
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

కడపలో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో ఈ స్టార్టప్ హబ్ను నిర్మించారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 నమూనాలో రూపొందించిన ఈ భవనంలో యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ స్టార్టప్ హబ్ ప్రారంభం కానుంది. జిల్లా యంత్రాంగం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించింది. రాయలసీమలో సాంకేతిక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపునిచ్చే కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హై-స్పీడ్ ఇంటర్నెట్, ఆధునిక వర్క్ స్పేస్లు, ప్రొటోటైపింగ్ ల్యాబ్లు, సాంకేతిక సాఫ్ట్వేర్ టూల్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త ఉత్పత్తులు, సాంకేతిక పరిష్కారాలను రూపొందించే యువతకు ప్రయోగాత్మక వాతావరణం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం కేవలం ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించడం కాదు. యువతను స్వయం ఉపాధి, స్టార్టప్ల వైపు మళ్లించి భవిష్యత్లో ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త వ్యాపార ఆలోచన ఉన్న విద్యార్థి లేదా యువకుడు ప్రారంభ దశలో ఎదుర్కొనే అనేక సమస్యలకు ఇక్కడ మార్గదర్శకత్వం లభించే అవకాశం ఉంది. ఆలోచనను ఎలా అభివృద్ధి చేయాలి, వ్యాపార ప్రణాళికను ఎలా సిద్ధం చేయాలి, మార్కెట్ అవసరాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి అంశాలపై నిపుణుల సహకారం అందించనున్నారు. ముఖ్యంగా చిన్న ఆలోచనతో ప్రారంభమైన ప్రాజెక్టును వాణిజ్యపరంగా విజయవంతమైన సంస్థగా మార్చేందుకు అవసరమైన ఎకోసిస్టమ్ను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. స్టార్టప్ ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం ఎంతో కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమలకు చెందిన నిపుణులతో మెంటార్షిప్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఐఐఎంలకు చెందిన నిపుణులతో పాటు గ్లోబల్ టెక్నాలజీ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. విజయవంతమైన వ్యాపార నమూనాలు

భారతదేశంలో స్టార్టప్లు, చిన్న వ్యాపారాలకు చేయూతనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. ఆలోచన దశ నుంచి ప్రోటోటైప్ తయారీ, వెంచర్ క్యాపిటల్, రుణాల సమీకరణ వరకు వివిధ దశల్లో ఈ పథకాలు అండగా నిలుస్తున్నాయి. అయితే, ప్రతి పథకం అందించే సహాయం, దాని స్వరూపం వేర్వేరుగా ఉంటాయి. అన్ని పథకాలు నేరుగా వ్యవస్థాపకుల చేతికి డబ్బును అందించవన్న విషయాన్ని గమనించాలి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనేక గణాంకాలు పాతవి లేదా తప్పు అని అధికారిక సమాచారం స్పష్టం చేస్తోంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన పథకాలలో నిధి-ప్రయాస్, సమృద్ధి, టైడ్ 2.0, స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ (CGSS), క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (CGTMSE) ఉన్నాయి. ఈ పథకాలపై పూర్తి అవగాహనతో ముందడుగు వేయడం వ్యవస్థాపకులకు ఎంతో అవసరం.ప్రోటోటైప్, ప్రారంభ దశ కోసం పథకాలునిధి-ప్రయాస్ 2.0: సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద పనిచేసే ఈ పథకం, వినూత్న ఆలోచనలను ప్రోటోటైప్లుగా మార్చడానికి సహాయపడుతుంది. నిధి-ప్రయాస్ 2.0 కింద, టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలకు ఒక్కో స్టార్టప్కు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు ప్రోటోటైప్ ఫండింగ్ లభిస్తుంది. డీప్టెక్ వంటి అధునాతన ప్రోటోటైప్ల కోసం 'అడ్వాన్స్ ప్రయాస్ సెంటర్లు' రూ. 40 లక్షల వరకు సాయం అందిస్తాయి. గతంలో ఈ పథకం కింద గరిష్ఠ పరిమితి రూ. 10 లక్షలు మాత్రమే. ఇది మహిళల

