
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hydraa ranganath reacts on gachibowli 7 stairs incident: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలీపోయిన ఘటనల తీవ్ర విషాదంగా మారింది. మాదాపూర్ సర్కిల్ లోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీని శిథిలాల కింద ఇద్దరు కార్మికులు చిక్కుకుని చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బిల్డింగ్ కుప్పకూలీనప్పుడు అది కాస్త పక్కన ఉన్న మరో బిల్డింగ్ మీద పడటంతో అది కూడా డ్యామేజ్అయ్యింది. పెద్ద శబ్దంతో బిల్డింగ్ కూలడంతో చుట్టుపక్కల వారు ఇళ్ల నుంచి భయంతో బైటకు పరుగులు పెట్టారు. వెంటనే హైడ్రా, డీఆర్ఎఫ్,మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన మోపత్, ఉమేష్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేవలం 50 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సాజిద్ అనే బిల్డర్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా అక్కడ అనేక ప్రాంతంలో ఈవిధమైన నిర్మాణాలు ఉన్నాయనిస్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగనాథ్ దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాకుండా.. అంజయ్యనగర్లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై ఎవరినీ ఉపేక్షించబోమన్నారు. ఘటనాస్థలి పక్కన భవనాల వారు ఖాళీ చేసి ఇతర చోట్లకు వెళ్లాలని రంగనాథ్ ఆదేశించారు. బిల్డింగ్ యజమాని ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ బిల్డింగ్ నిర్మాణంపై సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్కి కొంతమంది ఫిర్యాదు చేశారని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం నోటీసులు జారీ