
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారు జామన రోడ్డు ప్రమాదం జరిగింది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు బ్రిడ్జిపై నుంచి పడిపోయాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.