
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇటీవల చక్కెర ధరలు పెరగడంపై కేంద్రం స్పందించింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే వీటి ధరలు పెరిగాయనడం సరికాదని పేర్కొంది. స్థానికంగా దిగుబడి తగ్గడం, పండగల వేళ డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణాలని స్పష్టం చేసింది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టామని.. నిల్వలపై పరిమితులు విధించడంతోపాటు దిగుమతులపైనా సుంకాలు తగ్గించామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్లో మారుమూల ప్రాంతాలకూ స్టార్లింక్: ఎలాన్ మస్క్ దేశంలో జులై 20న కిలో చక్కెర ధర రూ.48.18గా ఉండగా.. ఆగస్టు 20నాటికి అది రూ.55.70కు పెరిగింది. దీంతో ఇథనాల్ తయారీకి కోసం చక్కెర మళ్లించడం వల్లే ఈ ధరలు పెరిగాయని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పెట్రోల్లో కలిపే ఇథనాల్ తయారీ కోసం మళ్లించే చక్కెర వాటా 2022-23లో 12శాతం ఉండగా.. 2025-26లో 9శాతానికి తగ్గిందని కేంద్రం తెలిపింది. అంచనాల కంటే తక్కువ దిగుబడి రావడం, పండగల వేళ డిమాండ్, పంట నష్టం, అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం, ఊహాగానాలతో కొంతమంది నిల్వలు పెంచడం, తదితర కారణాల వల్ల ధరలు పెరిగాయని స్పష్టం చేసింది. దేశంలో దాదాపు మూడోవంతు ఇథనాల్.. మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచే ఉత్పత్తి అవుతోందని తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు