
హైదరాబాద్: శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో హైకోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ అప్పీల్కు వెళ్లారు. రంగనాథ్ను తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేశారు. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఎ.వి.రంగనాథ్ను తప్పించి.. ఆ స్థానంలో మరొకరిని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించడంతో పాటు, పదేపదే ఉల్లంఘించే అధికారి చట్టబద్ధపాలన (రూల్ ఆఫ్ లా)ను ప్రమాదంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని, అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగరాదని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన శిక్షలకు సిఫార్సు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నం.1, 2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ జూకంటి అనిల్కుమార్ విచారణ చేపట్టి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఐదేళ్లలో 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండగా ఏడాదిన్నరలో 63 కేసులు ఈ ఒక్క అధికారిపై ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ ఐజీ ర్యాంకులో.. కార్యదర్శి స్థాయిలో ఉంటూ ప్రభుత్వ ఆస్తులను, అదీ జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తులను రక్షించడం హైడ్రా కమిషనర్ ప్రధాన విధి. ఈ విషయం హైడ్రాను ఏర్పాటుచేస్తూ జారీ అయిన జీవో 99లో స్పష్టంగా ఉంది. అలాంటి అధికారిపై ఏడాదిన్నరలో 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్లో ఉండడం అసాధారణం’’ అని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల