కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూత.. 1984 నాటి సిక్కుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత
Former Congress MP Sajjan Kumar Death : వేలాది మంది ప్రాణాలను బలిగొన్న 1984 నాటి ఘోర సిక్కు వ్యతిరేక హింసాకాండ కేసులో ప్రధాన దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ గురువారం నాడు తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయస్సు కలిగిన ఆయన, ఢిల్లీలోని ప్రసిద్ధ తీహార్ జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంటనే జైలు అధికారులు అత్యవసరంగా సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆయన మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించి అధికారికంగా ప్రకటించారు.సిక్కు అల్లర్ల కేసు ఏమైందంటే?మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దారుణ హత్య అనంతరం 1984 నవంబర్ 1, 2 తేదీలలో దేశ రాజధానిలోని పాలం కాలనీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఆ భయానక ఘటనల్లో ఐదుగురు నిర్దోషులు ప్రాణాలు కోల్పోవడానికి సజ్జన్ కుమార్ ప్రత్యక్షంగా కారణం అయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ అల్లర్ల వ్యవహారంపై సుదీర్ఘంగా జరిగిన విచారణ అనంతరం.. ఆయనను తీవ్ర నేరస్థుడిగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు 2018 డిసెంబర్ 17న సంచలన తీర్పును ఇచ్చింది. ఈక్రమంలోనే జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆనాటి నుంచి ఆయన తీహార్ జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు. హైకోర్టు విధించిన ఈ కఠినమైన శిక్షను సవాలు చేస్తూ ఆయన దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఇన్నాళ్లూ సుప్రీం కోర్టులో విచారణ దశలోనే పెండింగ్లో ఉండిపోయింది.1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన పలు చోట్ల నమోదైన అనేక కేసులలో సజ్జన్ కుమార్ పేరు ప్రధానంగా వినిపించింది. రాజధాని పరిధిలోని జానక్పురి, వికాస్పురి ప్రాంతాల్లో అల్లర్లను తీవ్రంగా రెచ్చగొట్టారనే తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే ఈ కేసులను విచారించిన ఢిల్లీలోని స్థానిక


