెద్ది’ ఇచ్చారు! తన గురువు సుకుమార్ను గుర్తుచేసుకుంటూ రామ్ చరణ్పై ప్రశంసలు కురిపించారు బుచ్చిబాబు. "ఉప్పెన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్లో ఉంటే, మా గురువుగారు సుకుమార్ సార్ నన్ను చరణ్ సార్ దగ్గరకు తీసుకెళ్లారు. నాకు ‘ఉప్పెన’ మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే.. ఈ ‘పెద్ది’ని రామ్ చరణ్ గారు ఇచ్చారు. దేవుడికి మొక్కుకుని వెళ్లి చరణ్ సార్కి కథ చెప్తే.. ఆయన ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఓకే చేశారు. రెండో సినిమా డైరెక్టర్ను నమ్మి ఇంత పెద్ద స్టార్ హీరో 350 కోట్ల బడ్జెట్ సినిమా ఇవ్వడం మామూలు విషయం కాదు సార్. నన్ను, నా కథలోని నిజాయితీని నమ్మిన చరణ్ సార్కి జీవితాంతం రుణపడి ఉంటా" అని ఎమోషనల్ అయ్యారు. ఆట అంటే ఆకతాయితనం కాదు.. ‘పెద్ది’ పడి లేచిన మనిషి కథ.. సినిమా లైన్ గురించి లీక్ ఇస్తూ.. "పెద్ది అంటే కేవలం ఒక కమర్షియల్ సినిమా కాదు.. కమర్షియాలిటీతో కూడిన ఒక పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామా. విజయనగరం నేపథ్యంలో సాగే ఒక కుర్రోడి రూటెడ్ కథ ఇది. ఆట అంటే ఇప్పటివరకు చాలామంది ఆకతాయితనం అనుకున్నారు. కానీ ఆ ఆట ఒక మనిషికి ఎలాంటి గుర్తింపు, గౌరవం తెస్తుంది.. తన చుట్టూ ఉన్న మనుషుల్ని ఎలా మారుస్తుంది అని చెప్పే కథే పెద్ది. ఇది అలలా ఎగసిపడిన మనిషి కథ కాదు.. పడినా కూడా సింహంలా లేచిన మనిషి కథ. పెద్దిగాడికి విజయం అంత ఈజీగా దక్కలేదు, ఎన్నో ఆటంకాలను దాటుకుని సాధించాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అని ఈ సినిమా నిరూపిస్తుంది" అని బుచ్చిబాబు పేర్కొన్నారు. లాస్ట్ 50 నిమిషాలు కళ్లు చెమర్చాల్సిందే.. సినిమా అవుట్పుట్పై బుచ్చిబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. "ఈ సినిమాను నేను ఇప్పటివరకు 50 నుంచి 100 సార్లు చూశాను. సెకండ్ హాఫ్లో లాస్ట్ 40 నుంచి 50 నిమిషాలు నేను ప్రతిసారి ఎమోషనల్ అయిపోతాను, నా కళ్ల వెంట నీళ్లు వస్తాయి. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థియేటర్లో మీకూ కన్నీళ్లు రాకుండా ఉండవు. అలాగే ఇందులో జగపతి బాబు గారు ‘అప్పలసూరి’ అనే మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ చేశారు. అప్పలసూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్లల్లో నీళ్లు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానయే కాదు" అని సవాల్ విసిరారు. చిత్ర యూనిట్ గురించి మాట్లాడుతూ.. "హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ రస్టిక్ మట్టి కథలోకి వచ్చి కలర్ యాడ్ చేశారు. ఈ సినిమాలో ఆమె హెచ్సీఎం క్యారెక్టర్ చేశారు. కొన్ని సీన్స్లో ఆమె పర్ఫార్మెన్స్ ఒక మగరాయిలా, ఫుల్ హీరోయిజంతో ఉంటుంది. క్లైమాక్స్లో ఆమె యాక్టింగ్ ఎవరూ మర్చిపోలేరు. ఇక లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా స్టైలిష్గా, ఊరమాస్గా వచ్చింది. ఆయనతో వర్క్ చేయడం నా చిరకాల కోరిక. డీఓపీ రాండీ గారు నా అక్షరానికి ప్రాణం పోశారు, అవినాష్ కోలా 20 అద్భుతమైన నాచురల్ సెట్స్ వేశారు" అని టీమ్ అందరికీ థాంక్స్ చెప్పారు. చివరగా యాంకర్ సుమా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "పదేళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అది కేవలం రామ్ చరణ్ సార్ వల్లే సాధ్యం. ఒక స్టార్ హీరో ఇలాంటి రూటెడ్ కథను నమ్మి చేయడం టాలీవుడ్లో ఒక హిస్టరీ" అని చెప్తూ జూన్ 4న ఫ్యామిలీస్, కిడ్స్తో కలిసి థియేటర్లలో ‘పెద్ది’ ఎమోషన్ను విట్నెస్ చేయాలని బుచ్చిబాబు పిలుపునిచ్చారు.

దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను చరణ్ ఆకాశానికెత్తారు. ప్రీ రిలేజ్ ఈవెంట్లో మాట్లాడిన రామ్ చరణ్ "ఈ కథ విన్నాక అసలు బుచ్చిబాబు బుర్ర ఎలా పనిచేస్తుందిరా బాబు అని ఆశ్చర్యపోయాను. రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో భారతదేశంలోనే టాప్ 3 లేదా టాప్ 4 దర్శకుల జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుంది" అని బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు ఇంతటి వెన్నుముకగా నిలుస్తున్న అభిమానుల గురించే చరణ్ అత్యంత ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విభిన్నమైన సినిమా ఒప్పుకోవడానికి తన మనసులోని ఏకైక బలం అభిమానుల ప్రేమేనన్నారు. "మీ కోసమే ఈ సినిమా చేశాను. మీ ఆనందం కోసం చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు, రక్తం చిందించడానికైనా నేను వెనకాడను. మా నాన్నగారి (చిరంజీవి) కొడుకుగా పుట్టడం, కళ్యాణ్ బాబాయ్ (పవన్ కళ్యాణ్) ఇంట్లో పెరగడం వల్ల కష్టపడటం, సినిమాలు చేయడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. బహుశా వేరే పనులేవైనా తెలిసి ఉంటే నేనింత పెద్ద నటుడిని అయ్యేవాడినేమో కాదేమో! నాకు తెలిసింది ఒకే ఒక్కటి.. అదే సినిమా. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను.. ఇది రాసి పెట్టుకోండి" అంటూ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు. రామ్ చరణ్ ఎనర్జీ, సినిమాపై ఆయనకున్న నమ్మకం చూస్తుంటే జూన్ 4న థియేటర్లలో 'పెద్ది' సృష్టించబోయే బాక్సాఫీస్ సునామీ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది!

విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే మాట అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంతటి గొప్ప సబ్జెక్టును తన ముందుకు తెచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు, ఆయన గురువు సుకుమార్కు చరణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ లాంగ్ తన పర్సనల్ మూవీ లైబ్రరీలో 'పెద్ది' ఎప్పటికీ టాప్-3 సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. "బుచ్చిబాబు నాకు ఈ కథను ఒక సినిమా స్క్రిప్ట్లా చెప్పలేదు. ఒక మనిషి జీవిత ప్రయాణాన్ని నా కళ్లకు కట్టాడు. ఇది ఏదో పైపైకి ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. అట్టడుగుకి పడిపోయిన ఒక సాధారణ మనిషి, తిరిగి లేచి ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా" అని చరణ్ వివరించారు. ఈ సినిమా కోసం పడ్డ శ్రమ గురించి అందరూ మాట్లాడుతుంటే.. "ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు.. ఇష్టంతో, అమితమైన ప్రేమతో చేసిన ప్రయాణం. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఎప్పుడెప్పుడు షూటింగ్కి వెళ్దామా అనిపించేలా చేసిన సినిమా ఇది" అని మెగా పవర్ స్టార్ పేర్కొన్నారు. గతంలో మగధీర, రంగస్థలం, RRR చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే తనకు ఇలాంటి ఫీలింగ్ కలిగిందని, మళ్లీ ఇన్నాళ్లకు 'పెద్ది' ఆ మ్యాజిక్ను రిపీట్ చేసిందని అనడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.

సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.వి. కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ఎస్.వి. కృష్ణారెడ్డి కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొంది తాను కూడా అలాంటి కథలను రూపొందించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే, తన తెలుగు చిత్రం ఆహ్వానం కథను డైవర్స్ ఇన్విటేషన్ పేరుతో హాలీవుడ్ లో సినిమా చేశా అని వెల్లడించారు. ఆహ్వానంలోని వివాహ నేపథ్యాన్ని మార్చి, పుట్టబోయే బిడ్డ హక్కులు, తల్లిదండ్రుల నుంచి ఆప్యాయత ఆవశ్యకత అనే కొత్త కోణంలో కథను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ ప్రయోగానికి తనకు మూడు సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం, డైరెక్టర్స్ అసోసియేషన్లో తన సభ్యత్వ అనుభవాలను పంచుకున్నారు. ఐదుగురు పర్మనెంట్ ఆర్టిస్టులు సిఫార్సు చేస్తే తప్ప సభ్యత్వం లభించదని, అయితే అప్పటికే 30కి పైగా చిత్రాలు తీసిన తన సామర్థ్యాన్ని గుర్తించి, తోటి సభ్యులు తన అప్లికేషన్ను ఆమోదింపజేసినట్లు తెలిపారు. సినీ నిర్మాణ ప్రక్రియలో అసోసియేషన్ పాటించే కఠినమైన నిబంధనలను ఆయన వివరించారు. షూటింగ్ జరిగే ప్రదేశం, ఐదు విభాగాల పనితీరు, ఏ డిపార్ట్మెంట్ పనిని మరొకరు చేయకూడదనే నియమాలు, అలాగే దర్శకుడు, నటులు, కెమెరామెన్ మధ్య సమన్వయం వంటి విషయాలను ఆయన స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రాజెక్ట్ ఎందుకు కార్యరూపం దాల్చలేదో కూడా ఎస్.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు. చిరంజీవి గారిపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, తమ ఇద్దరి ఆలోచనలలో తేడాలున్నాయని, తాను ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటానని ఆయన తెలిపారు. చిరంజీవి గారికి తాను చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉందని, అది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్తో కూడినదని అన్నారు కృష్ణారెడ్డి. ఆ కథలో, చిరంజీవి కుటుంబంతో కలిసి టీవీలో

‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీకాంత్ ఓదెల. తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీకాంత్ ఓదెల. తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నానితో ‘ప్యారడైజ్’ చిత్రం రూపొందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రెండో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవితో కమిట్ అయిన సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఈ చిత్రానికి నాని నిర్మాత. ‘ప్యారడైజ్’ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ప్యారడైజ్, చిరంజీవి చిత్రాలతో శ్రీకాంత్ పెద్ద ప్లానే వేసినట్లు తెలిసింది. ‘ప్యారడైజ్’కి చిరంజీవి చేయనున్న కథకి ఓ లింక్ ఉందట. అది ప్యారడైజ్ క్లైమాక్స్లో రివీల్ అవుతుందని దర్శకుడి సన్నిహితులు నుంచి సమాచారం అందింది. అయితే ఇందులో చిరు నటిస్తారా? లేదా అన్నది కరెక్ట్గా తెలీదు కానీ ఆయన పాత్రకు సంబంధించి ఓ లీడ్ అయితే ప్యారడైజ్లో ఉంటుందట. దీనికి సంబంధించి మరో న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'ప్యారడైజ్' చిత్రానికి ప్రీక్వెల్ కూడా ఉంటుందట. దీనిని బట్టి చూస్తే శ్రీకాంత్ పెద్ద ప్లానే వేసినట్లు కనిపిస్తోంది.

చెన్నై నగరంలో జరిగిన పెద్ది సినిమా ప్రమోషన్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ పై ఏఆర్ రెహమాన్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో సంగీత దర్శకుడు రెహమాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా ప్రమోషన్ల లో భాగంగా నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కు భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు తరలివచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన సినిమా విశేషాలతో పాటు ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. రామ్ చరణ్ పై ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి లాంటి లెజెండరీ స్టార్ వారసత్వాన్ని అందుకోవడం ఎంత కష్టమో ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సినీ పరిశ్రమలో ఒక లెజెండ్ వారసుడిగా రావడం వెనుక ఉండే ఒత్తిడిని ఆయన వివరించారు. రామ్ చరణ్ ఆ అంచనాలను పూర్తిగా మించి తన సొంత ఇమేజ్ ను సృష్టించుకున్నాడని కొనియాడారు. దీంతో పాటు ఆయన పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీని కూడా ఏర్పరచుకున్నారని స్పష్టం చేశారు. రామ్ చరణ్ నటుడిగా కొత్త ప్రమాణాలు నెలకొల్పాడని రెహమాన్ ఈ వేదికపై గొప్పగా ప్రశంసించారు. ఇదిలా ఉండగా ఈ వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. తన కుమారుడు కూడా రామ్ చరణ్ లాగే ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఈ వ్యాఖ్యలు విన్న వారందరికీ ఎంతో హార్ట్ టచింగ్ గా అనిపించాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పై ఏఆర్ రెహమాన్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు-బాబీ 2 చిత్రం సరికొత్త అప్డేట్తో ముందుకు వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ మెగా 158 షూటింగ్ ఈరోజు జూన్ 1వ తేదీ నుండి పొల్లాచిలో అధికారికంగా ప్రారంభం అవుతోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చిత్ర యూనిట్ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ కొత్త షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ సభ్యులు అంతా ఇప్పటికే పొల్లాచి లొకేషన్కు చేరుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ను మొత్తం 15 రోజుల పాటు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. పొల్లాచి మరియు దాని చుట్టుపక్కల ఉన్న ప్రముఖ లొకేషన్లలో ఈ చిత్రీకరణ జరగనుంది. హీరో చిరంజీవికి సంబంధించిన కీలకమైన సీన్స్ అన్నింటినీ ఈ 15 రోజుల వ్యవధిలోనే షూట్ చేయనున్నారు. మెగా 158 షూటింగ్ ప్రారంభం కానుండటంతో మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటీనటుల ఎంపికకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో చిరంజీవి కూతురి పాత్రలో అనశ్వర రాజన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. దీంతో ఈ పాత్ర సినిమా కథలో చాలా కీలకంగా మారబోతోందని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో నటిస్తున్న ఇతర ముఖ్య నటీనటుల వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో నారా రోహిత్ మరియు నివేదా పెతురాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫలితంగా ఈ సినిమా స్టార్ కాస్టింగ్ పరంగా మరింత బలాన్ని పుంజుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి రెండు విభిన్నమైన లుక్స్ మరియు రోల్స్లో కనిపించి అలరించనున్నారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ చిత్రం మరో మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. జూన్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న రాత్రి ప్రీమియర్స్ తో షోలు ప్రారంభం అవుతాయి. పెద్ది చిత్రానికి సంబందించిన బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో ప్లాన్ చేశారు. జూన్ 1న నేడు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు ఎవరు వస్తారు అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఈవెంట్ కి హాజరయ్యే అతిథుల విషయంలో చిత్ర యూనిట్ సీక్రెట్ మైంటైన్ చేస్తోంది. ఎందుకు ఇంతలా దాచేస్తున్నారు అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే కొన్ని రూమర్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఈవెంట్ కి హాజరైతే అభిమానుల్లో జోష్ వేరే లెవల్ లో ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం లేదు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. పెద్ది చిత్రంలో రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించగా శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ Mega158. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్కు సిద్ధమైంది. మెగా 158 చిత్ర మొదటి షెడ్యూల్ కోసం మూవీ టీమ్ తమిళనాడులోని పొల్లాచికి తరలివెళ్లింది. ఈ రోజు నుంచే అక్కడ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ను దాదాపు 15 రోజుల పాటు పొల్లాచి పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో ప్లాన్ చేశారు. ఇందులో చిరంజీవిపై కొన్ని కీలకమైన సీన్లను డైరెక్టర్ బాబీ చిత్రీకరించనున్నారు. పొల్లాచి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం ఆదివారమే హైదరాబాద్ నుంచి బయలుదేరి లొకేషన్కు చేరుకుంది. ఈ సినిమాలో చిరు కూతురుగా మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ నటిస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్తోనే స్పీడ్ పెంచడం మెగా అభిమానుల్లో జోష్ నింపుతోంది. మెగాస్టార్ రెండు విభిన్న రోల్స్ లో అలరించనున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, మలయాళ హీరోయిన్ నివేదా పెతురాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మెగా 158(Mega158)పై సినీ వర్గాల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వాల్తేరు వీరయ్య(Valtair veerayya) వంటి భారీ సక్సెస్ తర్వాత డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) మరోసారి చిరంజీవితో చేతులు కలపడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్లో కుటుంబ ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. మెగాస్టార్తో పాటు యువ నటి అనశ్వర రాజన్(Anaswara Rajesh) పాల్గొన్న ఈ ఎపిసోడ్ కథలో ముఖ్యమైన మలుపులకు బలమైన పునాది వేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తొలి దశ పనులు పూర్తి చేసుకున్న యూనిట్, జూన్ నెల నుంచి తదుపరి షెడ్యూల్ను తమిళనాడులోని అందమైన పొలాచ్చి ప్రాంతంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు వారాల పాటు కొనసాగే ఈ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలతో పాటు విజువల్గా ఆకట్టుకునే ఎపిసోడ్లను తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందిన పొలాచ్చి లొకేషన్లు సినిమాకు ప్రత్యేకమైన విజువల్ రిచ్నెస్ను తీసుకురానున్నాయని చిత్ర యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాను టెక్నికల్ గా మరింత ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు డైరెక్టర్ బాబీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీ నిర్మాణ విలువలు, కమర్షియల్ అంశాలు, భావోద్వేగ కథనం కలయికగా ఈ సినిమా రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) తెలుగులో తమ తొలి సినిమాగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి ఇమేజ్కు తగ్గ స్థాయిలో ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది.

AR Rahman: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. అంతకంటే ముందుగానే, అంటే జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలను కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. Rasha Thadani: శ్రీనివాస మంగాపురం హీరోయిన్ రాశా టడాని.. ట్రెడిషనల్ లుక్లో మెరిసిన తార.. ఫొటోలు ఈ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో ఆస్కార్ విన్నర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండరీ నటుడి వారసత్వాన్ని అందుకోవడం, ఆయన స్థాయికి తగ్గట్టుగా రాణించడం ఎంత కష్టమో రెహమాన్ గుర్తుచేశారు. అయితే రామ్ చరణ్ ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక సొంత ఇమేజ్, ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారని ప్రశంసించారు. తన కుమారుడు కూడా చరణ్ లాగే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన ఆకాంక్షించారు. తెలుగు సినీ ఇండస్ట్రీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న రెహమాన్.. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న పరిశ్రమలో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. బుచ్చిబాబు సానా ఈ సినిమా కథను వివరించినప్పుడు అందులోని మట్టి వాసన, స్ఫూర్తిదాయకమైన కథాంశం తనను
మెగాస్టార్ చిరంజీవి , మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తాజా చిత్రం ‘Mega158’ ఇటీవలే గ్రాండ్గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంతో, ఈ సరికొత్త ప్రాజెక్ట్పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.పొల్లాచ్చిలో భారీ షెడ్యూల్ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త మరియు కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. దాదాపు రెండు వారాల పాటు ఏకధాటిగా సాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతున్నట్లు సమాచారం. పొల్లాచ్చిలోని అందమైన లొకేషన్లలో చిరంజీవిపై కొన్ని కీలకమైన, భారీ సన్నివేశాలను దర్శకుడు బాబీ ఇక్కడ తెరకెక్కించనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవిలోని వింటేజ్ హ్యూమర్ను అద్భుతంగా పండించిన బాబీ, ఈసారి మెగాస్టార్లోని పవర్ఫుల్ ఎమోషనల్ యాంగిల్ను విభిన్నంగా ఆవిష్కరించబోతున్నారని ఇన్సైడ్ టాక్. మాస్ అంశాలతో కూడిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ పాత్ర రెండు విభిన్న కోణాల్లో సాగుతుందని తెలుస్తోంది. * మరో బంపరాఫర్ కొట్టిన నారా రోహిత్.. ‘మెగా 158’ మూవీలో కీలక పాత్ర? కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే KVN ప్రొడక్షన్స్ టాలీవుడ్లోకి ఘనంగా అడుగుపెడుతోంది. ఇక ఈ మెగా ప్రాజెక్ట్లో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్, సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్

<p>మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi) దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమైంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి (Chiranjeevi) బిగ్గెస్ట్ స్టార్. ఆయన స్థాయిని అందుకోవడం అంత తేలిక కాదు. అయితే ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కొత్త ప్రమాణాలను నెలకొల్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఐడెంటిటీ, ఇమేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ ఆయన వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టాడు రామ్ చరణ్. నా వారసుడు కూడా సంగీతంలో ఇలానే ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.</p><br/><p>ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్న పరిశ్రమలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథను బుచ్చిబాబు చెప్పినప్పుడు నాకు చాలా స్ఫూర్తిగా అనిపించింది. చాలా మంచి కథ, మట్టి కథ ఇది. ఈ చిత్రానికి పని

<p>మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi Movie) ప్రమోషన్స్లో యమా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఈ మేరకు జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి అల్లరి పనులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు బాగా సిస్టర్స్ కంటే బాగా అల్లరి చేసేవాడినని, అమ్మను కూడా బాగా ఇబ్బంది పెట్టే కొడుకునని చరణ్ నవ్వుతూ ఒప్పుకున్నారు. ‘‘ఒకసారి అమ్మ వచ్చి.. రామ్, భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరికీ అబద్ధాలు చెప్పకు’’ అని మందలించగా.. ‘ఎందుకు మమ్మీ?’ అని ప్రశ్నించానని, ‘‘ఎందుకంటే నువ్వు సరిగ్గా అబద్ధం చెప్పలేవు, దొరికిపోతావు’’ అని సరదాగా అన్నట్లు గుర్తుచేసుకున్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఇక స్కూల్ బంక్ కొట్టడం, ఇంకా చిన్న చిన్న అబద్ధాల నుంచి మొదలైన తన అల్లరి, ఆ తర్వాత మరింత శృతిమించిందని రామ్ చరణ్ తెలిపారు. తను, తన స్నేహితుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి రాత్రిపూట ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళడానికి ఒక ప్లాన్ వేసేవారట. తమ బెడ్రూమ్ కిటికీ గ్రిల్స్ యొక్క స్క్రూలను ఊడదీసి, రాత్రి వేళల్లో కిటికీ గుండా బయటకు దూకేసేవారట. బయట ఫ్రెండ్స్తో కలిసి కార్ డ్రైవింగ్లు, ఐస్క్రీమ్లు తింటూ నైట్ అవుట్స్ చేసి, తెల్లవారేసరికి మళ్ళీ గుట్టుచప్పుడు కాకుండా లోపలికి వచ్చి ఆ గ్రిల్స్ని యథావిధిగా బిగించేసేవారట.</p><br/><p>అయితే, ఒకరోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆ కిటికీ గ్రిల్స్ని పూర్తిగా మేకులతో కొట్టేసి సీల్ చేయడాన్ని చూసి షాక్ అయ్యామని చరణ్ చెప్పారు. వారు చేస్తున్న ఈ దొంగచాటు నైట్ అవుట్ ప్లాన్ను కనిపెట్టడానికి వాళ్ళ ఇంట్లో వారికి రెండు మూడు నెలల సమయం పట్టిందట. ఈ విషయాలన్నీ మెగాస్టార్ చిరంజీవికి తెలుసా అని యాంకర్

మెగాస్టార్ చిరంజీవి ఎయిర్పోర్ట్ దృశ్యాలు! ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి.

Mega 158: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158(Mega 158)’ ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ సరికొత్త సినిమాపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకున్న చిత్ర యూనిట్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. Ram Charan: ముందు ప్రమోషన్స్.. ‘పెద్ది’ విడుదల తర్వాతే సర్జరీ.. రామ్ చరణ్ డెడికేషన్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా ఈ సినిమాలో సెకండాఫ్లో వచ్చే ఒక కీలకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ విలక్షణ నటుడు నారా రోహిత్ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. కథ ప్రకారం ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పాత్ర కోసం పలువురు యంగ్ హీరోలను పరిశీలించిన తర్వాత, చివరకు నారా రోహిత్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విలక్షణమైన కాంబినేషన్పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుండగా, మలయాళ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ చిరంజీవి కూతురిగా కనిపించనుంది.

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!! పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. విశ్వంభర రిలీజ్ వాయిదా.. వెనుక అసలు రీజన్ అదేనా?
బాణం, సోలో, ప్రతినిధి, అసుర, రౌడీ ఫెలో వంటి విభిన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్న నారా రోహిత్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ దశలో ఉంది. ఇటీవల భైరవం, సుందరకాండ వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆయన ప్రస్తుతం సీనియర్ హీరోలకు హాట్ ఫేవరెట్గా మారిపోయింది. ఒకేసారి ఇండస్ట్రీలోని ఇద్దరు అగ్ర హీరోల ప్రాజెక్టులలో కీలక పాత్రలు దక్కించుకుంటూ ఫిల్మ్ నగర్ వర్గాలలో హాట్ టాపిక్గా మారారు.అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో యువ హీరోలు పవర్ఫుల్ పాత్రల్లో మెరవడం కొత్తేమీ కాదు, మరి ఈ సినిమాలో రోహిత్ పాత్ర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..* అజిత్ నివాసానికి సీఎం విజయ్, నటి త్రిష.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన దృశ్యాలు! మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందనున్న భారీ చిత్రం ‘Mega158’ ఇటీవల గ్రాండ్గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంతో, ఈ కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభరని ఫినిష్ చేసే పనిలో ఉన్న చిరు.. ఈ మధ్యనే మెగా 158 ని మొదలుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభరని ఫినిష్ చేసే పనిలో ఉన్న చిరు.. ఈ మధ్యనే మెగా 158 ని మొదలుపెట్టారు. చిరుకు వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమాను అందించిన బాబీ ఇప్పుడు మెగా 158 కి దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ మధ్యనే ఎంతో గ్రాండ్ గా ఈ సినిమా లాంచ్ అయ్యింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు గెస్ట్ గా విచ్చేశారు. ఈ చిత్రంలో చిరు సరసన ప్రియమణి నటిస్తోండగా.. వారి కూతురిగా అనస్వర రాజన్ నటిస్తోందని టాక్. ఇక చిరు సినిమా అంటే.. ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ? అని ఎదురుచూస్తూ ఉంటుంది. అంతేకాకుండా చిరు సినిమా నుంచి ఏ చిన్న లీక్ అయినా అది సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా మెగా 158 నుంచి ఒక లీక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తోందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నారా వారబ్బాయి నారా రోహిత్ ఒక గెస్ట్ రోల్ లో నటించనున్నాడని టాక్ నడుస్తోంది. సుందరకాండ సినిమాతో రీఎంట్రీ హిట్ అందుకున్న నారా రోహిత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మెగా 158 లో రోహిత్ ఒక చిన్న గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. చివర్లో చిరు కూతురికి వరుడిగా నారా రోహిత్ కనిపించనున్నాడని, చిన్న

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మెగా 158 భారీ చిత్రం ఇటీవల గ్రాండ్ గా పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్కు వెళ్లేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. తంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కలయికలో వస్తున్న ‘Mega158’ పై అంచనాలు అప్పుడే స్కై హై లో ఉన్నాయి. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో నారా హీరో నారా రోహిత్ పేరు పరిలిస్తున్నట్టు సమాచారం. సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఇంపార్టెంట్ రోల్ కోసం పలువురు హీరోల పేర్లు పరిశీలించి నారా రోహిత్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు ఈ విలక్షణమైన కాంబినేషన్ వెండితెరపై సరికొత్త హంగామా సృష్టించడం ఖాయం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా సీనియర్ నటి ప్రియమణి, మలయాళ యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్ ఈ సినిమాలో చిరు కూతురుగా నటిస్తోంది.

టాలీవుడ్ లో సడెన్ గా ట్రెండ్ మారింది. హీరోలంతా గ్యాంగ్ స్టర్ కథలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది హీరోలు గ్యాంగ్ స్టర్ కథలతో చిత్రాలు ప్రారంభించారు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ల నుంచి తారక్, నాని లాంటి నేటి తరం హీరోల వరకు అందరూ గ్యాంగ్ స్టర్ సినిమాలే చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీరసింహా రెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మరోసారి నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కుతోంది. బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో రెండవ చిత్రం పార్రంభం అయింది. ఈ మూవీ మాఫియా నేపథ్యంలో ఉండబోతోందట. చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. అయినప్పటికీ కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. సిన్సియర్ పోలీస్ అధికారి మాఫియా డాన్ గా మారితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు నమోదవుతాయి. ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ సెటప్ తో ఉంటాయి. కథా నేపథ్యంలో కొత్తగా ఉంటుంది. అయినప్పటికీ హీరో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారు. డ్రాగన్ మూవీలో తారక్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని ఇటీవల మాస్ చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుజీత్ దర్శకత్వంలో నాని బ్లడీ రోమియో అనే చిత్రంలో నటించనున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ కథాంశం. ఇలా హీరోలంతా వరుసపెట్టి మాఫియా, గ్యాంగ్ స్టర్

తెలుగు చిత్ర పరిశ్రమలో కులాల ప్రస్తావన ఎప్పుడూ ఉండేదే. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఎక్కువగా కులాల ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో కులాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవి గురించి ఆయన ప్రస్తావించారు. రాఘవేంద్ర రావు కమర్షియల్ చిత్రాలు ఎంత అద్భుతంగా తీశారో భక్తిరస చిత్రాలు కూడా అంతే అద్భుతంగా తెరకెక్కించారు. నాగార్జునతో ఆయన రూపొందించిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలు చరిత్రలో నిలిచిపోతాయి. నాగార్జున రాఘవేంద్రరావు తెరకెక్కించిన మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. హథీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా రాఘవేంద్ర రావు ఈ మూవీ తెరకెక్కించారు.ఈ మూవీ రిలీజ్ టైంలో హథీరాం బాబా కులం గురించి చర్చ జరిగింది. అయితే రాఘవేంద్ర రావు ఆయన్ని ఒక భక్తుడిగా మాత్రమే చూపించారు. ఆయన కులం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయినప్పటికీ వివాదం రావడంతో ఈ విధంగా స్పందించారు. మానవజాతి మొత్తం ఒకే కులం. వాల్మీకి, వ్యాసులది ఏ కులం అని ఎవరైనా అడుగుతారా అని రాఘవేంద్ర రావు ప్రశ్నించారు. వాళ్ళ వాళ్ళ కులాల్లో గొప్పవారు ఉన్నప్పుడు వారి గురించి పాజిటివ్ గా చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకే కులానికి ఆపాదించడం మాత్రం తప్పు. సినిమాకు అసలు కులం ఉండకూడదు. ఎందుకంటే సినిమాని అందరూ చూడాలి. చిరంజీవి గారు ఒక కులానికి చెందిన వ్యక్తి, నేను మరొక కులానికి చెందిన వాడిని. కానీ మద్రాసులో ఉన్నప్పుడు చిరంజీవి కులం ఏంటో కూడా నాకు తెలియదు. అయినప్పటికీ చిరంజీవితో నేను అత్యధిక

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక చిత్రం 'నేనెవరు'. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ (Rajendraprasad) ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక చిత్రం 'నేనెవరు' (nenevaru) ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి తెలిపారు. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అనేక కేంద్రాల్లో ఆక్యూపెన్సీ బావుందని వెల్లడించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్తో థియేటర్ల సంఖ్య పెరుగుతోందని, మరిన్ని కేంద్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఇంత గొప్ప ఆదరణ అందించడం చాలా ఆనందంగా ఉందని, మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం సంతోషకరమని అన్నారు. చిత్ర దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సాయికిరణ్, జోగిని శ్యామల తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని, సినిమాలోని భావోద్వేగాలు, సందేశాత్మక అంశాలు, కోర్టు సన్నివేశాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.

Nenevaru: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యంగ్ డైరెక్టర్ చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక వినోదాత్మక చిత్రం “నేనెవరు?(Nenevaru)”. మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన తెచ్చుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అనేక కేంద్రాల్లో హౌస్ఫుల్ షోలతో రన్ అవుతుండటంతో, లభిస్తున్న పాజిటివ్ టాక్ ఆధారంగా థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి వెల్లడించారు. Neha Shetty: నెటెడ్ డ్రెస్సులో నేహా శెట్టి గ్లామర్ అటాక్.. నయా లుక్ తో సెన్సేషన్.. ఫొటోలు ఈ ఘన విజయంపై డా. రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ చిత్ర యూనిట్ను ప్రత్యేకంగా అభినందించారు. ఒక మంచి కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. సినిమాలో సాయికిరణ్, జోగిని శ్యామల నటనతో పాటు భావోద్వేగాలు, కోర్టు సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చిత్ర బృందం తెలిపింది. దర్శకుడి కథనంతో పాటు చిన్నికృష్ణ సంగీతం, నాయుడు ప్రసాద్ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి – తారకరామారావు ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. “ప్రతి ఒక్కరూ చూడాల్సిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్” అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆడియన్స్ నుండి వస్తున్న భారీ డిమాండ్ను బట్టి మరిన్ని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

<p>'కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్ (SKN), సాయి రాజేశ్ (Sai Rajesh) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story). కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీగౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, మెలొడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) సంగీతాన్ని సమకూర్చారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p><img class="lazy" loading="lazy" src="https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/CLS_1_jpg_632ae1db08.jpeg" alt="CLS 1.jpg.jpeg" width="6000" height="4000"></p><p>'చెన్నై లవ్ స్టోరీ' పాటల గురించి మేకర్స్ చెబుతూ, ' మా సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఆదరణతో ఛాట్ బస్టర్స్ గా మారుతున్నాయి. ఫస్ట్ సింగిల్ 'తొలి ప్రేమేం తోపు కాదే..' ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'వదలనే..' పాట కూడా ఇన్ స్టంట్ గా సక్సెస్ అయ్యింది. ఇలా రిలీజ్ చేసిన ప్రతి పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ జర్నీ చేస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.</p><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/tollywood/ram-charan-mechanical-engineer-lie-chiranjeevi-interview-rcb-72193.html"><strong>మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/oldies/rajinikanth-old-bus-conductor-id-card-crates-sensation-rcb-72192.html"><strong>అరుదైన పిక్.. సూపర్స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/tollywood/balakrishna-nbk111-gangster-look-mumbai-schedule-update-rcb-72186.html"><strong>NBK111:

<p>లీకైన రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీ ‘వారణాసి’ ఉగ్రభట్టి గుహల ఎపిసోడ్.. ఢిల్లీ హైకోర్టులో నాగచైతన్య బిగ్ విన్.. విజయ్ దేవరకొండ, విక్రమ్ కె. కుమార్ కాంబోలో మూవీ, ముంబైలో చర్చలు.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై సినీ నటుడు హీరో సుమన్ ప్రశంసలు.. యంగ్ హీరో అనీశ్, అనశ్వర రాజన్ కాంబో మూవీ ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్.. వంటి ఎన్నో అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం (Rapid Chitram) చూసేయండిక! </p><p></p><p><strong>ఇవి కూడా చదవండి:</strong></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/tollywood/ram-charan-mechanical-engineer-lie-chiranjeevi-interview-rcb-72193.html"><strong>మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/oldies/rajinikanth-old-bus-conductor-id-card-crates-sensation-rcb-72192.html"><strong>అరుదైన పిక్.. సూపర్స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/tollywood/balakrishna-nbk111-gangster-look-mumbai-schedule-update-rcb-72186.html"><strong>NBK111: బాలయ్య గ్యాంగ్స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!</strong></a></p><p style="text-align: start"><a target="_blank" rel="" href="https://www.chitrajyothy.com/2026/miscellaneous/bandla-ganesh-recalls-shocking-up-incident-during-poultry-business-plan-rcb-72155.html"><strong>యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?</strong></a></p><div id="articlebodyAdsDiv"></div>

డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సరికొత్త సందేశాత్మక వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రం “నేనెవరు?”. చిరంజీవి తన్నీరు రూపొందించిన ఈ చిత్రం మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రేక్షకాదరణతో ప్రదర్శితమవుతోంది. 'సరికొండ మల్లిఖార్జున్' సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా ఈ సినిమాకి నిర్మించారు. సినిమాకు అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తుందని, రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని నిర్మాతలు అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ను ప్రత్యేకంగా అభినందించారు. ఒక మంచి కథతో, సమాజానికి అవసరమైన సందేశంతో వచ్చిన “నేనెవరు?” చిత్రాన్ని ప్రేక్షకులు ఇంతలా ఓన్ చేసుకోవడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు భారీగా తరలివచ్చి థియేటర్లలో సినిమాను ఆదరించడం తనకు మరింత సంతృప్తిని కలిగించిందని తెలిపారు. దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సహా చిత్ర బృందానికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు.

బెంగుళూరులో జరిగిన పెద్ది సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో యాంకర్ ఒక పాత చిరంజీవి రాజ์కుమార్ ఫోటోను స్క్రీన్పై చూపించారు. ఆ పాత జ్ఞాపకాన్ని లైవ్లో రీక్రియేట్ చేయాలని యాంకర్ కోరారు. దీంతో వేదికపై ఉన్న శివన్న చరణ్ను దగ్గరకు తీసుకున్నారు. శివరాజ్ కుమార్ రామ్ చరణ్ బుగ్గపై ఆప్యాయంగా ముద్దు పెట్టారు. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. గతంలో చిరంజీవి గారు బెంగుళూరు వెళ్ళినప్పుడు రాజ్కుమార్ ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసేది. ఆ సమయంలో ఒక సినిమా ఈవెంట్లో రాజ్కుమార్ గారు చిరంజీవిని దగ్గరకు తీసుకున్నారు. అప్పుడు ఆయన చిరంజీవిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న దృశ్యం రికార్డైంది. అయితే ఆనాటి చిరంజీవి రాజ์కుమార్ ఫోటో కొంచెం క్లియర్గా క్యాప్చర్ కాలేదు. అయినప్పటికీ ఆ క్షణం ఫ్యాన్స్కు ఒక ఎప్పటికీ గుర్తిండిపోయే స్పెషల్ మూమెంట్గా మిగిలిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు వారి కొడుకులు ఆ పాత జ్ఞాపకాన్ని పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేశారు. శివన్న రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఆ మధుర క్షణాన్ని మళ్లీ కళ్ళకు కట్టారు. ఆ పాత చిరంజీవి రాజ์కుమార్ ఫోటో స్థానంలో ఇప్పుడు సరికొత్త విజువల్స్ వచ్చాయి. ఈ అద్భుతమైన సీన్ చూసి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ ఫ్యాన్స్ కూడా ఈ అరుదైన క్షణాన్ని చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు లెజెండరీ ఫ్యామిలీల మధ్య ఉన్న పాత స్నేహం మళ్లీ చర్చకు వచ్చింది. తరతరాలుగా ఈ రెండు కుటుంబాల బంధం ఇలాగే కొనసాగుతుండటం విశేషం. ఫలితంగా ఇరు పరిశ్రమల అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ వైరల్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన ‘పెద్ది’ ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త శైలిలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక ముఖాముఖి ఇంటర్వ్యూలో మాట్లాడిన చరణ్, తన బాల్యానికి సంబంధించిన పలు అరుదైన విషయాలను, తండ్రి చిరంజీవి పెంచిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు.స్టార్ హోదాకు దూరంగా పెంపకంతాను చిన్నతనంలో చాలా అమాయకంగా, బాహ్య ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేకుండా పెరిగానని రామ్ చరణ్ వెల్లడించారు. ‘ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో నా అజ్ఞానమే నాకు శ్రీరామరక్షలా నిలిచింది. మా నాన్నగారు టాలీవుడ్లో అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, ఆ ప్రభావం మా ఇంటిపై అస్సలు పడనిచ్చేవారు కాదు. సినిమా వాతావరణం, అవార్డులు, సినీ పత్రికలు ఏవీ మా ఇళ్లకు వచ్చేవి కావు. వాటిని ముట్టుకోవాలన్నా మాకు భయంగా ఉండేది. నాన్నగారు స్వయంగా పిలిస్తే తప్ప షూటింగ్స్ జరిగే ప్రాంతాలకు కూడా వెళ్లే ధైర్యం చేసేవాళ్ళం కాదు. అంతటి కఠినమైన క్రమశిక్షణతో మమ్మల్ని సాధారణ పిల్లల్లానే పెంచారు’ అని చరణ్ వివరించారు.* ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి వేడుకభయంతో చెప్పిన అబద్ధంసినిమాల్లోకి రావాలనే బలమైన కోరిక మనసులో ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని తండ్రికి చెప్పడానికి చరణ్ చాలా భయపడ్డారట. ‘నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావని నాన్న అడిగారు. అప్పట్లో నటుడు అవుతానని చెబితే ఎక్కడ కోప్పడతారో, కొడతారో అనే భయంతో ఆయన్ని మెప్పించడం కోసం మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తానని అబద్ధం చెప్పేశా. కానీ నా లోపల మాత్రం నటనపైనే ధ్యాస ఉండేది. ఆ తర్వాత నా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ ప్రమోషన్స్లో యమా బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రమోషన్స్లో చరణ్.. తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi Movie) ప్రమోషన్స్లో యమా బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రమోషన్స్లో చరణ్ తనదైన స్టైల్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను, అలాగే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) క్రమశిక్షణను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తనకు నటుడవ్వాలని కోరిక ఉన్నా, తన తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాక.. అబద్ధం చెప్పానని.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘‘నేను చిన్నప్పటి నుంచి ఒక రకమైన ఒంటరితనంతో, లోకజ్ఞానం లేకుండా ఉండేవాడిని. అజ్ఞానం అనేది ఒక వరం అయితే.. దానికి నేనే ఒక స్పష్టమైన ఉదాహరణని. మా ఇంట్లోకి సినిమా వాతావరణం అస్సలు వచ్చేది కాదు. సినిమాలకు సంబంధించిన అవార్డులు, మ్యాగజైన్లు అన్నీ ఆఫీస్ దగ్గరే ఆగిపోయేవి తప్ప, ఇంటికి వచ్చేవి కావు. సినిమా పత్రికలను ముట్టుకోవడానికి కూడా మేము భయపడేవాళ్లం. అందకు మా నాన్న ఎంత పెద్ద స్టార్ అనేది మాకు అప్పట్లో సరిగ్గా తెలిసేది కాదు. నాన్న పిలిస్తే తప్ప షూటింగ్ సెట్స్కి కూడా వెళ్లే ధైర్యం చేసేవాళ్ళం కాదు.. ఆ క్రమశిక్షణే మమ్మల్ని సినిమా ప్రపంచానికి దూరంగా ఉంచింది. ఇక నేను నటుడు అవ్వాలనుకుంటున్న విషయాన్ని కూడా చాలా కాలం పాటు నాన్నకు చెప్పలేదు. ఒకరోజు నాన్న నన్ను పిలిచి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. పక్కా మాస్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకు విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. మరోవైపు ట్రైలర్, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెద్ది ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా చరణ్, శివన్న కలిసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ ఫోటో చూసి ఒకప్పుడు చిరంజీవి , కన్నడ హీరో కంఠీరవ రాజ్ కుమార్ అనుబంధం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు. టాలీవుడ్ హీరో చిరంజీవి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మధ్య మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది. అయితే గతంలో రాజ్కుమార్ కుటుంబానికి చెందిన శ్రీ వజ్రేశ్వరీ కంబైన్స్ నిర్మాణ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కంఠీరవ రాజ్ కుమార్, చిరంజీవి ఇద్దరూ ఆప్యాయంగా కలుసుకున్నారు. ఇక ఇప్పుడు చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, రాజ్ కుమార్ కలిసిన ఫోటోను

Actors Ram Charan, Janhvi Kapoor and Shiva Rajkumar shot a promotional interview ahead of the release of their Buchi Babu Sana film Peddi. Given how they are all children of bona fide stars such as Chiranjeevi, Sridevi and Dr Rajkumar, they spoke about their p...

హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతోపాటు దక్షిణాదిలోని అన్నీ భాషలలో నటించి అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ నటిగా అలరిస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె సినీ రంగంలోని తన సుదీర్ఘ ప్రయాణంలో ఏర్పడిన బంధాలను, అగ్రతారలతో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరించారు. విక్టరీ వెంకటేష్ను తన “సెంటిమెంటల్ పర్సన్”గా తెలిపారు. వెంకటేష్ తన మొదటి హీరో, మొదటి స్నేహితుడు అని తెలిపారు. రోజూ మాట్లాడుకోకపోయినా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఉంటామని చెప్పారు. వెంకటేష్ను సెంటి పార్ట్గా, తనను మెంటల్ పార్ట్గా సరదాగా అన్నారు. కలియుగ పాండవులు సినిమాతో వీరి ప్రయాణం మొదలైందని గుర్తు చేసుకున్నారు. వెంకటేష్ కామెడీ, ఆయన సినిమాల పట్ల ఖుష్బూ ప్రశంసలు కురిపించారు. ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది.. నాగార్జునను “అత్యంత హ్యాండ్సమ్ హీరో”గా, “మోస్ట్ స్టైలిష్ యాక్టర్”గా ఖుష్బూ చెప్పుకొచ్చారు. ప్రతి మహిళ నాగార్జునను ప్రేమించాలని, ఆయనతో రొమాన్స్ చేయాలని కోరుకుంటుందని అన్నారు. 1986లో కెప్టెన్ నాగార్జున సినిమాలో చూసినప్పుడు ఆయన కార్గో ప్యాంట్లలో ఎంత స్టైలిష్గా కనిపించారో గుర్తు చేసుకున్నారు. నాగార్జున ఇప్పటికీ ఫిట్గా, హ్యాండ్సమ్గా ఉన్నారని, ఇటీవల ఆయనను కలిసిన ఒక స్నేహితురాలు “ఈ మనిషిని చూసి నేను ప్రేమలో పడిపోయాను” అని చెప్పిందని, తాను వెంటనే నాగార్జునకు మెసేజ్ చేసి ఈ విషయం చెప్పానని ఖుష్బూ వెల్లడించారు. ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న భారీ ఫాంటసీ మూవీ విశ్వంభర(Vishwambhara) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు చాలా కాలం క్రితమే పూర్తయినప్పటికీ, సినిమా విడుదల మాత్రం వరుస అడ్డంకుల కారణంగా ఆలస్యమవుతోంది. మొదట ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని నిర్మాతలు, ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే జూలై రిలీజ్ దాదాపు అసాధ్యంగా మారినట్టు టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సినిమాకు కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తికాకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ వీఎఫ్ఎక్స్ ఔట్పుట్ కోసం మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భారీ ఫాంటసీ ఎలిమెంట్స్తో తెరకెక్కుతున్న విశ్వంభరలో విజువల్స్ అత్యంత కీలకమని భావించిన టీమ్, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే నిర్ణయంతో ఉంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర(Hari gowra) బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులను పూర్తి చేసే దశలో ఉన్నారు. VFX షాట్స్ ఫైనల్ అయిన తర్వాతే దర్శకుడు మరియు నిర్మాతలు పూర్తి ఎడిట్ను లాక్ చేయనున్నారని సమాచారం. అనంతరం ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫార్మ్స్కు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి ఓటీటీ డీల్ను క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం విశ్వంభర రిలీజ్ డేట్పై క్లారిటీ లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో సరైన రిలీజ్ స్లాట్ ఎంపిక కూడా నిర్మాతలకు సవాల్గా మారింది. అన్ని అడ్డంకులను అధిగమించి, అత్యుత్తమ అవుట్పుట్తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో టీమ్ పనిచేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

దక్షిణాది చిత్రాల విశేషాలే కాదు, ఉత్తరాది సినిమాల వివరాలను అందించే న్యూస్ బులిటెన్ 'ర్యాపిడ్ చిత్రం'. ఇందులో ప్రపంచ సినిమా విశేషాల లెటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. తాజా ర్యాపిడ్చిత్రంలో ప్రజానాయకుడు ఎన్టీఆర్కు ప్రముఖులు ఇచ్చిన నివాళి, ఏపీ డిప్యూటీ సీఎంకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పెట్టుకున్న అర్జీ, ప్రస్తుత పరిస్థితులపై దర్శక నిర్మాత మధుర శ్రీధర్ స్పందన, 'జైలర్ 2'లో నటించబోతున్న హృతిక్ రోషన్, 'దీవాన' ఆలపించిన 'తెల్ల పోరీ' సాంగ్, 'ఒక్క అడుగు'తో జనం ముందుకు రాబోతున్న శేఖర్ మాస్టర్, తదితర విశేషాలను చూసేద్దాం. Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. దీంతో కోలీవుడ్ లో హీరో విజయ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. మొదలైంది. ఈ నేపథ్యంలో, సీఎం విజయ్ కుమారుడి మొదటి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగాఆ మూవీ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ కూడా త్వరలో విడుదల కానుంది. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తమిళ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సిగ్మా’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటించాడు. యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ కుమారుడి తొలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు సంపత్ రాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్కు మంచి స్పందన వచ్చింది. జేసన్ సంజయ్ దర్శకత్వం కూడా బాగుందని ప్రశంసలు వచ్చాయి. కాగా ఈ సిగ్మా సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించారు. కాగా తండ్రిలాగే జేసన్ కూడా హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడని వదంతులు వచ్చాయి. కానీ అతను మాత్రం దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. సినిమా ప్రారంభం కావడానికి ముందే సంజయ్, విజయ్కి కథ చెప్పాడని, విజయ్ కూడా బాగా

నటి జ్యోతి అంటే టక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ తిలోత్తమ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన పాత్రతో నటనతో అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జ్యోతి. గతంలో జ్యోతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. జ్యోతి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి చిరంజీవి గారే తనను స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. చిరంజీవి గారి డాన్స్ స్టెప్పులను కాపీ ద్వారానే తనకు డాన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని, అది సినిమాల్లోకి రావడానికి మార్గం సుగమం చేసిందని జ్యోతి అన్నారు. స్కూల్ లేదా ఊరిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్స్లో ముందుండేదాన్నని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తండ్రి ప్రోత్సాహంతోనే తాను సినీ రంగంలోకి వచ్చానని, అయితే చిత్రసీమలో ప్రవేశించిన తర్వాత తన తండ్రి గుండెపోటుతో మరణించడం తన జీవితంలో అతిపెద్ద బాధగా మిగిలిందని జ్యోతి విచారం వ్యక్తం చేశారు. ఆ బాధ నుండి కోలుకోవడానికి సమయం పట్టిందని ఆమె పేర్కొన్నారు.ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్లో అందరూ షాక్ అయ్యాం.. చిరంజీవి గారితో కలిసి నటించాలనే తన కల అందరివాడు సినిమాతో నెరవేరిందని జ్యోతి గుర్తుచేసుకున్నారు. అందరివాడు సినిమాలో చిరంజీవి గారు ద్విపాత్రాభినయం చేశారని, సినిమాలో పెళ్లిచూపుల సన్నివేశంలో తన పాత్ర చిరంజీవి గారిని కాదని, మరో వ్యక్తిని వివాహం చేసుకునే సన్నివేశం.. అయితే ఆ సీన్ తనకు చాలా బాధగా అనిపించిందని ఆమె గుర్తుచేసుకున్నారు. చిరంజీవిలాంటి వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని.. వేరొకరిని ప్రేమించా అని చెప్పే ఆ సన్నివేశం చాలా ఇబ్బందిగా అనిపించింది అని ఆమె తెలిపారు. ఆ సీన్ టైం

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా పసివాడి ప్రాణం. ఈ సినిమా మంచివిజయాన్ని అందుకోవడమే కాదు అప్పటిలో మెగాస్టర్ క్రేజ్ ను డబుల్ చేసింది. కాగా ఈ సినిమాలో క్రూరమైన విలన్గా నటించి, చిన్నారిని కిడ్నాప్ చేసి, ప్రేక్షకులను భయపెట్టిన నటుడు బాబు ఆంటోనీ. మెగాస్టార్తో పోటాపోటీగా ఫైట్లు చేసిన ఈ నటుడిని చాలామంది ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. మాటలు రాని చిన్నారిని ఎత్తుకుపోయే కిడ్నాపర్ పాత్రలో ఆయన పండించిన విలనిజం ఆ సినిమా విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి. బాబు ఆంటోనీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భారతీయ భాషల్లో విలన్గా, సహాయ నటుడిగా సుమారు 175కు పైగా చిత్రాలలో నటించారు. తెలుగులో ఆయన ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కనిపించారు. పసివాడి ప్రాణంతో పాటు త్రినేత్రుడు, జేబు దొంగ, అడవిలో అభిమన్యుడు, లారీ డ్రైవరు, శత్రువు, చైతన్య, శాంతి క్రాంతి వంటి హిట్ చిత్రాలలో ఆయన విలనిజం పండించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన పెద్ద శరీరం, మార్షల్ ఆర్ట్స్లో ఆయనకున్న నైపుణ్యం తెరపై ఆయన పాత్రలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రస్తుతం బాబు ఆంటోనీ తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా, ఇతర భాషల్లో సినిమాలు చేస్తూనే ఉన్నారు. మొన్నామధ్య మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మళ్ళీ పలకరించారు. సినిమాలకు దూరంగా ఉన్నా, బాబు ఆంటోనీ నిత్యం బిజీగానే ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్లో నిపుణుడైన ఆయన స్వయంగా తన పేరు మీదనే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ స్కూల్ ను స్థాపించారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ స్కూల్

సినిమా ప్రముఖులంతా చిరంజీవి ఇంట్లో సమావేశమై టికెట్ ధరలు పెంచడం ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనే చర్చలు జరపడం ఆందోళ నకరమైన విషయమని నారాయణ అన్నారు. సినిమా ప్రముఖులంతా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమై టికెట్ ధరలు పెంచడం ద్వారా వచ్చిన ఆదనపు ఆదాయంలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనే చర్చలు జరపడం ఆందోళనకర మైన విషయమని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ (Narayana) అన్నారు. పెద్ద సినిమాలకు భారీ ఖర్చులు అవుతాయనే పేరుతో బెనిఫిటోలు, ప్రత్యేక షోల పేరుతో సామాన్యులపై అదనపు భారం మోపడం సమంజసం కాదని గురు వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సినిమా ఓ వినోద మాధ్యమమని కళల పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేయడం సరైన విధానం కాదన్నారు. ఇలాంటిది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలే తప్ప కొద్దిమంది వ్యాపార ప్రయోజనాలకు వేదిక కాకూడదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు టికె ట్ ధరల పెంపు విషయంలో స్పష్టమైన విధనాలు ఉండాలని, కళల అభివృద్ధి పేరుతో దోపిడీకి అవకాశం కల్పించకూడదని సూచించారు.

ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. ఇప్పటి వరకు అమలవుతున్న రెంటల్ సిస్టమ్ను ఇక ఆపేయాలంటున్నారు ఎగ్జిబిటర్లు. తమకు కావాల్సింది రెంట్ కాదు.. సినిమా కలెక్షన్లలో వాటా అనేది ఎగ్జిబిటర్ల డిమాండ్. ఇప్పటికిప్పుడు పర్సంటేజీ ఇవ్వాలంటే కుదరదు.. టైమ్ కావాలనేది ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఆన్సర్. అంత సమయం ఇచ్చేదే ఇచ్చేదే లేదు.. ఈ క్షణం నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే, లేదంటే సింగిల్ స్క్రీన్లపై షోలు పడవు అని తేల్చి చెప్పారు ఎగ్జిబిటర్లు. ఈ మొత్తం వివాదం.. త్వరలోనే రిలీజ్కు రెడీగా ఉన్న పెద్ది సినిమాపైనే ఫస్ట్ ఎఫెక్ట్ పడబోతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నెన్ని మీటింగ్స్ జరిగాయో. మీటింగ్స్లో ఓ పెద్ద సిరీస్ నడిచింది. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు రెండుసార్లు భేటీ అయ్యారు. చిరంజీవితో రెండు సిట్టింగ్స్ నడిచాయి. పవన్ కల్యాణ్తో ఒక భేటీ అయింది, మరో భేటీకి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవినే చూస్తున్నారు కాబట్టి.. ఎగ్జిబిటర్లందరూ కలిసి ఆయన ఇంటికే వెళ్లారు. రెండోసారి కూడా చిరంజీవిని కలిసి మాట్లాడి, తమ సమస్యకు పరిష్కారం రాబట్టుకున్నారు. ఆ సొల్యూషన్ ఏంటంటే.. జూన్ 30 తరువాత నుంచి సింగిల్ స్క్రీన్లకు రెంటల్ సిస్టమ్ ఉండదు, సినిమా కలెక్షన్లలో పర్సంటేజ్ మాత్రమే అమలవుతుంది అని ఎగ్జిబిటర్లకు చిరంజీవి హామీ ఇచ్చారు. ఒకవేళ పెద్ది సినిమా టికెట్ రేట్లు పెంచితే.. సింగిల్ స్క్రీన్లకు రెంట్తో పాటు ఆ పెరిగిన టికెట్ ధరలో 7.5 శాతం పర్సంటేజ్ కూడా ఇవ్వాలని ఓ నిర్ణయానికొచ్చేశారు. ఈ సొల్యూషన్ ఇప్పటి వరకే. జూన్ 30 వరకే. ఎగ్జిబిటర్లకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనేది కమిటీ డిసైడ్ చేస్తుంది కాబట్టి అంత వరకు ఓపిక పట్టమన్నారు చిరంజీవి. ఆ కమిటీ

Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ దూసుకుపోతున్నారు. తన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, చార్ట్బస్టర్ సాంగ్స్తో సినిమా రేంజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడం థమన్ ప్రత్యేకత. ఇప్పటికే టాలీవుడ్లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసి ఎన్నో బ్లాక్బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఊరమాస్ ఎలివేషన్స్ ఇవ్వాలన్నా, రీసెంట్ పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రానికి గూస్బంప్స్ మ్యూజిక్ అందించాలన్నా అది తమన్ కె సాధ్యమైంది. Nandamuri Heroes: ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ముగ్గురూ కలిసి యాక్ట్ చేసిన సినిమా తెలుసా? అప్పట్లోనే సెన్సేషన్ అయితే, ఇంతమంది స్టార్ హీరోలకు భారీ హిట్స్ ఇచ్చిన థమన్.. మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఇప్పటివరకు తన కెరీర్లో ఆశించిన స్థాయిలో పెద్ద మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయారు. గతంలో వారి కాంబినేషన్లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఆశించినంతగా సౌండ్ చేయలేదు. కానీ, ఇప్పుడు మెగాస్టార్-డైరెక్టర్ బాబీ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో చిరంజీవిపై ఉన్న తన అభిమానాన్ని చాటుకోవాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి తమన్(Thaman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మెగాస్టార్కి సరైన ‘మెగా మ్యూజిక్’ ఇచ్చే అవకాశం తనకు రాలేదని, కానీ ఈ సినిమాతో చిరుపై తనకున్న ప్రేమేంటో సంగీతం ద్వారా చూపిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తమన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈసారి తమన్ థియేటర్లలో ఊచకోత కోయడం ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు నాగబాబు నిర్మాణంలో నటించిన చిత్రం రుద్రవీణ. ఈ చిత్రానికి దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ దర్శకత్వం వహించారు. రుద్రవీణ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఈ చిత్రం ఫ్లాప్. ఈ మూవీలో శోభన హీరోయిన్ గా నటించింది. రుద్రవీణ చిత్రం కమర్షియల్ మూవీ కాదు. సందేశాత్మక చిత్రం. అప్పటికి చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ కి ఇలాంటి సినిమా చేయడం అంటే సాహసమే. అయినా చిరంజీవి చేశారు. రిజల్ట్ నిరాశపరిచింది. దీనితో రుద్రవీణ తర్వాత మంచి మాస్ మూవీ చేసి హిట్ కొట్టాలని చిరంజీవి డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో తన స్నేహితులకు చేయూతనివ్వాలని కూడా చిరంజీవి భావించారు. దీనితో రుద్రవీణ తర్వాత చిత్రాన్ని నిర్మించే బాధ్యతని చిరు తన స్నేహితుడు జివి నారాయణరావుకి అప్పగించారు. ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాణంలో చిరంజీవి రూమ్ మేట్స్ నటుడు సుధాకర్, హరిప్రసాద్ లు కూడా భాగం అయ్యారు. ముగ్గురూ కలసి యముడికి మొగుడు అనే చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించారు. ఈ చిత్రం విడుదలై హిట్ కావడం కాదు.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. ఈ మూవీని నిర్మిస్తూనే సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కామెడీ వేషంలో నటించారు. కోట శ్రీనివాసరావు కొడుకుగా సుధాకర్ పండించిన కామెడీ కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రంతో సుధాకర్ నిర్మాతగా సక్సెస్ కావడం మాత్రమే కాదు.. ఓవర్ నైట్ లో స్టార్ కమెడియన్ గా మారిపోయారు. ఈ మూవీ తర్వతే సుధాకర్ కి కమెడియన్ గా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ చిత్రాన్ని నారాయణ రావు, సుధాకర్, హరిప్రసాద్ నిర్మించారు కానీ వాళ్ళు రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో పెద్ది టీమ్ ఆసక్తికరమైన విశేషాలు తెలియచేసింది. ఇదే సమయంలో మెగాఫ్యాన్స్ అంతా ఈ ఫ్యామిలీకి హనుమాన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో డివోషనల్ మూవీస్లోనే దైవలీలలు కనిపించేవి. అడపా దడపా సోషల్ మూవీస్లోనూ ఫాంటసీ పేరుతో దేవుళ్ళను చూపించే వారు. అయితే ఈ మధ్య కాలంలో ఆ తరహా క్రియేటివ్ ఫ్రీడమ్ను మేకర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. స్టార్ హీరోలైనా దైవిక బలంతోనే వారు విజయం సాధించినట్టుగా చూపించడం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఆంజనేయ స్వామి అండ ఆయనకు లభించినట్టుగా చాలా వాటిల్లో చూపించారు. కొన్ని సినిమాలలో చిరంజీవి (Chiranjeevi) సరదాగా 'హనుమంతుడి' గెటప్లోనూ కనిపించారు. అలానే ఆంజనేయ స్వామి గొప్పతనాన్ని తెలిపే పాటలు, సన్నివేశాలు ఆయన సినిమాల్లో అనేకం ఉన్నాయి. త్వరలో రాబోతున్న విశ్వంభర (Vishwambhara) లోనూ హనుమంతుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని టీజర్ చూస్తే అర్థమౌతోంది. పైగా గతంలో వచ్చిన 'హనుమాన్' యానిమేటెడ్ మూవీకి చిరంజీవి డబ్బింగ్ చెప్పడం, తన బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ కు హనుమంతుడి లోగోనే పెట్టడం ఇవన్నీ మెగా కుటుంబానికి హనుమంతుడితో ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెబుతున్నాయి. రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలోనూ హనుమంతుడికి సంబంధించిన ఓ ఎపిసోడ్ ఉందని చెబుతున్నారు. డైరెక్ట్ గా హనుమంతుడు సినిమాలో కనిపించకపోయినా.. ఆయాన ప్రభావాన్ని ఇందులో చూపించారని తెలుస్తోంది. రామ్ చరణ్ గదను భుజాన పెట్టుకుని ఉన్న సన్నివేశం, ఆ తర్వాత దానితో చేసే పోరాటం చూస్తే.. రామ్ చరణ్లో హనుమంతుడి అంశ కనిపిస్తుందని అంటున్నారు. గతంలో 'ట్రిపుల్

పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల సినిమాలకు సమస్యలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా రిలీజ్ అవడానికి నానా పాట్లు పడుతుంటే ఏమనుకోవాలి. అవును 'విశ్వంభర' గురించే ఈ డిస్కషన్. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం మొదలైంది. భారీ బడ్జెట్, సోషియో ఫాంటసీ స్టోరీ అని ఓ రేంజ్ హైప్ ఇచ్చారు. తీరా చూస్తే థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇంతకీ 'విశ్వంభర' రిలీజ్ ఎక్కడివరకు వచ్చింది? (ఇదీ చదవండి: మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ 'త్రికాల' రివ్యూ) చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చాన్నాళ్ల క్రితం మొదలైన సినిమా 'విశ్వంభర'. యూవీ క్రియేషన్ దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టిందని రూమర్స్ వచ్చాయి. అయితే రెండున్నరేళ్ల క్రితం టీజర్ రిలీజైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఘోరాతీఘోరంగా విమర్శలు వచ్చాయి. దీంతో టీమ్ అంతా పునరాలోచనలో పడిపోయింది. తర్వాత మరో వీడియో రిలీజ్ చేశారు. ఓ పాట వదిలారు. అయినా సరే బజ్ రాలేదు. దీని షూటింగ్ గతేడాది పూర్తి చేసిన చిరంజీవి.. అనిల్ రావిపూడితో 'మన శంకరవరప్రసాద్' సినిమా చేశారు. ఇది రిలీజై 5 నెలలు దాటేసింది. విశ్వంభర చిత్రం ఈ ఏడాది వేసవిలో రావొచ్చని కొన్ని నెలల క్రితం అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు వేసవి కూడా దాదాపు అయిపోవచ్చింది. కానీ చిరు మూవీ సంగతేంటనేది ఎవరికీ తెలీదు. అదుగో ట్రైలర్, ఇదుగో మూవీ రిలీజ్ డేట్ అని పలు సందర్భాల్లో రూమర్స్ వస్తున్నాయి. కానీ వీటిని జనాలు లైట్ తీసుకుంటున్నారు. చూస్తుంటే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్కే ఈ చిత్రంపై దాదాపుగా ఇంట్రెస్ట్ పోయినట్లు అనిపిస్తుంది. రీసెంట్గానే బాబీ దర్శకత్వంలో కొత్త సినిమాని మొదలుపెట్టిన చిరు..

‘ఎన్ని తరాలు మారినా తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఎన్ని తరాలు మారినా తారక రాముని (NTR) ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). దివంగత నటుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ను ఆయన స్మరించుకున్నారు. ఆయనతో దిగిన ఫొటోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి నివాళులు అర్పించారు. ‘అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన ఎన్టీఆర్ చిరస్మరణీయులు. ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక ఎన్నో పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడు ఆయన. ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవళ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు దక్కడం ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. గురువారం ఉదయాన్నే ఎన్టీఆర్ గార్డెన్స్లో నందమూరి తారకరామారావు ఘాట్ వద్దకు చేరుకుని నివాళి అర్పించారు జూనియర్ ఎన్టీఆర్. అలాగే సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ను తలచుకుంటూ కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పోస్టులు పెట్టారు.

Chiranjeevi personally intervened to resolve a standoff between exhibitors and producers over the rental versus percentage-sharing debate for Ram Charan's Peddi film in Telangana.
💰 1 cr
Chiranjeevi : ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్స్ తమ వ్యూస్ కోసం తప్పుడు వార్తలు, తప్పుడు థంబ్ నెయిల్స్ తో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. పలువురు సినిమా సెలబ్రిటీలపై కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గతంలో వదిలేసినా ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం పై తప్పుడు వార్తలు పోస్ట్ చేయడంతో ఓ యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదయింది. చిరంజీవి అనారోగ్యం పాలయ్యారు అని తప్పుడు వార్తలతో, చిరంజీవి మార్ఫింగ్ వీడియోలతో వీడియో పోస్ట్ చేసింది ఓ యూట్యూబ్ ఛానల్. Also Read : Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంని కలవాలంటున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు.. లెటర్ వైరల్.. దీంతో న్యాయవాది రామకృష్ణ మిర్యాల ఈ వీడియోపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్ చిరంజీవి ఆరోగ్యానికి సంబంధించి అవాస్తవ, అభ్యంతరకర కంటెంట్ను రూపొందించి పోస్ట్ చేసారని, దాన్ని సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసారని, అభిమానులను ఆందోళనకు గురిచేశారని, వ్యూస్ కోసమే ఈ పనిచేసిందని వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రాథమిక పరిశీలన చేసి చిరంజీవి ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోలు పోస్ట్ చేసిన సదరు యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య థియేటర్ల అద్దె విషయమై గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య థియేటర్ల అద్దె విషయమై గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. థియేటర్ల ప్రదర్శనలో అద్దె విధానానికి బదులు పర్సెంటేజ్ విధానాన్ని తీసుకురావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యనిర్వహణా సంఘం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అవ్వడంతో ఇండస్ట్రీ మరింత హీట్ ఎక్కింది. తాజాగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన ఆయన ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యారు. బుధవారం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్ రావు, సెక్రటరీ శ్రీధర్, అనుపమ్ రెడ్డి, బాలగోవింద్ రాజు, భరత్ నారంగ్ తదితరులు.. మెగాస్టార్ నివాసంలో భేటీ అయ్యారు. పెద్ది సినిమా నుంచే పర్సెంటేజ్ విధానాన్ని అమలు పర్చే నిర్ణయాన్ని ఆయన ముందు ఉంచడం జరిగింది. ఎగ్జిబిటర్లతో చిరంజీవి చర్చించి.. చివరకు ఒక ఒప్పందానికి వచ్చి ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. 'తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యనిర్వహణా సంఘం ఏర్పాటు చేసిన ఉపసంఘం పేర్కొన్న కాలపరిమితి (30 జూన్ 2026) లోగా శాతాల విధానాన్ని సాధించేలా, ఉపసంఘం సమావేశాలను, ఫలితాలను తాను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని శ్రీ చిరంజీవి గారు హామీ ఇచ్చారు. చిరంజీవి గారి హామీ మేరకు, 'పెద్ది' సినిమా సజావుగా విడుదలయ్యేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జారీ చేసిన

Megastar Chiranjeevi: టాలీవుడ్లో గత కొంతకాలంగా ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య నడుస్తున్న పర్సంటేజ్ వివాదానికి ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన కీలక చర్చలు సఫలమయ్యాయని సమాచారం. రెండు రోజుల వ్యవధిలోనే మెగాస్టార్తో ఎగ్జిబిటర్లు రెండోసారి ప్రత్యేకంగా సమావేశమై ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక ముగింపుని పలికారని సమాచారం. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ను విడుదల చేసింది. మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఏపీలో టికెట్ల ధరలు పెరిగినట్లయితే.. దానికిగానూ 7.5 శాతం మొత్తాన్ని చెల్లించాలని ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. నిర్మాతలకు – థియేటర్ల యాజమాన్యాలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాతలను – థియేటర్ల యాజమాన్యాలను సమన్వయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు రోజులు భేటీలు నిర్వహించి వివాదం ముదిరిపోకుండా చక్కని పరిష్కారం చూపించారని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల భేటీ అనంతరం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామన్స్ సెక్రటరి శ్రీధర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటకు కట్టుబడి ఉంటాము. పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచితే రెంట్తో పాటు 7.5 పర్సెంటేజ్ ఇస్తామన్నారు. అలాగే జూన్ 30 లోపు పర్సెంటేజ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చిరంజీవి గారు హామీ ఇచ్చారు’ అని చెప్పారు.

Peddi : గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో థియేటర్స్ సమస్య పర్సెంటేజ్ విధానం – రెంటల్ విధానం అంటూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎగ్జిబిటర్లు తమకు పర్సెంటేజ్ విధానమే కావాలి అంటే నిర్మాతలేమో రెంటల్ విధానంలోనే రిలీజ్ చేస్తామని అంటున్నారు. రాబోయే పెద్ది సినిమాకు కూడా పర్సెంటేజ్ విధానంలో అయితేనే రిలీజ్ చేస్తామని ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేయడంతో ఇది పెద్ద సమస్యగా మారింది. నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ కూడా ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చిరంజీవి రంగంలోకి దిగారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ఎగ్జిబిటర్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తాజాగా నేడు మరోసారి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు ఎగ్జిబిటర్స్. ఈ మీటింగ్ అనంతరం పెద్ది రిలీజ్ సమస్యకు ఓ పరిష్కారం వచ్చినట్టు తెలుస్తుంది. Also Read : Chiranjeevi : ‘పెద్ది’ ఇష్యూ.. మరోసారి మెగాస్టార్ తో ఎగ్జిబిటర్స్ భేటీ.. మీటింగ్ సారాంశం ప్రకారం.. ప్రస్తుతానికి సినీ పరిశ్రమలో పర్సంటేజీల వివాదం సద్దుమణిగింది. చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ నిర్ణయం వాయిదా పడింది. పెద్ది సినిమాను రెంటల్ విధానంలోనే ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఒప్పుకున్నట్టు సమాచారం. జూన్ 30 తర్వాత మాత్రం అప్పుడు విడుదలయ్యే సినిమాలకు కచ్చితంగా పర్సంటేజీ విధానం వర్తింపచేయాలని అడిగినట్టు తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఫిల్మ్ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు కూడా నడుచుకోవాలని సూచించారు. దీంతో ప్రస్తుతానికి తెలంగాణలో పెద్ది రిలీజ్ కి ఎలాంటి సమస్య లేదని తెలుస్తుంది. పెద్ది రిలీజ్ రెంటల్ విధానంలోనే రిలీజ్ అవుతుందని సమాచారం. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ థియేటర్స్ సమస్య చిరు జోక్యంతో పరిష్కారమైందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన

లక్కీ మస్కట్ అనే పేరు రావడం అంత తేలిక కాదు. ట్వంటీస్లో కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లు ఈ పేరు తెచ్చుకోవడం ఈజీయే కావచ్చు. కానీ, ఇరవై ఏళ్లుగా హీరోయిన్గా కొనసాగుతున్న బ్యూటీ ఈ పేరు తెచ్చుకోవడం మాత్రం మామూలు విషయం కాదు. అందుకే త్రిష ఈ సక్సెస్ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ సక్సెస మూడ్లో ఉన్న త్రిష, ఇప్పుడు షేర్ చేసిన విషయమేంటి? సిల్వర్స్క్రీన్ కుందవై త్రిష సినిమాలకు గుడ్ బై చెబుతారేమోనని చాలా మంది ఎదురుచూశారు. కానీ, నో ఛాన్స్ అంటున్నారు చెన్నై సుందరి. దానికి తగ్గట్టు ఆమె సినీ కెరీర్ కూడా ఫుల్ స్పీడందుకుంది. రిపీట్ కాంబినేషన్లతో త్రిష దూసుకుపోతున్న తీరుకు ఫిదా అవుతున్నాయి ట్రేడ్ వర్గాలు. రీసెంట్గా సూర్య హీరోగా నటించిన సినిమా కరుప్పు. ఇందులో త్రిష నాయిక. ఇప్పుడు ఈ మూవీ 300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఆల్రెడీ ఈ జోడీకున్న క్రేజ్ కూడా సినిమాలో ప్లస్ అయింది. ఈ మూవీలో లాయర్ ప్రీతీ కేరక్టర్లో మెప్పించారు త్రిష. సూర్యకే కాదు, అజిత్కి కూడా లక్కీ మస్కట్గా మారారు త్రిష. అజిత్ – త్రిష కలిసి నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బంపర్ హిట్ అయింది. 248 కోట్లకు పైగా వసూళ్లతో అజిత్ కెరీర్లో ది బెస్ట్ హిట్గా ప్రూవ్ చేసుకుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో త్రిష రోల్కి మంచి అప్లాజ్ వచ్చింది. అజిత్కి మాత్రమే కాదు,విజయ్తో కూడా ది బెస్ట్ హిట్స్ ఉన్నాయి త్రిష కెరీర్లో. లియోలో విజయ్తో జోడీ కట్టారు త్రిష. 600 కోట్లకు పైగా వసూలు సాధించి ఇప్పటిదాకా విజయ్ కెరీర్లో ది బెస్ట్ కలెక్షన్లు సాధించిన లిస్టులో టాప్

ఈ ఏడాది ఆరంభంలోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే జోష్లో తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ దర్శకత్వంలో పట్టాలెక్కించేశారు. రీసెంట్గా గ్రాండ్గా లాంచ్ అయిన ఈ సినిమా మరుసటి రోజు నుంచే షూటింగ్ మొదలుపెట్టుకుని ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కానీ అప్పుడెప్పుడో మొదలైన మెగాస్టార్ ‘విశ్వంభర’ పరిస్థితేంటి? ఏంటి అంటే క్లారిటీ లేకుండాపోయింది. చెప్పాలంటే మెగా అభిమానులు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని దాదాపుగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కారణంగా గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ ఊసే వినిపించడం లేదు. ఆ మధ్యన సమ్మర్లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా వెళ్లిపోతోంది అయినా కూడా ఇంతవరకు విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం. కనీసం సినిమా రిలీజ్ ఎప్పుడు? టీజర్ లేదా సాంగ్స్ అప్డేట్స్ ఎప్పుడు? అనే కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనివల్ల ఈ సినిమా బజ్ క్రమంగా తగ్గిపోతోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా కేవలం VFX పనుల వల్ల ఆలస్యమవుతోందా? లేక మరేదైనా కారణమా అనేది? హాట్ టాపిక్గా మారింది. మరి ‘విశ్వంభర’ పరిస్థితేంటో మేకర్స్కే తెలియాలి.

వైవిధ్యభరితమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వనటుడు కమల్ హాసన్. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కమల్ హాసన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ సమకాలీన నటులైనప్పటికీ, ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్, ఆయన వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నాయి. 'విక్రమ్' సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మాట్లాడుతూ, చిరంజీవి కేవలం టాలీవుడ్కే పరిమితం కాలేదని, ఆయన అనుకుని ఉంటే కోలీవుడ్ (తమిళ పరిశ్రమ) లో కూడా సులభంగా ఒక పెద్ద స్టార్గా ఎదిగేవారని పేర్కొన్నారు."తమిళ ప్రేక్షకులు ఆయనను వద్దనుకోలేదు, కానీ చిరంజీవి ఇక్కడ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. బహుశా ఆయన తన సొంత పరిశ్రమలోనే 'రాజు' (King) గా ఉండాలని భావించి ఉండవచ్చు" అని కమల్ హాసన్ అన్నారు. చిరంజీవికి ఉన్న టాలెంట్ , మాస్ ఫాలోయింగ్కు ఆయన ఏ ఇండస్ట్రీకి వెళ్లినా అగ్రస్థానంలో నిలిచేవారని చెప్పుకొచ్చారు. సినిమా రంగానికి భాషా సరిహద్దులు లేవని నిరూపించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని కమల్ హాసన్ అభినందించారు. ఇతర పరిశ్రమల హీరోలను, సాంకేతిక నిపుణులను ఆదరించడంలో చిరంజీవి చూపించే చొరవను ఆయన గుర్తుచేసుకున్నారు. ఒకరి విజయాన్ని చూసి మరొకరు అసూయపడకుండా, పరిశ్రమ ఎదుగుదలకు తోడ్పడటం తాము సీనియర్ నటుల నుంచి నేర్చుకున్నామని కమల్ చెప్పారు. ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, స్నేహపూర్వక వాతావరణం నేటితరం హీరోలకు ఎంతో ఆదర్శదాయకమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాదాపు 35-40

అందాల భామ నివేతా పేతురాజ్ (Nivetha Peturaj) నక్కతోక తొక్కిందా అంటే నిజమే అని అంటున్నారు నెటిజన్స్. తెలుగులో అంతంత మాత్రంగానే విజయాలను సొంతం చేసుకున్న నివేతా ఈ మధ్య పెద్ద పెద్ద ఛాన్స్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది. అందాల భామ నివేతా పేతురాజ్ (Nivetha Peturaj) నక్కతోక తొక్కిందా అంటే నిజమే అని అంటున్నారు నెటిజన్స్. తెలుగులో అంతంత మాత్రంగానే విజయాలను సొంతం చేసుకున్న నివేతా ఈ మధ్య పెద్ద పెద్ద ఛాన్స్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబోలో వస్తోన్న ఆదర్శ కుటుంబం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నివేతా నటిస్తోందని వార్తలు వచ్చాయి. అంటే గురూజీ అల వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్ గా చేసింది కాబట్టి.. మళ్ళీ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడని అనుకున్నారు. ఇక ఇప్పుడు నివేతా ఏకంగా మెగా ఛాన్స్ నే పట్టేసిందని టాక్. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్నచిత్రం మెగా 158. వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం, పైగా ఈసారి పక్కా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో చిరు భార్యగా ప్రియమణి, కుర్ర హీరోయిన్ అనస్వర రాజన్.. కూతురిగా నటించబోతుంది. ఇక ఈ భారీ యాక్షన్ డ్రామాలో కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పాత్ర కోసం దర్శకుడు బాబీ, నివేతా పేతురాజ్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆమె పాత్ర చాలా విభిన్నంగా,

డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, “నువ్వేకావాలి”, “ప్రేమించు” వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “నేనెవరు?” మే 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తన అనుభవంతో కూడిన ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండగా, కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్నను ప్రతిబింబించేలా “నేనెవరు?” అనే టైటిల్కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథనాన్ని సిద్ధం చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని తెలిపారు. టెక్నికల్గా కూడా సినిమా మంచి స్థాయిలో రూపొందిందని, సంగీతం, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రత్యేక బలంగా నిలుస్తాయని చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రివ్యూ షోల అనంతరం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం విడుదల రోజున మంచి స్పందన అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన నటి మాధవి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సినిమాల్లో నటించి మెప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు తాలూకా, వేలుపుచెర్ల గ్రామంలో గోవిందస్వామి, శశిరేఖ దంపతులకు 1962లో కనకవిజయలక్ష్మిగా జన్మించారు మాధవి, ఆతర్వాత కుటుంబంతో కలిసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. మాధవికి చిన్నతనం నుంచే కళలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఆమె భరతనాట్యం నేర్చుకుంటూనే, హార్స్ రైడింగ్ అభ్యసించి, కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. సినిమాల్లోకి రావాలనే ఉద్దేశ్యం ఆమెకు మొదట్లో లేదట.. అయితే రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శన ఇస్తుండగా, దర్శకుడు దాసరి నారాయణరావు ఆమెను గుర్తించి సినిమాల్లోకి ఆహ్వానించారు. తొలుత తన తల్లిదండ్రులను సంప్రదించి, ఒకే సినిమా తర్వాత నటించననే షరతుతో “తూర్పు పడమర” చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారట. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు ఆమె అసలు పేరు కనకవిజయలక్ష్మిని “మాధవి”గా మార్చారు. “తూర్పు పడమర” తమిళ్ లో రీమేక్ అయిన తర్వాత, దర్శకుడు కె. బాలచందర్ ఆమెను తన “మరో చరిత్ర” చిత్రంలో కమలహాసన్ సరసన ఎంపిక చేశారట. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బాలచందర్ తీసిన “త్రిల్లు ముల్లు” (రజనీకాంత్తో) చిత్రంలోనూ నటించారు. పెద్దలు, దర్శకుల ప్రోత్సాహంతో, కళాకారిణిగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మాధవి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. మాధవి నటిగా తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. కన్నడలో రాజ్ కుమార్ తో ఏడు చిత్రాల్లో, విష్ణువర్ధన్, అనంతనాగ్ వంటి నటులతోనూ నటించారు. మలయాళంలో మోహన్లాల్, మమ్ముట్టి వంటి అగ్రతారలతో కలిసి పనిచేశారు. తెలుగులో చిరంజీవి నటించిన “ఖైదీ” చిత్రంలో ఆమె “రగులుతోంది మొగలిపొద” పాటతో ఎనలేని గుర్తింపు పొందారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్. సినిమాలతోనే కాదు చిరంజీవి తన జీవితానుభవాలను, స్ఫూర్తిదాయకమైన సందేశాలను తరచుగా పంచుకుంటూ ఉంటారు. ఈసారి ఆయన కప్ప కథ చెప్పారు. దాని ద్వారా నెగిటివిటీని ఎలా అధిగమించాలో వివరించారు మెగాస్టార్. ఒక తాడు సాయంతో ఓ బావిలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న కొన్ని కప్పల కథను ఆయన చెప్పారు. ” బావిలోని కప్పలు తాడు ఎక్కుతుండగా, కింద ఉన్న మిగిలిన కప్పలు “ఇది అసాధ్యం, మీరు ఎక్కలేరు, మీరు కింద పడిపోతారు” అని నిరుత్సాహపరిచే మాటలు పదేపదే చెబుతూ ఉన్నాయట. ఈ ప్రతికూల మాటలు విన్న చాలా కప్పలు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి, మరికొన్ని ఆత్మవిశ్వాసం కోల్పోయి మధ్యలోనే కింద పడిపోయాయి. అయితే, ఒక కప్ప మాత్రం అన్ని అడ్డంకులను దాటుకుని తాడు పైదాకా విజయవంతంగా చేరుకొని ఆ బావి నుంచి బయట పడిందట.. మిగిలిన కప్పలు దానిని అభినందించినప్పుడు, ఆ కప్ప చెవిటిదని తెలిసిందట. అది కిందనున్న నెగిటివ్ మాటలను వినలేకపోయింది, అందువల్ల తన లక్ష్యంపై మాత్రమే దృష్టి సారించగలిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ కథను వివరించిన తర్వాత, చిరంజీవి ఈ నీతిని తన వ్యక్తిగత అనుభవాలకు అన్వయించారు. సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు లేదా ఏదైనా రంగంలో విజయం సాధించాలనుకున్నప్పుడు, మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తులకు “చెవిటివారై” ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుతున్న రోజుల్లో.. తన కెరీర్ ప్రారంభ దశలో, ఆయన చెన్నైలోని పాండి బజార్ వైపు వెళ్లేవారు కాదట. పాండి బజార్లో

ఒకప్పుడు తన అద్భుత నటన, క్లాసికల్ డాన్స్తో భారతీయ వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి (Meenakshi Seshadri) మళ్లీ కెమెరా ముందుకు రావాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు, భారతదేశానికి దూరమైన ఆమె.. దాదాపు మూడు దశాబ్దాల (30 ఏళ్లు) సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తన ‘కర్మభూమి’ అయిన ముంబైకి చేరుకున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సరసన కె. విశ్వనాథ్ క్లాసిక్ ఫిల్మ్ ‘ఆపద్బాంధవుడు’ (Aapadbandhavudu) లో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మీనాక్షి శేషాద్రి. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిన ఆమె, తాజాగా మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్లో తన కుమారుడి హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొంటున్న మీనాక్షి.. అక్కడ నుంచే ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ తన రీ-ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు. ‘నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. మీ ప్రేమ, నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నేను మళ్లీ నా కర్మభూమి అయిన ముంబైకి తిరిగి వచ్చాను. ఎంతో నమ్మకం, ఉత్సాహం, పాజిటివిటీతో ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోకి మళ్లీ అడుగుపెడుతున్నాను. నాకు కేవలం ప్రధాన పాత్రలే (Lead Roles) చేయాలని లేదు. అది లీడ్ రోల్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా లేదా చిన్న వెబ్ సిరీస్ అయినా నాకు ఓకే. కానీ ఆ పాత్ర కథలో ప్రాధాన్యత ఉన్నదై ఉండాలని, ఒక నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేలా ఉండాలి. నాకు ఎంతో ఇష్టమైన యాక్టింగ్ కెరీర్ను మళ్లీ కొనసాగించడానికే నా ఫ్యామిలీ సపోర్ట్తో ఇక్కడికి

టాలీవుడ్లో హై-వోల్టేజ్ ‘బాక్సాఫీస్ వార్’ నడుస్తోందిప్పుడు…! థియేటర్లు నడపలేక మునిగిపోతున్నాం, మాకూ కలెక్షన్స్లో పర్సంటేజ్ కావాల్సిందేనని పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు ఒకవైపు..! బ్లాక్మెయిల్ రూల్స్ పెడితే ఒప్పుకోం, అసలు స...

Megastar Chiranjeevi has stepped in to help resolve the long-pending dispute over the percentage-based revenue-sharing model for single-screen theatres. A delegation comprising Telangana FDC Chairman… Megastar Chiranjee...

Home » Tollywood » chiranjeevi meeting on tollywood percentage issue exhibitors rcb ABN , Publish Date - May 25 , 2026 | 06:44 PM టాలీవుడ్లో నెలకొన్న ‘పర్సెంటేజ్’ వివాదానికి తెరదించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి...

Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ (శివన్న) ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగ...

Home » Telangana » Hyderabad » Megastar Chiranjeevi Steps In as Tollywood Producers and Exhibitors Clash Over Percentage System for Single Screen Theatres VVNP ABN , Publish Date - May 25 , 2026 | 04:57 PM టాలీవుడ్లో...

Trisha Sentiment for Chiranjeevi Vishwambhara movie Trisha Krishnan: సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘చెన్నై చిన్నది’ త్రిష క్రేజ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సీనియర్ స్టార్ హీరోల పక్కన నటిస్తూ, వారందరికీ బ్యాక్...

నటి రంభ ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సమకాలీన హీరోయిన్లలో ఎవరిని పోటీగా భావించేవారని అడిగినప్పుడు, మీనా, రోజాలతో తక్కువ కాంబినేషన్లు...

సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ, క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా మార్మోగిపోతోంది. రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతున్న త్రిష.. తాజాగా కోలీవుడ్ (Tami...

- Home » Tollywood » Megastar chitranjeevi Digital entry with podcast avm ABN , Publish Date - May 24 , 2026 | 04:28 PM టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డిజిటిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? - అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. - టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) డిజిటిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

1. **Ram Charan surpasses his father Megastar Chiranjeevi in Hindi cinema** 2. **Chiranjeevi remains one of the greatest stars Indian cinema has ever seen** 3. **Despite fluency issues, Ram Charan develops remarkable confidence in Hindi**

- దశాబ్దాలుగా వెండితెరపై కోట్లాది మంది అభిమానులను తన నటనతో, డాన్సులతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. - తొలిసారిగా ఆయన డిజిటల్ ప్రపంచంలోకి (OTT) అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. - ఒక ప్రతిష్టాత్మక పోడ్కాస్ట్ (Podcast) టాక్ షో ద్వారా ఆయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.



