
Thousand Pillar Temple | త్రిముఖ గణపతిగా వేయిస్తంభాల ఉత్తిష్ఠ గణనాథుడు
చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వర్తించారు.

చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వర్తించారు.

లెజెండరీ నటి షావుకారు జానకి హఠాన్మరణం చిత్ర పరిశ్రమ ని విషాదంలోకి నెట్టేసింది. ఆమె శ్వాస సంబంధించిత సమస్యలతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. దీంతో సౌత్ సినిమాలో విషాదం నెలకొంది. అయితే షావుకారు జానకికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె సంపాదించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు షాకిస్తున్నాయి. స్వయంగా జానకినే తాను ఎంత సంపాదించిందో తెలిపారు. వేల కోట్లు సంపాదించినట్టు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కెరీర్ని ప్రారంభించింది జానకి. తాను సినిమాల్లోకి వెళ్లాలనుకున్న సమయంలోనే ఇంట్లో పెళ్లి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఇబ్బందులు ఫేస్ చేసింది. ఈ క్రమంలో భర్తని ఒప్పించి ఇళ్లు గడవడం కోసం ఆమె నటిగా బిగ్ స్క్రీన్పైకి ఎంట్రీ ఇచ్చారు. `షావుకారు` చిత్రంతో బిగ్ బ్రేక్ అందుకున్నారు. ఆ మూవీ టైటిల్నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఏడు దశాబ్దాలుగా నటించారు. రాణించారు. ఈ క్రమంలో తాను బాగా ఆస్తులు సంపాదించారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టిమెంట్ పెట్టారు. ఇటు హైదరాబాద్, అటు చెన్నైలో భారీగా ఆస్తులు కొన్నారు. కొన్ని తన భర్త పేరుతోనూ రిజిస్టర్ చేయించారు. అయితే జానకి సంపాదించడంతో భర్త శంకరమంచి శ్రీనివాసులు జల్సాలకు అలవాటు పడ్డారు. జాబ్ వదిలేసి భార్య సంపాదనతో బతకడం స్టార్ట్ చేశారు. అప్పట్లో భారీగా డబ్బు రావడంతో తాను ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు, తాగుడికి బానిసయ్యారు. ఈ క్రమంలో ఆస్తులన్నీ కరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఇది సరిగా లేదని చెప్పి జానకి.. భర్తకి దూరంగా ఉన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆస్తులన్నీ పోయాయి. అయినా భర్త బాగోగులు చూసుకున్నారు జానకి. అయితే తాను కొన్న ఆస్తులు, పోయిన ఆస్తుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జానకి స్పందించారు. తాను కొన్న ఆస్తులు ఇప్పుడు ఉండి ఉంటే వాటి విలువ వందల కోట్లు కాదు, వేల కోట్లు ఉంటాయని చెప్పారు. అవన్నీ

తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సోమవారం ‘సర్’ ప్రక్రియ ముగియనుంది. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో (Telangana SIR Process) 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈరోజు (సోమవారం) ‘సర్’ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అయింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26,448 ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. డిజిటలైజేషన్లో హైదరాబాద్ 58.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్ – మల్కాజిగిరి 63.82 శాతం, రంగారెడ్డి 64.91 శాతం రికార్డైంది. అత్యధిక డిజిటలైజేషన్తో యాదాద్రి భువనగిరి 94.30 తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్లో 89.45 శాతం, జగిత్యాలలో 89.60 శాతం పూర్తి అయింది. రెండు సార్లు గడువు పొడిగించిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పెరగలేదు. కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్ సీనియర్ సిటిజన్లే టార్గెట్గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్