
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్లాన్ చేసిన హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘అబు – థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కోలీవుడ్ ప్రముఖ దర్శకులు పుష్కర్ మరియు గాయత్రి ఒక ఇంటర్వ్యూలో ఈ భారీ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. 1999 సమయంలోనే చిరంజీవి గ్లోబల్ స్థాయిలో తన ముద్ర వేసేందుకు ఈ ఇంగ్లీష్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు. అప్పట్లోనే దాదాపు 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ను రూపకల్పన చేశారు. భారత్తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో షూటింగ్ జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భారతీయ దర్శకుడు సురేష్ కృష్ణతో పాటు ఒక అమెరికన్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకు కలసి పనిచేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్లో పుష్కర్ కెమెరా విభాగంలో, గాయత్రి దర్శకత్వ విభాగంలో సాంకేతిక నిపుణులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి విదేశీ నటీనటులను ఎంపిక చేయడంతో పాటు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ను సంగీత దర్శకుడిగా నిర్ణయించారు. దీనికి సంబంధించి కొంత భాగం చిత్రీకరణ కూడా వేగంగా పూర్తి చేశారు. అయితే షూటింగ్ సమయంలో ఖురాన్ పేజీలకు సంబంధించిన వివాదాలు, మతపరమైన సున్నితమైన అంశాలు హఠాత్తుగా తెరపైకి వచ్చాయి. దీంతో అనూహ్య రీతిలో నిరసనలు వ్యక్తమై కోర్టు వివాదాలు చుట్టుముట్టడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ సినిమా పూర్తయి విడుదలై ఉంటే చిరంజీవి రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో వేరేలా ఉండేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఆ రోజుల్లోనే పాన్-వరల్డ్ స్టార్గా ఆయన నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన చిరంజీవి, హాలీవుడ్లో కూడా తన జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఈ ఘటన నిరూపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయినప్పటికీ, ఆ