
దిల్లీ: ఆహార ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే లేబుళ్లు, నిబంధనలకు విరుద్ధమైన క్లెయిమ్లు, ప్రకటనలకు సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీ చేసిన నోటీసులపై డాబర్ ఇండియా, ఫెర్న్స్ ఎన్ పెటల్స్, మరో 4 నాలుగు సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. డాబర్ ఆయుర్వేద ఔషధ తైలాన్ని వంటనూనెగా విక్రయిస్తున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ‘ఆ ఉత్పత్తిని ఆయుర్వేద ఔషధ విభాగంలోకి మార్చమని ఇ-కామర్స్ సంస్థలను ఆదేశించామని, స్వంత వెబ్సైట్లోనూ విభాగాన్ని మారుస్తున్నట్లు’ డాబర్ తెలిపింది. రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్ సహా అన్ని ఉత్పత్తుల లేబుళ్లను సరిదిద్దామని ఫెర్న్స్ ఎన్ పెటల్స్ పేర్కొంది. లొట్టే ఇండియా తమ ఉత్పత్తుల లేబుళ్లపై ఉన్న 100% క్లెయిమ్లను తొలగించింది. ఇతర ఉత్పత్తులతో పోల్చే ప్రకటనలు, వీగన్ క్లెయిమ్లను ఈట్ బెటర్ వెంచర్స్ తొలగించింది. మార్కెటింగ్ మెటీరియల్స్, వెబ్సైట్ కంటెంట్ను ఓం సాయి హెల్త్కేర్ మార్చింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయబోమని హామీ ఇచ్చింది. నోటీసులు అందుకున్నాక, అవసరమైన మార్పులు చేపట్టిన జాబితాలో ఎస్ఎస్ ప్రోడక్ట్ ప్రాప్ కూడా ఉంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు