హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్ను తొలగించి.. సమర్థుడైన అధికారిని నియమించాలంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన కేసులో విచారణ సందర్భంగా.. ఏవీ రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని.. మరో అధికారిని నియమించాలంటూ ఉత్తర్వులను.. ఆయన డివిజన్ బెంచ్ ముందు తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో తదుపరి విచారణ పూర్తయ్యే వరకు రంగనాథ్ హైడ్రా కమిషనర్గా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ అప్పీల్ దాఖలు చేశారు. ఆయన తరఫున హిమాచల్ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ భూమిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా సింగిల్ బెంచ్ రంగనాథ్ వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కీలక ఆదేశాలు జారీచేసింది.కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించే అధికారి చట్టబద్ధ పాలనకు ఇబ్బందులు కలిగించేఅవకాశం ఉందని సింగిల్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏవీ రంగనాథ్ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. ఆ కేసు విచారణ సందర్భంగా రంగనాథ్పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల సంఖ్యపైనా సింగిల్ బెంచ్ ప్రస్తావించింది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వేలాది కోర్టు ధిక్కరణ