
విద్యార్థుల ఫీజులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో ఉంచుతున్నామని తెలిపారు. ఒలింపిక్స్ పతకం తెస్తే ప్రభుత్వ ఉద్యోగమిస్తాం రాష్ట్రంలో కులగణన చేసి కేంద్రానికి సవాలు విసిరాం విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు పనిచేస్తా మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణలో సీఎం రేవంత్ హైదరాబాద్ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో ఉంచుతున్నామని తెలిపారు. కాలేజీలో అడ్మిషన్ పొందిన వెంటనే ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని, నెల రోజుల్లోవిద్యార్థి ఖాతాలో ఫీజు జమ చేస్తామని ప్రకటించారు. ‘‘ఫీజు రీయింబర్స్మెంట్ను అడగకుండానే మీ ఖాతాలో వేస్తాం. ఇందుకోసం ప్రతి సంవత్సరం రూ.2400 కోట్లను అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో పెట్టి.. విద్యార్థుల ఖాతాల్లోకి బదిలీ చేస్తాం. ఈ విద్యా సంవత్సరానికి రూ.250 కోట్లు అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో పెట్టాం. మీరు చింతించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఏ కాలేజీ కూడా మీరు ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వబోమనే అవకాశం ఇవ్వం’’ అని సీఎం రేవంత్రెడ్డి విద్యార్థులనుద్దేశించి చెప్పారు. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తీరాన ఉన్న నెక్లెస్ రోడ్డుకు, హెచ్ఎండీఏ గ్రౌండ్కు ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం హెచ్ఎండీఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో ఓవైపు అంబేడ్కర్, మరోవైపు జ్యోతిబా పూలే, చౌరస్తాలో ఇందిరాగాంధీ, ఆ పక్కన పీవీ నర్సింహారావు విగ్రహాలను పెట్టింది వారి వర్థంతులు, జయంతులు జరుపుకోవడానికి మాత్రమే కాదన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఈ గొప్ప వ్యక్తుల విగ్రహాలను చూసి.. వారు చేసిన త్యాగాలను, వారి స్ఫూర్తిని పొందాలని, ఆ స్ఫూర్తితో విద్యలో