
అమరావతి: భాజపా జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా సత్యకుమార్ను నియమించింది. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 17 వరకు భాజపా, ఎన్డీయే ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమాలకు సత్యకుమార్ దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది
.