అకాలీ దళ్ అధినేత, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలోని నాందేడ్లో గురువారం దాడి జరిగింది. గురుద్వారాలో ఆయనపై నిహంగ్ సిక్కు కిర్పాన్తో దాడిచేసినట్టు వర్గాలు తెలిపాయి. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు.. బాదల్ను చికిత్స కోసం నాందేడ్లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సుఖ్బీర్ సింగ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. నాందేడ్లోని తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాకు తన కుటుంబంతో కలిసి వచ్చిన బాదల్.. ప్రార్థనలు ముగించుకుని మెట్లు దిగుతుండగా ఈ దాడి జరిగింది. దాడి సమయంలో బాదల్ భార్య, అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ ఆయనతోనే ఉన్నారు.దాడి చేసిన వ్యక్తిని నిహంగ్ సిక్కు అయిన జస్పాల్ సింగ్గా గుర్తించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి గత రెండేళ్లుగా ఆ గురుద్వారాలో పనిచేస్తున్నాడు. దాడి అనంతరం బయటకు వచ్చిన వీడియోలో, బాదల్ తన కుడి చేతికి కాషాయ వస్త్రాన్ని చుట్టుకుని నడుస్తూ కనిపించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి సుఖ్బీర్ బాదల్ను కడుపులో కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు.. కానీ భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకోవడంతో చేతికి గాయమైంది. బాదల్కు ప్రాణాపాయం లేదని అకాలీ దళ్ వర్గాలు తెలిపాయి. నాందేడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, బాదల్ చేతికి కుట్లు పడ్డాయని తెలిపారు.దాడి జరిగిన కొద్దిసేపటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. నాందేడ్ ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి వెనుక ఉద్దేశం ఏంటో దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆయన నిర్దేశించారు. ఇదిలా ఉండగా, దాదాపు రెండేళ్ల కిందట అమృత్సర్లో జరిగిన హత్యాయత్నం నుంచి బాదల్ త్రుటిలో తప్పించుకున్నారు. డిసెంబరు 4, 2024లో స్వర్ణదేవాలయం బయట ఆయనపై ఓ యువకుడు కాల్పులకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో బాదల్కు ఎలాంటి గాయాలు కాలేదు. దుండగుడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.2007