.webp&w=3840&q=75)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోంది. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ఆయన తాజాగా వార్తల్లో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోంది. . గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ఆయన తాజాగా వార్తల్లో నిలిచారు. ఐదేళ్ల కిందటి ఒక వివాదంలో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021 ఫిబ్రవరి నాటి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని.. గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచార పర్వంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల కోడ్) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించేలా ఆయన మాట్లాడారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు, స్థానిక పోలీసులు గుడివాడ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు.
అయితే.. 2021లో కేసు దర్యాప్తు పూర్తయినప్పటికీ.. కొడాలి నాని అప్పట్లో మంత్రిగా ఉండటంతో ఆయనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరమైంది. ముందస్తు అనుమతి కోసం పంపిన ఆ ఫైల్, వైసీపీ హయాంలో ఎలాంటి కదలికా లేకుండా హోంశాఖలోనే పెండింగ్లో ఉండిపోయింది. దీంతో ఈ కేసు విచారణకు బ్రేక్ పడింది. కానీ.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుుడు.. 2021 నాటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కొడాలి నానిపై ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నట్లు నిర్ధారించి.. తక్షణ చర్యలకు ఆదేశించడంతో, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ మాజీ మంత్రి కొడాలి నానిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి అనుమతినిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ రావడంతో కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన మాజీ మంత్రి నాని, తక్షణ ఉపశమనం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హోంశాఖ జారీ చేసిన ప్రాసిక్యూషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. తనపై నమోదైన పాత కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఇదే తరహా అంశంపై తాను న్యాయస్థానం నుండి కొన్ని ఉపశమనాలు పొందిన విషయాన్ని నాని తన పిటిషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు ఎప్పుడు విచారణ జరుపుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
బసవతారకం క్యాన్సర్ హాస్పటల్.. ఒక మహోన్నత మానవతా ఉద్యమం!
.