
రంభ ఊర్వశి మేనక (Rambha Urvashi Menaka)
<figure><img src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/Bullet-train-corridor-finalized-via-Hyderabad-Chennai-Amaravati-and-Dachepalli-stations-1024x576.jpg" class="attachment-large size-large wp-post-image" alt="Bullet train corridor finalized via Hyderabad-Chennai, Amaravati, and Dachepalli stations." decoding="async" fetchpriority="high" /></figure><ul> <li><strong>అమరావతి మీదుగా బుల్లెట్ రైలు</strong></li> <li><strong>దాచేపల్లిలో తొలి రైల్వే స్టేషన్</strong></li> <li><strong>ఆకాశ మార్గంలో ఎలివేటెడ్ నిర్మాణం</strong></li> </ul> <p>Bullet Train Corridor: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రం మీదుగా వెళ్లే మూడు ప్రధాన హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లకు సంబంధించి కీలక ప్రతిపాదనలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ – చెన్నై బుల్లెట్ రైలు(Bullet Train Corridor) ప్రాజెక్టు ఏపీ రాజధాని అమరావతి మీదుగా పయనించేలా రూట్ మ్యాప్ను అధికారులు అధికారికంగా సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో అత్యధిక భాగం ఏపీ పరిధిలోనే నిర్మాణం కానుండటం విశేషం.</p> <p><strong><a href="https://10tv.in/telugu-news/national/the-khade-hanuman-idol-in-ujjain-that-has-become-a-sensation-sn-1134729.html" target="_blank" rel="noopener">Khade Hanuman: 170 ఏళ్ల హనుమాన్ ఆలయం.. రోడ్డు కోసం తొలగిద్దామంటే.. మూలవిరాట్టుని అంగుళం కూడా కదల్చలేకపోయారు!</a></strong></p> <h2><span style="color: #ff0000;">తొలి స్టేషన్ దాచేపల్లిలోనే.. భూసేకరణపై ఏపీ సర్కార్ వేగం:</span></h2> <p>హైదరాబాద్ నుంచి ఏపీలోకి ప్రవేశించగానే తొలి బుల్లెట్ రైలు స్టేషన్ను పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జాతీయ హైస్పీడ్ రైలు సంస్థ (NHSRCL) లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. రెవెన్యూ రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేసి త్వరలోనే రైల్వే శాఖకు స్థలాలను అప్పగించేలా మ్యాపింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.</p> <h3><span style="color: #ff0000;">ఎలివేటెడ్ విధానంలో నిర్మాణం.. గంటలోనే అమరావతి టూ చెన్నై:</span></h3> <p>ఈ ప్రాజెక్టును పూర్తిగా పిల్లర్లపై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ విధానంలో చేపట్టనున్నారు. దీనివల్ల ఎలాంటి రోడ్డు ట్రాఫిక్ అంతరాయం లేకుండా రైళ్లు గరిష్ట వేగంతో ప్రయాణించే వీలుంటుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అమరావతి నుంచి చెన్నైకి కేవలం గంట వ్యవధిలోనే చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే డీపీఆర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభం కానున్నాయి.</p> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా వెళ్లే మూడు ప్రధాన హైస్పీడ్ బుల్లెట్ రైలు(Bullet Train Corridor) కారిడార్లకు సంబంధించి కీలక ప్రతిపాదనలు ఖరారయ్యాయి.