
దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 5 రైల్వేస్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఇన్కమ్ ఎంతో తెలుసా
భారతీయ రైల్వే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులనే కాదు వేల టన్నుల సరుకులను కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తోంది ఈ రైల్వే వ్యవస్థ. అయితే రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుల్లో ప్రయాణికుల రవాణాదే కీలకపాత్ర. దేశంలోని కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో పాటు భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన రైల్వే స్టేషన్లు ఏవో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అత్యధిక ఆదాయం ఆర్జించిన స్టేషన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ ఒక్క స్టేషన్ నుండే సంవత్సరానికి రూ.3,337 కోట్లకు పైగా ఆదాయం రైల్వే శాఖకు సమకూరుతోంది. ఏటా సుమారు 3.93 కోట్ల మంది ప్రయాణికులు ఈ న్యూఢిల్లీ స్టేషన్ను ఉపయోగించుకుని రాకపోకలు సాగిస్తున్నారట. ఇలా దేశంలోని అత్యంత కీలకమైన రైల్వే హబ్లలో ఇది ఒకటి. ఉత్తర భారతదేశంలోని అనేక నగరాలకు, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సుదూర రైళ్లకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. కొత్త ఢిల్లీ నగర నిర్మాణంతో పాటు ఈ స్టేషన్ అభివృద్ధి చెందింది. ప్రస్తుతం స్టేషన్లో 16 ప్లాట్ఫారాలు ఉన్నాయి. స్టేషన్ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పనులు చేపట్టారు. ప్రయాణికులకు మెరుగైన వెయిటింగ్ ఏరియాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, మెరుగైన సైన్బోర్డులు, భద్రతా వ్యవస్థలు, రైలు-మెట్రో-బస్ వంటి రవాణా మార్గాలను అనుసంధానించే మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ వంటి సదుపాయాలు ఈ అభివృద్ధిలో భాగంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్ ఆదాయ పరంగా దేశంలో రెండో స్థానంలో ఉంది. ఈ స్టేషన్ రూ.1,692 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఆర్జించింది. అయితే ప్రయాణికుల సంఖ్యను పరిశీలిస్తే హౌరా మరింత