బెంగళూరు: ఉదయం 10.15 గంటలు.. సాధారణంగా ఐటీ ఉద్యోగులతో కిక్కిరిసిపోయే సమయం. కానీ ఓ ఆఫీసులో మాత్రం చాలా డెస్క్లు ఖాళీగా కనిపించాయి. ఉద్యోగులు పని చేయడానికి ఇష్టపడటం వల్ల కాదు.. ఆఫీసుకు చేరుకునేలోపే వారి శక్తి మొత్తం ట్రాఫిక్లో ఆవిరైపోతోందట! బెంగళూరు ట్రాఫిక్ ఉద్యోగుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో ఓ స్టార్టప్ ఫౌండర్ పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. Applied AI Studio వ్యవస్థాపకుడు బాల పన్నీర్సెల్వం తన ఆఫీసులో ఖాళీగా ఉన్న డెస్క్ల ఫొటోను లింక్డ్ఇన్లో షేర్ చేశారు. “సమస్య మనుషుల్లో లేదు.. ఆఫీసుకు చేరుకోవడానికి పడుతున్న శ్రమలో ఉంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బెంగళూరు ఉద్యోగుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. 4 కిలోమీటర్లకు అరగంట.. బెంగళూరులో చిన్న దూరం ప్రయాణం కూడా పెద్ద సవాలుగా మారిందని బాల చెప్పారు. హెచ్ఎస్ఆర్ ప్రాంతంలో కేవలం 4 కిలోమీటర్లు వెళ్లేందుకు స్కూటర్పై సుమారు 20 నిమిషాలు, కారులో అయితే 30 నిమిషాల వరకు పడుతోందన్నారు. పీక్ అవర్స్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్లో వాహనాల మధ్య దారి వెతుక్కుంటూ.. సిగ్నల్స్ పట్టించుకోకుండా దూసుకొచ్చే ద్విచక్ర వాహనాలను తప్పించుకుంటూ ప్రయాణించే సరికి ఆఫీసుకు చేరుకునే సమయానికే ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారని చెప్పారు. 17 కిలోమీటర్లు.. 2 గంటలు! తనకెదురైన అనుభవాన్ని కూడా బాల పంచుకున్నారు. వర్షం లేకుండా, ఎలాంటి స్పష్టమైన అంతరాయం లేని రోజున సాయంత్రం 4 గంటలకు వైట్ఫీల్డ్ నుంచి హెచ్ఎస్ఆర్ వరకు 17 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా రెండు గంటలు పట్టిందని తెలిపారు. ఇక సాయంత్రం 6 తర్వాత ఆఫీసు నుంచి బయలుదేరితే ఇంటికి చేరుకునేందుకు మరింత సమయం పడుతోందన్నారు. 5 గంటలకే బయలుదేరిన ఉద్యోగులు కూడా ఇంటికి చేరేసరికి వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదించేంత శక్తి లేకుండా పోతున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్.. ప్రొడక్టివిటీకి విలన్? “ఇంత గందరగోళం మధ్య

