నటసింహం నందమూరి బాలకృష్ణ , స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 112’ (వర్కింగ్ టైటిల్) అధికారికంగా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ‘మిర్చి’ నుండి ‘దేవర’ వరకు బలమైన సామాజిక కథాంశాలతో బ్లాక్బస్టర్స్ అందించిన కొరటాల శివ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న బాలయ్యను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.* అనిరుధ్ -కావ్య మారన్ మ్యారేజ్ ఫిక్స్?.. బంధాన్ని కన్ఫార్మ్ చేసిన ‘అఖండ 2’ నటుడు రాయలసీమ నీటి సమస్య... ఫ్లాష్బ్యాక్లో మాఫియా డాన్దర్శకుడు కొరటాల శివ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ భౌగోళిక నేపథ్యం, అక్కడి సామాజిక సమస్యలు అంతర్లీనంగా కనిపిస్తాయి. తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ సినిమా కోసం ఆయన రాయలసీమ బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నారు. గతంలో బాలయ్యకు రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఫ్యాక్షన్ మార్క్ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అయితే ఈసారి కొరటాల పూర్తి భిన్నంగా అక్కడి తీవ్రమైన నీటి సమస్యను, ప్రజల జీవన పరిస్థితులను, సామాజిక కోణాలను స్పృశిస్తూ ఈ కథను సిద్ధం చేసినట్లు టాక్. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్త మేకోవర్లో కనిపించనున్నారు. ముఖ్యంగా సినిమాకు గుండెకాయ లాంటి ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో బాలయ్య పాత్ర మాఫియా బ్యాక్డ్రాప్తో సాగుతుందని టాక్. పూర్తిస్థాయి మాస్ అవతార్తో కూడిన యాక్షన్ ఎలిమెంట్స్ ఒకవైపు, ఫ్యామిలీ ఎమోషన్స్ మరోవైపు సమపాళ్లలో కుదిరేలా స్క్రిప్ట్ను ఎంతో పక్కాగా డిజైన్ చేశారు. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఆయన ప్రతి చిన్న విషయంలోనూ చాలా కసరత్తు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.* అలాంటి బంధం కంటే ఒంటరిగా మిగిలిపోవడమే బెటర్.. పెళ్లి, విడాకులపై త్రిష బోల్డ్ కామెంట్స్ పాన్-ఇండియా రేంజ్ మేకింగ్ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు కీలక విశేషాలను పంచుకున్నారు. బాలకృష్ణ ఇమేజ్కు, కొరటాల శివ కథకు తగినట్లుగా ఈ చిత్రాన్ని దాదాపు రూ.150 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, పాన్-ఇండియా స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ విజువల్ వండర్ను తెరకెక్కించనున్నారు. అమరావతిలో నగరంలో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఎలాంటి విరామం లేకుండా లాంగ్ షెడ్యూల్స్తో చిత్రీకరణ పూర్తిచేసి 2027 సమ్మర్ కానుకగా గ్రాండ్గా విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.