
Abhishek Sharma: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి రికార్డులు తిరగరాశాడు. తన అటాకింగ్ గేమ్తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ వరుస అవార్డులను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆఫ్ఘన్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా అత్యంత సులభంగా ఛేదించింది. ఈ విజయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 32 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు బాదాడు. అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 250కి పైగా ఉండటం విశేషం. ఈ అసాధారణ ప్రదర్శనకు గుర్తింపుగా అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.