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్కు చెందిన షాపింగ్ స్టార్టప్ ‘ఫియా’ (Phia) తీవ్రమైన ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది. ‘కుకీ స్టఫింగ్’ అనే మోసపూరిత టెక్నిక్ను ఉపయోగించి అక్రమంగా ఆదాయం పొందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఈ తరహా చర్యలను తీవ్రమైన ‘ఫెడరల్ వైర్ ఫ్రాడ్’గా పరిగణిస్తారు. ఒకవేళ నేరం రుజువైతే గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి అధికారిక అభియోగాలు నమోదు కాలేదు.అసలేమిటీ ‘కూకీ స్టఫింగ్’?వినియోగదారులు ఒక వెబ్సైట్ను సందర్శించినప్పుడు, వారు ఆ సంస్థ అందించే కూపన్లు లేదా ఇతర సేవలను వాడకపోయినా సరే, వారి బ్రౌజర్లో బలవంతంగా ట్రాకింగ్ కుకీలను చొప్పించడాన్ని ‘కుకీ స్టఫింగ్’ అంటారు. దీనివల్ల ఆ తర్వాత యూజర్ ఏదైనా కొనుగోలు చేస్తే, ఆ అమ్మకానికి తామే కారణమని చెప్పి ఆన్లైన్ రిటైలర్ల నుంచి ఈ సంస్థ అక్రమంగా కమీషన్లు పొందుతుంది.బ్లూమ్బెర్గ్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఫియా స్టార్టప్లో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సహ వ్యవస్థాపకులైన ఫోబీ గేట్స్, సోఫియా కియానీలకు కనీసం ఏడు నెలల ముందు నుంచే తెలుసని అంతర్గత సమాచారం సూచిస్తోంది. నైక్, గ్యాప్, నార్డ్స్ట్రామ్ వంటి ప్రముఖ రిటైలర్ల అమ్మకాలను ఈ విధానం ప్రభావితం చేసిందని, కంపెనీ చూపిన మొత్తం ఆదాయంలో అధిక భాగం దీని ద్వారానే వచ్చిందని ఆ నివేదిక పేర్కొంది.ఈ ఆరోపణలు బయటకు రావడంతో జులై 7న ఈ ఫీచర్ను నిలిపివేసినట్లు

ఐడియా పెద్దదైనంత మాత్రాన ఎక్కువ పెట్టుబడి కావాల్సిన అవసరం లేదని నిరూపించిన కథ ఇది. చేతిలో భారీగా నిధులు లేవు. పెద్ద ఆఫీసు లేదు. మార్కెట్లో పేరు లేదు. అయినా ఆరుగురు యువకులు ఒక కలను నమ్మారు. చేతిలో ఉన్న పొదుపు, అప్పులతో కలిపి రూ.1.87 లక్షలు సమకూర్చుకున్నారు. చివరకు ఆ ఆలోచనే భారత టెక్నాలజీ రంగాన్ని మార్చిన హెచ్సీఎల్గా ఎదిగింది.హెచ్సీఎల్ సహ వ్యవస్థాపకుడు అజయ్ చౌదరి ఈ సంస్థ తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు చేశారు. హెచ్సీఎల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి పరిస్థితులను ఆయన పంచుకున్నారు.చేతిలో రూ.1.87 లక్షలు1976లో కంప్యూటర్ అంటే భారత్లోనే కొత్త ఆలోచన. అలాంటి సమయంలో ఆరుగురు కలిసి సొంతంగా కంప్యూటర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వారి దగ్గర భారీ పెట్టుబడిదారులు లేరు. వెంచర్ క్యాపిటల్ సంస్థల మద్దతు లేదు. ఆరుగురూ కలిసి రూ.1.87 లక్షలు సమకూర్చుకున్నారు. కొంత డబ్బు అప్పుగా తెచ్చారు. మరికొంత పొదుపు నుంచి పెట్టారు. ఓ సందర్భంలో కారును కూడా అమ్మేశారు.చిన్న గదిలో తొలి అడుగుఢిల్లీలోని గోల్ఫ్ లింక్స్లో ఓ భవనంపై ఉన్న చిన్న గదే హెచ్సీఎల్ తొలి కార్యాలయమైంది. అప్పటికి వారు తయారు చేయాలనుకున్న కంప్యూటర్ పూర్తిగా సిద్ధం కాలేదు. బ్రోచర్ ఉంది. నమూనా ఉంది. యంత్రం మాత్రం ఇంకా రూపుదిద్దుకుంటోంది. అయినా ఆ ఆరుగురు వెనక్కి తగ్గలేదు. కంప్యూటర్ను విక్రయించేందుకు సంస్థలను కలవడం మొదలుపెట్టారు. తొలి ఆర్డర్లు ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చాయి.ఒక్క ఆర్డర్.. వరుసగా అవకాశాలువ్యాపార సంస్థలను