
Jangaon: బడుల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి కలెక్టర్ జనగామ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రవేశాలు పెరిగిన పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పాఠశాలల తనిఖీలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉండేలా వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను గుర్తించి, అవసరమైన మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏ పాఠశాల కూడా సింగిల్ టీచర్ పాఠశాలగా ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో బోధన అందించాలని, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు. “ఫోకస్తో పనిచేస్తే విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ప్రతి చర్య చివరికి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి” అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, బోధనా ప్రక్రియ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తదితర అంశాలను పరిశీలించాలని సూచించారు. "మిషన్ శిఖరం" కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పాఠశాల