
చెంగాళమ్మ లేఅవుట్ వద్ద గుర్తుతెలియనివ్యక్తి మృతదేహం లభ్యం
Sullurpeta: చెంగాళమ్మ లేఅవుట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం! సూళ్ళూరుపేట: సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద లభ్యమైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని నాయుడుపేట డీఎస్పీ శ్రీ జి. చెంచుబాబు స్వయంగా పరిశీలించారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఆయన, మృతదేహం లభ్యమైన పరిస్థితులు, పరిసరాలను పరిశీలించి, లభించిన ఆధారాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో, ఎస్సై జి. అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి గుర్తింపు మరియు ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా అతనికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినట్లయితే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా సూళ్ళూరుపేట పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు

