
కోటపల్లి, సెప్టెంబర్ 16: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఈ భయంకర ఘటన వెలుగుచూసింది. కోటపల్లికి చెందిన మమతకు, మల్లంపేట గ్రామానికి చెందిన మణి చందర్తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ముద్దులొలికే ఆడపిల్లలు ఉన్నారు. ఎనిమిదేళ్ల పాటు సాఫీగానే సాగిన వీరి సంసారంలో కొద్దిరోజుల క్రితం మనస్పర్థలు మొదలయ్యాయి. గొడవలు తీవ్రమవ్వడంతో భర్తతో వేగలేక మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి కోటపల్లిలోని పుట్టింటికి వచ్చేసింది. భార్య పుట్టింటికి వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త మణి చందర్.. ఎలాగైనా ఆమెను కాపురానికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కోటపల్లిలోని అత్తగారింటికి వచ్చాడు.





