
'కాంతార: చాప్టర్ 2' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి రుక్మిణి వసంత్ ఫేక్ బికినీ వీడియోలు, ఫొటోల ప్రచారానికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
వికృతానందం కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించడం గమనార్హం.అరెస్ట్ అయిన ముగ్గురూ ఉన్నత విద్యావంతులు, మంచి ఉద్యోగాల్లో ఉన్నవారే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిందితులను బాగల్కోట్కు చెందిన రవికుమార్, తీర్థహళ్లికి చెందిన చంద్రకాంత్, బెంగళూరుకు చెందిన రంజిత్ కుమార్గా గుర్తించారు. వీరిలో రంజిత్ కుమార్ రూ.20 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా, చంద్రకాంత్ ఒక ప్రముఖ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్గా (సీఏ) పనిచేస్తున్నాడు. మరో నిందితుడు రవికుమార్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, తన యూట్యూబ్ ఛానెల్కు వ్యూస్ పెంచుకునేందుకు ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు.నటి రుక్మిణి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఖాతాలకు సంబంధించిన వివరాల కోసం 'మెటా'ను సంప్రదించారు. నిందితులు తప్పుడు చిరునామాలు ఇచ్చినా, యూఆర్ఎల్ ఐడీల ద్వారా వారిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ ఉపయోగించి నటి ఫొటోలను మార్ఫింగ్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.ఈ ఫేక్ చిత్రాలు, వీడియోలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని, తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని రుక్మిణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీని మంచి పనుల కోసం వాడాలని, ఇలాంటి దుశ్చర్యలకు కాదని ఆమె ఆవేదన వ్యక్తం