
Thanuja Puttaswamy : సీరియల్ నటి తనూజ వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
బిగ్బాస్ ఫేమ్, సీరియల్ నటి తనూజ (Thanuja Puttaswamy) వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

బిగ్బాస్ ఫేమ్, సీరియల్ నటి తనూజ (Thanuja Puttaswamy) వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
ఆ మధ్య ఓ ఈవెంట్లో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల , రన్నర్ తనూజ కనిపించినప్పుడు.. స్టేజ్పై తనూజ అసలు కళ్యాణ్ మొహం కూడా చూడలేదు. అందర్నీ నవ్విస్తూ పలకరించింది కానీ.. కళ్యాణ్ పడాలతో పడనట్టుగానే కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. నిజానికి ఆ కార్యక్రమానికి ముందు.. వాళ్లు ఒకర్నొకరు పలకరించుకున్నారు.. మాట్లాడుకున్నారు.. నవ్వుకున్నారు. కానీ స్టేజ్పై మాత్రం ఒక సందర్భంలో ఒకరికొకరు పడనట్టుగా కనిపించేసరికి వీళ్ల మధ్య ఏదో గొడవ అయ్యింది? తనూజ కళ్యాణ్ని దూరం పెట్టేసింది.. వాళ్లిద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి.అయితే ఆ వీడియోపై స్పందించిన కళ్యాణ్ పడాల.. తనూజ పేరు కూడా ప్రస్తావించకుండానే తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్ పడాల మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ఎవరు పుట్టిస్తారంటే.. ఖాళీగా ఉండి.. మూడు పూటలా తిని.. ఏం చేయాలో తెలియక.. మాలా ఒకపూట తినేవాళ్లపై కామెంట్స్ చేస్తుంటారు. ఒక్కోసారి మాకు ఒక్కపూట కూడా తినడానికి టైమ్ ఉండదు. మా మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు. బయట కలిసినప్పుడు ఏవేవో వాళ్లే కల్పించేసుకుని వైరల్ చేస్తుంటారు. అయినా మాకేం గొడవలు ఉంటాయి. నాతో ఎవరికీ గొడవలు ఉండవు.అప్పుడు వెళ్లిపోతా అనుకున్నా..ఆటలో గెలవడం కాదు.. ఎలా గెలిచాం అన్నదే ముఖ్యం. నేను గేమ్పైనే ఫోకస్ పెట్టా.. బయట వాళ్లు ఏం అనుకుంటున్నారా? అని ఆలోచిస్తే సరిగా ఫోకస్ పెట్టలేం. నేను ప్రియ హౌస్లో ఉన్నప్పుడు.. బయట ఏం జరుగుతుంది? నేనే వెళ్లిపోతానా? అనే డౌట్ వచ్చింది. కానీ నా మీద నాకు హోప్స్ వచ్చాయి.ఇది ఓపెన్ సీక్రెట్.. బిగ్ బాస్లో కనిపించనట్టే కనిపిస్తే జనం యాక్సెప్ట్ చేయరు..నాకు మంచి యాక్టర్ అవ్వాలని ఉంది అని బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే చెప్పాను. నాకు అన్నీ హీరో లెవల్ స్టోరీలే వస్తున్నాయి. డిఫరెంట్స్ క్యారెక్టర్స్ చేయడానికి నేను సిద్ధమే. కానీ.. చాలామంది నేను

ఏపీలో అరకు వైఎస్సార్సీపీ ఎంపీ గుమ్మ తనూజరాణి (Gumma Thanuja Rani) ఇవాళ తమిళనాడు వెళ్లి సీఎం విజయ్ (CM Vijay)తో భేటీ అయ్యారు. తనతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకుని అక్కడికి వెళ్లారు. దీంతో విజయ్ కూడా వీరికి స్వాగతం పలికారు. ఆత్మీయంగా కలిసి మాట్లాడారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు. ఏపీ రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఓ కీలక కారణం కూడా ఉంది. ఈ విషయాన్ని ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ కూడా చేశారు.ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!పార్లమెంటరీ పట్టణ, అభివృద్ధి అధ్యయన పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ను తమిళనాడు సచివాలయంలో కలిసినట్లు తనూజరాణి తెలిపారు. విజయ్ తో తనూజరాణి, ఆమె భర్త, వైసీపీ నేత చెట్టి వినయ్ కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన అరకు ఎంపీ దంపతులకు సీఎం విజయ్.. ఆత్మీయంగా ఓ జ్ఞాపిక కూడా అందజేశారు. ఈ భేటీలో అరకు గిరిజన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెట్ట వికాస్ కూడా పాల్గొన్నారని ఎంపీ తనూజ తెలిపారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!గతంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ను సీఎం కాకముందే విజయ్ చెన్నైలో జరిగిన ఓ వ్యక్తిగత కార్యక్రమంలో కలిశారు. అప్పట్లో జగన్ సోదరుడి పెళ్లి సందర్భంగా విజయ్ అక్కడికి రావడంతో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ తర్వాత మాత్రం వైసీపీ నేతలు ఎక్కడా విజయ్ తో కనిపించలేదు. కానీ ఇప్పుడు అరకు ఎంపీ తనూజరాణి ఏకంగా కుటుంబంతో కలిసి వెళ్లి విజయ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ పార్లమెంటరీ పట్టణాభివృద్ధి అధ్యయన పర్యటన కోసం అక్కడికి వెళ్లినట్లు ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ చేయడంతో ఊహాగానాలకు కూడా తావులేకుండా పోయింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను వైఎస్సార్సీపీ ఎంపీ కలిశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకుఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి, తన భర్త వినయ్తో కలిసి చెన్నైలోని సచివాలయంలో విజయ్తో సమావేశం అయ్యారు. పార్లమెంటరీ స్టడీ టూర్ కోసం ఎంపీ తనూజ రాణి చెన్నైకి వెళ్లారు.. ఈ సందర్భంగా సీఎం విజయ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమిళనాడు సీఎంను కలవడం ఆనందంగా ఉందంటూ ఫోటో, వీడియోను పోస్ట్ చేశారు.ఎంపీలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్టడీ టూర్ కోసం చెన్నై వెళ్లారు. CMDA (చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ), తమిళనాడు అర్బన్ హ్యాబిటాట్ డెవలప్మెంట్ బోర్డు, CMRL (చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్), గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, కమిషనరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, CMWSSB (చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) సంస్థల ఉన్నతాధికారులతో పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పట్టణ ప్రణాళికను మరింత బలోపేతం చేయడం, ప్రజా మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, గృహ నిర్మాణం, రవాణా సౌకర్యాలు, నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచడం, స్థిరమైన అభివృద్ధిని సాధించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ కమిటీలో మరికొందరు ఎంపీలు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలిశారు.2024 ఎన్నికల్లో తనూజ రాణి అరకు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. తనూజ అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోడలు. పాల్గుణ 2019 ఎన్నికల్లో అరకు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు 2024 ఎన్నికల్లో సీటు దక్కలేదు.. ఆయన స్థానంలో రేగ మత్స్యలింగంకు టికెట్ కేటాయించారు. అయితే పాల్గుణ కోడలు తనూజకు అరకు ఎంపీగా అవకాశం ఇచ్చారు. తనూజ రాణి డాక్టర్ కాగా.. మాజీ ఎమ్మెల్యే పాల్గుణ
