
EPFO alert | ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) తమ చందాదారులకు కీలక సూచనలు చేసింది. ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ సేవలు పొందే క్రమంలో నకిలీ వెబ్సైట్ల బారిన పడొద్దని సూచించింది. వినియోగదారుల సున్నిత సమాచారాన్ని తస్కరించేందుకు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ లింక్లను సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్నారని తెలిపింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ వేదికగా పేర్కొంది. వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేసే నకిలీ లింకులు, ఈ-మెయిల్స్ను క్లిక్ చేయొద్దని కోరింది. ఈపీఎఫ్ఓ ఇటీవల సిస్టమ్ అప్గ్రెడేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆన్లైన్ ఈపీఎఫ్ఓ సేవల వినియోగం పెరిగింది. ఇదే అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్న వేళ.. ఈపీఎఫ్ఓ తమ చందాదారులకు ఈ విజ్ఞప్తి చేసింది. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు 6 సూచనలు చేసింది. అధికారిక వెబ్సైట్ లింకులనూ పంచుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.