
దశాబ్దాల నాటి వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు మూడో విడత పునరావాస, పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద రూ.250 కోట్ల చెక్కును నిర్వాసిత కుటుంబాలకు అందించారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చారిత్రక ప్రకటన చేశారు. దీంతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 30 ఏళ్ల కల సాకారం కానుంది.ఇప్పటికే రెండు విడతల్లో పరిహారం అందించిన ప్రభుత్వం, తాజాగా మూడో విడతలో 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు పంపిణీ చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల మేర పరిహారం అందినట్లయింది. ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు 85 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అసాధ్యమనుకున్న ప్రాజెక్టును సుసాధ్యం చేసి చూపిస్తున్నామన్నారు. "1996లో నేను శిలాఫలకం వేసిన ఈ ప్రాజెక్టును 2026లో ప్రారంభించుకోవడం నా అదృష్టం. గత రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేశాం. ఎన్టీఆర్ ప్రారంభించిన అనేక ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం నాకు దక్కింది" అని ఆయన గుర్తు చేసుకున్నారు.ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో 50 శాతం లోటు వర్షపాతం ఉందని, శ్రీశైలం