కుకింగ్ షో అయినా రియాల్టీ షో అయినా ఏ షో అయినా సరే దానికంటూ ఓ టీం ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని షోల్లో కొన్ని సార్లు వీళ్లే ఎందుకు గెలిచారు? వీళ్లని ఎందుకు ఎలిమినేట్ చేశారు.. అనేది చెప్పడం కష్టమే అవుతుంది. ఆడియెన్స్ ఓటింగ్ అయినా, జడ్జ్ల జడ్జ్మెంట్ అయినా కూడా షోని నిర్వహించే టీం పక్కన పెట్టేయగలదు. అందుకే ఈ మధ్య ఏ షోలో ఎవరు గెలిచినా కూడా కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కుకు విత్ జాతిరత్నాలు రెండో సీజన్ విన్నర్ మీద చర్చ మొదలైంది. తనూజ దాదాపు విన్నర్ అని సీజన్ ఆరంభంలోనే అందరికీ అర్థమైంది. ఆషిక, డెమాన్ పవన్, నిఖిల్, రాకేష్ వంటి వారు కూడా అద్భుతంగా వంటలు వండేవారు. టాప్ 5లో వీరంతా ఉండటానికి అర్హులే. అయితే తనూజను విన్నర్ని చేయడంతో కొంత మంది స్టార్ మా ముద్దు బిడ్డ కదా.. విన్నర్ని చేస్తారులే అని కామెంట్లు చేశారు. కానీ తనూజ కూడా తన కుకింగ్తో ప్రతీ వారం టాప్లో నిలుస్తూ వచ్చింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ఆషిక కూడా అదరగొట్టేసింది. కానీ చివరకు వచ్చిన రౌండ్లో తనూజ, డెమాన్ పవన్ టాప్ 2 ప్లేస్లోకి వచ్చారు.ఇక విన్నర్గా తనూజను ప్రకటించేశారు. అదంతా ముగిసింది. కానీ జడ్జ్ల్లో ఒకరైన ముచ్చర్ల అరుణ రియల్ విన్నర్ డెమాన్ పవన్ అని ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. ఎంత వేగంగా డిలీట్ చేసినా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అయితే వైరల్ అవుతాయి. ముచ్చర్ల అరుణ అలా పోస్ట్ వేసి డిలీట్ చేయడంతో అందరికీ అనుమానం మొదలైంది. తనూజ రియల్ విన్నర్ కాదా? ఆమెను కావాలనే గెలిపించారా? అని అంతా అనుకోవడం ప్రారంభించారు. అయితే ముచ్చర్ల అరుణ మాత్రం డ్యామేజ్ కంట్రోల్కి
కుకు విత్ జాతిరత్నాలు రెండో సీజన్ ముగిసింది. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరిగింది. ఈ ఎపిసోడ్ సాయంత్రం టీవీల్లో ప్రసారం అవుతుంది. అయితే జియో హాట్ స్టార్లో మాత్రం ఆల్రెడీ వచ్చేసింది. ఇక దీంతో విన్నర్ ఎవరు అన్నది ముందే తెలిసిపోయింది. ఈ రెండో సీజన్ విన్నర్గా తనూజ నిలిచింది. ఫస్ట్ సీజన్లోనూ తనూజ కుక్గా వచ్చింది. అయితే చివరిలో మిస్ అయింది. ఫస్ట్ సీజన్ విన్నర్గా వదినమ్మ ఫేమ్ సుజిత నిలిచింది. ఈ రెండో సీజన్ విన్నర్గా తనూజ నిలిచింది. ఇక బిగ్ బాస్ షోలో రన్నర్గా, కుకు షో విన్నర్గా తనూజ మరింత క్రేజ్ను దక్కించుకున్నట్టు అయింది.ఈ ఫినాలే ఎపిసోడ్లో రాకేష్ పాన్ ఇండియా డిష్ చేశాడు. ప్రతీ ఒక్క స్టేట్ నుంచి స్పెషల్ వంటకాన్ని తీసుకు వచ్చి థాలిని ప్రజెంట్ చేశాడు. సమన్వయ థాలీ అని ధమ్ ఆలు, దావత్ మటన్, సుల్తాన్ దాల్, పంత్ పరోరాట, మకాన కీర్, నైచూర్లను చేసి పెట్టాడు. తక్కువ టైంలో ఇన్ని వెరైటీలు చేయడం గ్రేట్ అని మెచ్చుకున్నారు. ఇక నిఖిల్ చేసిన నల్లి బొక్కల మటన్ ధమ్ పలావ్ విత్ మలబార్ చికెన్, కొకొనట్ పలావ్, చాక్లెట్ విత్ ఫ్రూట్ అండ్ నట్స్ని బాగుందని అన్నారు. ప్రజెంటేషన్ కూడా బాగుందని మెచ్చుకున్నారు