
IND vs AFG : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య టీ20 సిరీస్కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారత్, అఫ్గాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. భారతదేశంలో టీమ్ఇండియాకు అఫ్గాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ, అప్గాన్ క్రికెట్ బోర్డులు వెల్లడించాయి. ఈ సిరీస్ గురించి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడుతూ.. 'అఫ్గాన్లో క్రికెట్ అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి, అక్కడి ఆటగాళ్లకు అత్యున్నత స్థాయిలో పోటీపడే అవకాశాలను కల్పించడానికి బీసీసీఐ కట్టుబడి ఉంది. ద్వైపాక్షిక క్రికెట్ ఇందులో ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది జట్లకు నాణ్యమైన ప్రత్యర్థులతో క్రమం తప్పకుండా ఆడి, విలువైన అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డును భారతదేశానికి స్వాగతిస్తున్నాము. దీనిని విజయవంతం చేయడానికి వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము. రెండు క్రికెట్ దేశాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తూనే అఫ్గాన్ క్రికెట్కు మద్దతు ఇవ్వడం కొనసాగిస్తాము.' అని అన్నారు. Hardik Pandya : గిల్కు ఎసరు పెట్టిన హార్దిక్ పాండ్యా.. కెప్టెన్సీ ఇస్తే వస్తా.. గుజరాత్కు ఆఫర్..! షాకిచ్చిన జీటీ! బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ.. 'అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్లో టీమ్ఇండియాకు టీ20 సిరీస్కు ఆతిథ్యం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది. భారత్, అఫ్గాన్ జట్ల మధ్య గత కొన్నేళ్లుగా మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇరు జట్లలోనూ నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. అఫ్గాన్ ఆటగాళ్లలో చాలా మంది భారత దేశంలో అభిమానులు ఉన్నారు. ఇది ఈ రెండు క్రికెట్ దేశాల మధ్య ఏర్పడిన బలమైన బంధానికి నిదర్శనం. 2018లో అఫ్గాన్కు వారి చారిత్రాత్మక తొలి టెస్ట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఈ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి. అప్పటి నుండి, ఇరు జట్ల మధ్య క్రమం తప్పకుండా ద్వైపాక్షిక మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి.' అని చెప్పుకొచ్చారు