
ఎన్నో ఆశలతో కొనుక్కున్న అత్యంత ఖరీదైన లగ్జరీ యాట్ (విలాసవంతమైన పడవ), యజమానికి చేరిన నాలుగే రోజులకే సముద్రంలో జలసమాధి అయింది. సుమారు 9.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.75 కోట్లు) విలువైన ఈ నౌక, ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు రేగాయి. ఎలాగో మంటలు ఆర్పినప్పటికీ, ఆ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన ఇటలీలోని సార్డీనియా తీరంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో నౌకలో 14 మంది ఉన్నప్పటికీ, వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.వివరాల్లోకి వెళితే, ఇటలీకి చెందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ పెర్మారే (Permare) నిర్మించిన 'అంగియోలా-2' అనే 98 అడుగుల అమెర్ F100 మోడల్ యాట్ను ఇటీవలే ఓ ఇటాలియన్ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. మంగళవారం నాడు ఆ నౌకలో 14 మంది అతిథులు, సిబ్బందితో కలిసి ఆయన సార్డీనియాలోని పోర్టో సెర్వో తీరంలో విహారానికి వెళ్లారు. ప్రయాణం మధ్యలో నౌక ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. కొద్దిసేపటికే మంటలు చెలరేగి నౌక మొత్తం వ్యాపించాయి.ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే సహాయం కోసం అభ్యర్థించారు. మంటల కారణంగా నౌకలోకి భారీగా నీరు చేరడంతో అది ఒక పక్కకు ఒరిగి నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభించింది. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. దగ్గరలో ఉన్న మరో నౌక సిబ్బంది వెంటనే స్పందించి, ప్రమాదంలో చిక్కుకున్న 14 మందిని సురక్షితంగా కాపాడారు. అందరినీ కాపాడిన తర్వాతే యజమాని చివరి వ్యక్తిగా నౌకను వీడినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ నౌక శిథిలాలు