
శఫాలి వర్మ చరిత్ర సృష్టించింది.. మహిళల ఆసియా కప్లో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించింది
భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ శఫాలి వర్మ, మహిళల ఆసియా కప్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. 2026 సెప్టెంబర్ 13న శ్రీలంకత

భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ శఫాలి వర్మ, మహిళల ఆసియా కప్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. 2026 సెప్టెంబర్ 13న శ్రీలంకత

భారత క్రికెట్ జట్టులో 15 సంవత్సరాల యువ ఆటగాడు వైదవ్ సూర్యవంశీ, ఆఫ్గానిస్థాన్తో జరుగుతున్న మొదటి t20i మ్యాచ్లో భాగంగా ఆడటం లేదు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 13న న్యూఢి

India T20I Squad for Afghanistan Series: రింకు సింగ్ భారత్ తరపున ఫినిషర్గా అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు నుంచి తొలగించబడ్డాడు. అనంతరం, అతను అకస్మాత్తుగా జింబాబ్వే సిరీస్కు ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి జట్టు నుంచి తప్పించారు. జింబాబ్వేతో జరిగిన సిరీస్లో 12, 25 పరుగులు చేసిన రింకు సింగ్కు అవకాశం లభించగా, ఇప్పుడు అతడిని టీ20 జట్టు నుంచి తొలగించారు. అయితే, ఆ తర్వాత రింకు సింగ్ యూపీ టీ20 లీగ్లో మంచి ఫామ్ను కనబరిచాడు. అతను మీరట్ తరపున 7 మ్యాచ్లలో 42.25 సగటుతో 19 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 219 కాగా, అతను 15 సిక్సర్లు కొట్టాడు. అయినప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్లో టీమిండియా అతనికి అవకాశం ఇవ్వలేదు. ఫినిషర్ పాత్రను పోషించే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. అక్షర్ పటేల్, శివమ్ దుబే కూడా జట్టులో ఉన్నారు. అందువల్ల, రింకుకు టీమ్ ఇండియాలో స్థానం సంపాదించడం కష్టంగా ఉంది. రింకు సింగ్ టీమ్ ఇండియా తరపున 48 టీ20 మ్యాచ్లలో 36.94 సగటుతో 702 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 156.34గా ఉంది. అయినప్పటికీ, అతను జట్టులో తన స్థానాన్ని పదిలపరచుకోలేకపోయాడు

అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్తోనే పాండ్య.. కానీ, కెప్టెన్గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. India Squad for Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్తో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్కు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్గా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్ ఆధారంగా ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా మొదటి టీ20: సెప్టెంబర్ 13, 2026 (ఆదివారం) రెండవ టీ20: సెప్టెంబర్ 15, 2026 (మంగళవారం) మూడవ టీ20: సెప్టెంబర్ 17, 2026 (గురువారం) గమనిక: ఈ మూడు మ్యాచ్లు కూడా ఢిల్లీ వేదికగానే జరగనున్నాయి

అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రకటించిన ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఉన్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాకు అవకాశం లభించింది. అయితే నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్దీప్, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లు జరగనున్నాయి. మూడు మ్యాచ్లకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. తొలి టీ20 సెప్టెంబర్ 13న ఆదివారం, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 15న మంగళవారం, మూడో టీ20 సెప్టెంబర్ 17న గురువారం జరగనుంది. ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు కూడా సెలక్షన్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లైన బుమ్రా, అర్ష్దీప్, అక్షర్ పటేల్ల అనుభవం జట్టుకు బలంగా మారనుంది. మూడు మ్యాచ్లు ఢిల్లీలోనే జరగనున్న నేపథ్యంలో స్వదేశంలో అఫ్గానిస్థాన్ను ఎదుర్కొనేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కొత్త కాంబినేషన్తో బరిలోకి దిగనున్న టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది

Namibia vs Zimbabwe Records: టీ20 క్రికెట్లో రికార్డులు బద్దలవడం సహజమే. కానీ ఒకే మ్యాచ్లో ఒకే రికార్డు రెండుసార్లు బద్దలవడం మాత్రం అరుదైన విషయమే. జింబాబ్వే-నమీబియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఇదే జరిగింది. ఏడో వికెట్కు అత్యధిక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రపంచ రికార్డు ఒకే మ్యాచ్లో రెండుసార్లు కొత్త రూపు దాల్చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఒక దశలో 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రియాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్ జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్కు కేవలం 48 బంతుల్లోనే అజేయంగా 94 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఏడో వికెట్కు అత్యధిక భాగస్వామ్య రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. అంతకుముందు 2021లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేనియల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్ నెలకొల్పిన 92 పరుగుల రికార్డును అధిగమించారు. బర్ల్ 32 బంతుల్లో 57 పరుగులతో అజేయంగా నిలవగా.. ఎవాన్స్ 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా ఆరంభంలో తడబడింది. కానీ ఏడో వికెట్కు వచ్చిన జేన్ గ్రీన్, అలెగ్జాండర్ బుసింగ్-వోల్చెంక్ అద్భుత పోరాటం చేశారు. ఇద్దరూ జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ కేవలం 51 బంతుల్లో 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కొద్దిసేపటి క్రితమే బర్ల్-ఎవాన్స్ నెలకొల్పిన 94 పరుగుల ప్రపంచ రికార్డు మళ్లీ బద్దలైంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఏడో వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. వోల్చెంక్ 29 బంతుల్లో 56 పరుగులతో చెలరేగగా.. గ్రీన్ కూడా వేగంగా పరుగులు సాధించాడు. నమీబియా విజయానికి చేరువగా వచ్చినా చివరి దశలో వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో నమీబియాకు 16 పరుగులు అవసరమయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఆ ఓవర్లో

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మరో ఆసక్తికరమైన సిరీస్కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల సెప్టెంబర్ 2026లో ఈ సిరీస్ జరగనుంది. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) స్పష్టం చేసింది. ఇటీవలే భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఒక టెస్ట్ మ్యాచ్తో పాటు మూడు వన్డేల్లో తలపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 ఫార్మాట్లో మరోసారి ఇరు జట్లు పోటీ పడనున్నాయి. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఈ సిరీస్పై ఆసక్తి పెరిగింది. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మూడు టీ20 మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో వరుసగా మూడు మ్యాచ్లు జరగనున్నాయి. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగస్టు 10న తమ వాటాదారులకు పంపిన లేఖలో ఈ తేదీలను వెల్లడించింది. ఈ సిరీస్కు సంబంధించిన తేదీలు, వేదికలపై బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, రెండు బోర్డులు దీనికి అంగీకరించాయని ACB తెలిపింది. అంటే సెప్టెంబర్ 13న తొలి టీ20, సెప్టెంబర్ 15న రెండో టీ20, సెప్టెంబర్ 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్లు కూడా ఢిల్లీలోనే నిర్వహించనున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ ఈ సిరీస్పై తమ కమర్షియల్ పార్టనర్లకు పంపిన లేఖలో స్పష్టత ఇచ్చారు. 2026లో అఫ్గానిస్థాన్ జట్టు భారత్ పర్యటన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. సిరీస్ తేదీలు, మ్యాచ్ల వేదికల విషయంలో బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, వాటికి ఆమోదం లభించిందని నసీబ్ ఖాన్ పేర్కొన్నారు. మూడు టీ20 మ్యాచ్ల షెడ్యూల్ ఖరారైనప్పటికీ.. సాధారణ ప్రజల కోసం ఇరు బోర్డుల నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదని ACB తెలిపింది. అయితే తమ