
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధించిందని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి (Medical Student Priyanka Death) పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధించిందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు కారును నిర్లక్ష్యంగా నడిపి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక మృతి తనను కలచివేసిందని తెలిపారు. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎంతోమందికి సేవలు అందించాల్సిన ఆమె ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం బాధాకరమని అన్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కలచివేస్తోంది: హోం మంత్రి అనిత వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి కలచివేస్తోందని అన్నారు. ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి, జైలుకు పంపించామని వెల్లడించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుంది: మంత్రి నిమ్మల వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపట్ల ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి కలచివేస్తోందని తెలిపారు. ప్రియాంక మృతికి కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే