ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి.దశాబ్దాలుగా సాధారణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు దాదాపు అందనంత ప్రాంతంగా ఉన్న ఈ కొండల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఐదు రోజుల ముందే తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కర్రెగుట్టలపై 650 అడుగుల ఎత్తులో కర్రెగుట్టల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఈ ప్రాంతంలో సుమారు 50 ఏళ్ల తర్వాత తెలంగాణ వైపుతొలిసారి జాతీయ జెండా ఎగరడం విశేషంగా నిలిచింది.దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టలు .. ఒకప్పుడు మావోయిస్టులకు ప్రధాన స్థావరంగా ఉండేది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న ఈ కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు భారీగా మందుపాతరలు అమర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులతో ఈ కొండ ప్రాంతం ఎన్నో ఏళ్ల పాటు ఉద్రిక్తంగా ఉండేది. భద్రతా కారణాలతో ప్రభుత్వ అధికారులు సైతం ఈ ప్రాంతంలోకి వెళ్లడం కష్టంగా ఉండేది.ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తర్వాత పరిస్థితుల్లో గణనీయమైన మార్పువచ్చింది. పలువురు మావోయిస్టులు భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. మరికొందరు లొంగిపోయారు. దీంతో కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు పట్టు సాధించాయి. ఈ పరిణామాలు అక్కడ అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేశాయి.కర్రెగుట్టల దిగువన ఉన్న పామునూరు ప్రాంతం నుంచి కొండపైకి నిర్మిస్తున్న రహదారి పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ రహదారిని సుమారు 20 కిలోమీటర్ల మేర ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా సరిహద్దు వరకు విస్తరించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రయాణం ఇప్పటికీ కష్టతరంగానే ఉంది.డీజీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సీనియర్ పోలీసు అధికారులు, సీఆర్పీఎఫ్, ఇంటెలిజెన్స్, అటవీ శాఖల అధికారులు తొలిసారి రోడ్డు మార్గంలో కర్రెగుట్టలకు చేరుకున్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఉన్నతాధికారులు హెలికాప్టర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు