
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్లో రూపొందుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఐమ్యాక్స్ స్క్రీన్స్ దక్కే అవకాశం ఉంది. 'ట్రూ ఐమాక్స్ షూటింగ్' జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా రాజమౌళి 'వారణాసి' నిలచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అనేక ఐమ్యాక్స్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఐ మ్యాక్స్ ఫార్మాట్ తో 'వారణాసి' ఓ ఛాలెంజ్ ఎదుర్కొంటోంది. అదేంటో చూద్దాం? మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో డాక్టర్ కె.యల్.నారాయణ, కార్తికేయ నిర్మిస్తోన్న వారణాసి (Varanasi) ట్రూ ఐమ్యాక్స్ (True IMAX) షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీని దాదాపు 120 భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమాను 'ట్రూ ఐ మ్యాక్స్ షూటింగ్ 'లో తెరకెక్కించారు. ఈ విధానంలో రూపొందిన తొలి భారతీయ చిత్రంగా 'వారణాసి' నిలచింది. అందువల్ల 'వారణాసి' సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచంలోని ప్రముఖభాషల్లో అందులోనూ ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్ లో రిలీజ్ చేయాలని భావించారు. 'ఆ సమయంలో ఏ లాంటి భారీ చిత్రాలు హాలీవుడ్ నుండి రావడం లేదని తెలుస్తోంది. అందువల్లే రాజమౌళి తన 'వారణాసి'కి కంఫోర్టబుల్ టైమ్ ను సెట్ చేసుకున్నారని సినీ పండిట్స్ భావిస్తున్నారు. గతంలోనూ 'ట్రిపుల్ ఆర్, జవాన్, కల్కి 2898 ఏడి" వంటి చిత్రాలు ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో ప్రదర్శితమయినాయి. వీటికంటే ముందు 'ఐ మ్యాక్స్ ఫార్మాట్'లో సందడి చేసిన తొలి భారతీయచిత్రంగా 'ధూమ్-3' నిలచింది. కానీ, ఇవన్నీ ఐమ్యాక్స్ థియేటర్స్ లో ప్రదర్శన కోసం డిజిటిల్ గా రీమాస్టరింగ్ చేసిన సినిమాలే కావడం గమనార్హం. అలా కాకుండా ఒరిజినల్ ఐమ్యాక్స్ కెమెరాతోనే షూటింగ్ జరుపుకొన్న ప్రప్రథమ భారతీయ చిత్రంగా 'వారణాసి' చరిత్ర సృష్టించింది. ఈ మూవీ ట్రూ 1.43 ఈజ్